Daggubati Purandeswari : ఎన్నికల అధికారులుగా ఉన్న వాళ్లు బాధ్యతతో వ్యవహరించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి సీరియస్ కామెంట్లు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశం పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పని చేయాలన్నారు. ఓ రాజకీయ పార్టీకో.. పొలిటికల్ లీడర్లకు అధికారులు అనుకూలంగా ఉండకూడదని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల అధికారులుగా ఉన్న వాళ్లు బాధ్యతతో వ్యవహరించాలని, అధికారులు ప్రజల పట్ల బాధ్యతతో ఉండాలి కానీ.. పార్టీ పట్ల కాదనే విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు పురందేశ్వరి. తప్పులు చేసే అధికారులు తీరు మార్చుకోకుంటే కేంద్రానికి ఫిర్యాదులు చేస్తామని, ఏపీలో దొంగ ఓట్ల అంశం ఆందోళన కలిగిస్తోందన్నారు పురందేశ్వరి. ఇప్పటికే దొంగ ఓట్ల వ్యవహరం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, మా ఫిర్యాదుతోనే ఐఏఎస్ అధికారి గిరీషా సహా ఇతర అధికారులను సస్పెండ్ చేశారని పురందేశ్వరి స్పష్టం చేశారు. వైసీపీ నేతలు – అధికారులు కుమ్మక్కై ఓటర్ల జాబితాలో అవకతవలు చేస్తున్నారని, క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్లే ఇంత పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలో అవకతవకలు చేయగలరన్నారు. తక్కువ మార్జినులో వైసీపీ ఓడిపోయే చోట్ల వైసీపీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నట్టు మాకు సమాచారం ఉందని, వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లకు వాడుకుంటామని మంత్రి ధర్మాన చెబుతున్నారన్నారు పురందేశ్వరి.
Also Read
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
- Rohit Sharma-BCCI: రోహిత్ కోసమా.. భారత క్రికెట్ కోసమా?.. సెలెక్టర్లపై మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు!
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
- Axar Patel: "రెండు సార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు".. రిషభ్ పంత్ రీఎంట్రీపై అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా వాడకూడదని సీఈసీ చెప్పిందని, వలంటీర్ల విషయంలో మంత్రి ధర్మాన కామెంట్లు ఆందోళన కలిగించే అంశమన్నారు. బీజేపీ ప్రజా సేవకు అంకితమైన పార్టీ అని పురందేశ్వరి అన్నారు. ప్రజా సేవ చేసి.. అధికారంలోకి రావాలనేది బీజేపీ ఉద్దేశమని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయని, 370 అనేది బీజేపీకి నంబర్ కాదు.. సెంటిమెంట్ అమె వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతోందని, పల్లెకు పోదాం అనే కార్యక్రమం ద్వారా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తున్నామన్నారు. మరో వైపు అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్రజా పోరు కార్యక్రమం చేపడుతున్నామని, కేంద్ర నిధులు ఆయా నియోజకవర్గాల్లో ఏ విధంగా అందుతున్నాయనే అంశాన్ని వివరిస్తున్నామన్నారు. అంతేకాకుండా.. పొత్తులపై పార్టీ అధిష్టానం చూసుకుంటుందని పురేందేశ్వరి స్పష్టం చేశారు. ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తామనేది కూడా హైకమాండే నిర్ణయిస్తుందని, పార్టీ బలోపేతం పైనే మేం ఫోకస్ పెట్టామన్నారు. కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారన్నారు.
తాజావార్తలు
-
Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
-
Rohit Sharma-BCCI: రోహిత్ కోసమా.. భారత క్రికెట్ కోసమా?.. సెలెక్టర్లపై మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు!
-
Peddi VS Devara : ‘దేవర’ని అందుకోలేకపోయిన ‘పెద్ది’.. ఛాన్స్ మిస్
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!