Home
Telugu News
Telugu News News
-
Top Headlines @5PM : టాప్ న్యూస్
ఉప్పల్ స్టేడియంకు ఐపీఎల్ అవార్డు! ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తుది పోరులో చేతులెత్తేసింది. ఆదివారం చెపాక్ మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఫైనన్లో సన్రైజర్స్ ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్లో తేలిపోయిన ఎస్ఆర్హెచ్.. రన్నరప్తో సరిపెట్టుకుంది. ఎస్ఆర్హెచ్ ఓటమితో అభిమానులే కాదు ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఓటమి బాధలో ఉన్న సన్రైజర్స్కు చిన్న ఓదార్పు దక్కింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు ఐపీఎల్… -
MLC Bypoll : తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనమండలికి సోమవారం ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఓటర్లు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. గత ఏడాది నవంబర్ 30న జనగాం నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను నామినేట్ చేయగా, బిజెపి జి… -
Amit Shah: కాంగ్రెస్ 40 సీట్లు దాటదు.. సమాజ్వాదీ పార్టీకి నాలుగు కూడా రావు
ఉత్తర ప్రదేశ్లోని బల్లియాలో జరిగిన సమావేశంలో కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు దశల్లో మోడీ 310 సంఖ్యను అధిగమించారని.. ఆరో దశలో 400 దాటిందని తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి దుమ్ము తుడిచిపెట్టుకుపోయిందని దుయ్యబట్టారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు, సమాజ్వాదీ పార్టీకి నాలుగు సీట్లు కూడా రావని ఆరోపించారు. -
Osama Bin Lager : మందుబాబులా మజాకా.. దెబ్బకు మద్యం దుకాణం వెబ్సైట్ డౌన్ అయింది
మందుబాబులతో పెట్టుకుంటే మాములుగా ఉండదు. వారి కెపాసిటీ జోలికి వస్తే.. లెక్క తేల్చేస్తారు. అలాంటిదే ఈ ఘటన. యూకేకు చెందిన ఓ మద్యం దుకాణంలో ఓ బీర్ టేస్ట్ నచ్చడంతో.. ఆ బీర్ కోసం జనాలు బారులు తీరారు. అంతేకాకుండా.. ఆన్లైన్లోనూ ఆర్డర్ పెట్టేందుకు పోటెత్తడంతో.. ఆ మద్యం దుకాణంకు చెందిన వైబ్సెట్ డౌన్ అయిపోయింది. వివరాల్లోకి వెళితే.. UKలోని లింకన్షైర్లోని బిల్లింగ్హేలో ఉన్న ఒక పబ్లో తన ‘ఒసామా బిన్ లాగర్’ బీర్ను కొనుగోలు చేయడానికి… -
Maharashtra: విషాదం.. పాదచారులపైకి దూసుకెళ్లిన డంపర్, ఇద్దరు మృతి
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన డంపర్ ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటన ఈరోజు (సోమవారం) ఉదయం జరిగింది. -
Rahul Gandhi: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేస్తాం..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాట్నాలోని భక్తియార్పూర్లో ఏర్పాటు చేసిన ఇండియా కూటమి ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జూన్ 4న ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అగ్నివీర్ పథకాన్ని అంతం చేస్తామని పేర్కొన్నారు. -
IMD: తెలంగాణవాసులకు అలర్ట్.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు నేడు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. రెమాల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారి తీవ్ర తుఫాన్ గా మారింది..… -
Ranchi: బార్లో మ్యూజిక్ వివాదం.. డీజేను గన్తో కాల్చి చంపిన వ్యక్తి
జార్ఖండ్ రాజధాని రాంచీలో డీజేను ఓ వ్యక్తి గన్తో కాల్చి చంపాడు. ఈ ఘటన సోమవారం (మే 27) తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఒక బార్లో వివాదం కారణంగా డీజే హత్యకు గురయ్యాడు. హత్యకు సబంధించిన ఘటన అక్కడి కెమెరాలో రికార్డైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ బార్లో 4-5 వ్యక్తులు, డీజే సందీప్ మరియు బార్ సిబ్బందితో మ్యూజిక్ ప్లే చేయడం గురించి గొడవ జరిగింది. మొదట్లో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత… -
Fuel Bunk : తెలంగాణలో తొలిసారిగా ట్రాన్స్జెండర్లు నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్..
దేశంలోని ఈ ప్రాంతాల్లో తొలిసారిగా ట్రాన్స్జెండర్లు నిర్వహిస్తున్న ఇంధన బంక్ త్వరలో జిల్లాలో ప్రారంభం కానుంది. రాజన్న-సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇంధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం 2019లో భాగంగా, గుర్తింపు కార్డులను జారీ చేయడంతో పాటు లింగమార్పిడి చేయించుకున్న వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వాలు స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నాయి. గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవకాశం కల్పించేందుకు, వివిధ స్వయం ఉపాధి యూనిట్లను… -
Tamil Nadu: సెప్టిక్ ట్యాంక్లో 9 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యం..
తమిళనాడులో ఓ సెప్టిక్ ట్యాంక్లో 9 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. మధురైలోని ఉర్దూ ప్రమోషన్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడు హత్య చేసి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు. అనంతరం బాలుడి మృతదేహాంపై సమాచారం అందడంతో అందులో నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మధురైలోని కథపట్టి గ్రామంలో చోటు చేసుకుంది.
తాజావార్తలు
-
Palak Pakoda Recipe: సింపుల్గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
-
West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్లో తీవ్ర సంక్షోభం..
-
Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
-
Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
-
YS Jagan: అందుకే “మావిగన్” ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!