MI vs GT: గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ.. 6 పరుగుల తేడాతో గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ పై 6 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హార్థిక్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో విజయం వరించింది. చివరలో మోహిత్ శర్మ కీలకమైన రెండు వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఉమేష్ యాదవ్ కూడా ముంబై కెప్టెన్ హార్థిక్ వికెట్ తీసి గుజరాత్ విజయం నమోదు చేశాడు.

Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఇక.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ (43) పరుగులతో రాణించినప్పటికీ, ఇషాన్ కిషన్ డకౌట్ తో నిరాశపరిచాడు. ఆ తర్వాత నమన్ ధీర్ (20), ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన డెవాల్డ్ బ్రెవిస్ (46) పరుగులు చేశాడు. ఆ తర్వాత తిలక్ వర్మ (25) ఉన్నంత సేపు కూడా బాగా ఆడాడు. టిమ్ డేవిడ్ (11) పరుగులు చేశాడు. చివరలో హార్థిక్ పాండ్యాపై అన్నీ ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఒక ఫోర్, ఒక సిక్సర్ తో గేమ్ ఆన్ లోకి వచ్చింది. కానీ ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో తెవాటియాకు క్యాచ్ ఔట్ ఇచ్చి దొరికిపోయాడు. దీంతో ముంబై ఓటమి ఖరారైంది. గుజరాత్ బౌలింగ్ లో అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సాయి కిషోర్ కు ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు.. మొదటగా బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ (45) పరుగులతో రాణించాడు. చివరలో రాహుల్ తెవాటియా (22) పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్ స్కోరు అందించారు. గుజరాత్ బ్యాటింగ్ లో ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (19), శుభ్ మాన్ గిల్ (31), అజ్మతుల్లా ఒమర్జాయ్ (17), డేవిడ్ మిల్లర్ (12), విజయ్ శంకర్ (6), రషీద్ ఖాన్ (4) పరుగులు చేశారు. ముంబై బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో చెలరేగాడు. గెరాల్డ్ కోయెట్జీకి 2 వికెట్లు దక్కాయి. పీయూష్ చావ్లా ఒక వికెట్ పడగొట్టాడు.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..