Home
Telugu News
Telugu News News
-
IPL 2024 Final: అదరగొట్టిన కేకేఆర్ బౌలర్లు.. కుప్పకూలిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు
ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విఫలమయ్యారు. కోల్కతా బౌలింగ్కు సన్ రైజర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 113 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. 18.3 ఓవర్లలో ఆలౌటైంది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో మొదట నుంచి బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. మొదట్లోనే ట్రావిస్ హెడ్ డకౌట్ కాగా, అభిషేక్ శర్మ (2) వికెట్లు పోవడంతో జట్టు తీవ్ర కష్టాల్లో పడింది. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి ఆదుకుంటాడనకున్నప్పటికీ (9) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. -
Top Headlines @9PM : టాప్ న్యూస్
నోరుజారిన నితీష్ కుమార్.. “మోడీ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ”.. జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ నోరు జారారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అనుకోకుండా ప్రధాని నరేంద్రమోడీ మళ్లీ ‘ముఖ్యమంత్రి’ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పాట్నాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ మేము భారత్ అంతటా 400 సీట్లకు పై గెలవాలని అనుకుంటున్నాము. నరేంద్ర మోడీ మళ్లీ… -
Road Accident: నోయిడాలో కారు బీభత్సం.. గాల్లో ఎగిరిపడ్డ వృద్ధుడు
కొత్వాలి సెక్టార్-24 ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కంచన్జంగా మార్కెట్ సమీపంలో వేగంగా వస్తున్న ఆడి కారు ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందాడు. కారు వేగంగా వచ్చి వృద్ధుడిని ఢీకొట్టడంతో.. కాసేపు గాలిలో ఉండి పది మీటర్ల దూరంలో పడిపోయాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ప్రమాదంపై మృతుడి కుమారుడు గుర్తు తెలియని డ్రైవర్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
Expired Food : రూ.70,000 విలువైన కాలం చెల్లిన ఆహార పదార్థాలు లభ్యం
కరీంనగర్ పట్టణంలోని వివిధ హోటళ్లలో ఆదివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. వరంగల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీ నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ బృందాలు హోటళ్లలోని కిచెన్లు, స్టోర్రూమ్లలో సోదాలు నిర్వహించాయి. శ్వేత త్రీ స్టార్ హోటల్లో రూ.70,000 విలువ చేసే గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను గుర్తించామని అమృతశ్రీ తెలిపారు. హోటల్లో 20 నుంచి 25 రకాల వండిన ఆహార పదార్థాలను కూడా గుర్తించారు. అన్ని హోటళ్లలో దాడులు నిర్వహించాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై… -
Heatwave: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు
ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. జనం ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ముఖ్యంగా ఉదయం పదిగంటలు దాటిన తర్వాత భానుడి భగభగలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడుగా.. తీవ్రమైన వడగాల్పులు కూడా వీస్తాయని తెలిపింది. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రేపు (సోమవారం) 72 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల… -
IPL 2024 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్..
కాసేపట్లో ఐపీఎల్ 2024 ఫైనల్ పోరు జరుగనుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. -
Tragedy: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం.. గోడ కూలి నలుగురు కార్మికులు మృతి
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈదురుగాలుల బీభత్సానికి తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల ఫారం ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో గోడ మీద పడటంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరి కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. రెండు గంటలుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు, పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. -
Duddilla Sridhar Babu : ఓర్వ లేక ఉత్తమ్పై ఆరోపణలు చేస్తున్నారు
రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజులు పరిపాలన యంత్రాంగం ని గాడిలో పెట్టామని, వంద రోజులు కాకముందే ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళ ని మేము మీ అనుభవాలు చెప్పండి అని కోరినమని, పరిపాలన లో మీరు చేసిన పొరపాట్లు మేము చేయొద్దు అని సలహా ఆడిగామన్నారు. మేడిగడ్డ పోయినప్పుడు కూడా సీఎం.. అందరిని రమ్మన్నారని, చూసి సలహాలు ఇవ్వండి అని ఆడిగామన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఏదంటే అది… -
Shakib Al Hasan: చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్.. తొలి ఆటగాడిగా
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్, సీనియర్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో బంతితో 14,000 పరుగులు మరియు 700 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు నిలిచాడు. యూఎస్ వర్సెస్ బంగ్లాదేశ్ 3వ టీ20 మ్యాచ్ సందర్భంగా షకీబ్ ఈ రికార్డును సాధించాడు. కాగా.. ఇప్పటి వరకు 48 మంది బ్యాటర్లు 14,000 పరుగులు చేశారు. 17 మంది బౌలర్లు 700 వికెట్లు పడగొట్టారు. కానీ ఈ రెండింటినీ సాధించిన ఒకే… -
Vizag: విశాఖ జనసేన కార్పొరేటర్కు త్వరలో లీగల్ నోటీస్..!
విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కు త్వరలో లీగల్ నోటీసులు ఇవ్వనున్నారు. మూర్తి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డిపై రెండు రోజులుగా అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో త్వరలో కార్పొరేటర్ మూర్తి యాదవ్కు లీగల్ నోటీసు జారీ చేయనున్నారు. శనివారం విశాఖపట్నంలో కార్పొరేటర్ మూర్తి యాదవ్ సిఎస్ జవహర్ రెడ్డి వారిపై చేసిన అసత్యమైన, నిరాధార ఆరోపణలు వాస్తవం కాదని ఇప్పటికే ఖండిస్తూ పత్రికా ముఖంగా స్టేట్మెంట్/రిజాయిండర్…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్కు ఒకటే చెప్పాం.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Adivi Sesh: బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అడివి శేష్.. అక్టోబర్లో కొత్త యాక్షన్ మూవీ షూటింగ్!
-
POK Protests: పీవోకేలో నిరసనల వేళ కాశ్మీర్ కార్డు.. పాక్ ఆర్మీ చీఫ్ తాజా వ్యాఖ్యలు
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Queen 2: విడుదలకు ముందే చిక్కుల్లో కంగనా సినిమా.. రూ.250 కోట్ల కేసుతో కొత్త ట్విస్ట్!
ట్రెండింగ్
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!