ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ పై 6 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హార్థిక్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో విజయం వరించింది. చివరలో మోహిత్ శర్మ కీలకమైన రెండు వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఉమేష్…
బీజేపీ అధిష్ఠానం లోక్సభ అభ్యర్థుల ఐదో జాబితాను రిలీజ్ చేసింది. 111 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో పలు కీలక స్థానాలకు అభ్యర్థులను నియమించింది. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ నుంచి బీజేపీ కీలక నేతను అభ్యర్థిగా ప్రకటించింది.
రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హోలి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే హోలి పండుగను రాష్ట్ర ప్రజలు సోమవారం కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. హోలి పండుగ అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి సంతోషంగా సాగాలన్న సందేశాన్ని ఇస్తుందన్నారు. ఈ రంగుల వసంతోత్సవం ప్రజల్లో కొత్త…
జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లను జనసేన పెండింగ్లో పెట్టింది.
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ (45) పరుగులతో రాణించాడు. చివరలో రాహుల్ తెవాటియా (22) పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్ స్కోరు అందించారు.
లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ అధిష్ఠానం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. ఏపీ నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది.
మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేవినేని ఉమాను కలుస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. టీడీపీ కేడర్ను మొత్తాన్ని కలుపుకుని ముందుకు వెళ్తానన్నారు. బొమ్మసాని సుబ్బారావు కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నపుడు తాను టీడీపీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టించలేదని పేర్కొన్నారు. కొండపల్లిలో మాత్రం అనుకోకుండా ఒకసారి అలా జరిగిన మాట వాస్తవమే.. అందులోనూ తన…
ఈసారి హోలీ పండుగను మార్చి 25న జరుపుకుంటున్నారు. సహజంగానే, పిల్లల ఆనందం లేకుండా ఏ పండుగ అయినా అసంపూర్ణంగా ఉంటుంది. హోలీ అంటేనే రంగుల పండగ. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా.. ఉల్లాసంగా చేసుకునే పండగ హోలీ. హోలీ వస్తుందంటే చాలు దేశమంతా అందరూ పండుగ చేసుకునేందుకు సిద్ధంగా ఉంటారు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ (IT)లో ఉద్యోగం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చాలా మంది యువత ఇందులో పని చేయాలని కలలు కంటూంటారు. అయితే.. ఈడీ, ఆదాయపు పన్ను శాఖలో పని చేయాలనుకునే వారు.. ఈ రెండు ఏజెన్సీల గురించి తెలుసుకోవాలి. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ అనేవి రెండు వేర్వేరు ప్రభుత్వ సంస్థలు. ఇవి.. ఆర్థిక అమలు, పన్నుల రంగంలో ఇవి విభిన్న పాత్రలు మరియు బాధ్యతలను కలిగి ఉంటాయి. ఈడీ,…
ఎక్కడికెళ్లినా అందరి నోట ఒకటే మాట… మోడీ కే మా ఓటు.. గ్రామాల్లో ముసలి వాళ్ళు సైతం మోడీ కే ఓటు అంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీ కి ఓటు వేసుకున్న ఈ ఎన్నికల్లో మోడీ కే వేస్తామని అంటున్నారని, తెలంగాణలో బీజేపీ 12 నుండి 15 స్థానాలు గెలుస్తుందన్నారు. 6 గ్యారంటీ లు అమలు కావాలి అంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అంటున్నారు…