నేడు బెంగాల్లో ప్రధాని మోడీ పర్యటన.. కోల్కతాలో రోడ్ షో ఏడో దశ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇందులో భాగంగానే అందరికంటే ముందు నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్న ప్రధాని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగానే నేడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అశోక్నగర్ తో పాటు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయ్పూర్లో జాదవ్పూర్…
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. పోలింగ్కు ముందు, తర్వాత నమోదైన 3 కేసులపై హైకోర్టుకు పిన్నెల్లి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లికి జూన్ 6 వరకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. మే 13న తన నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించిన నేరాలకు పాల్పడినందుకు తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్ఆర్సీపీ నేత, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ రాకెట్ (Agniban Rocket) ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR) వేదికగా మంగళవారం ఉదయం రాకెట్ను ప్రయోగించాల్సి ఉన్నది. అయితే ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇస్రో శాస్త్రవేత్తలు వాయిదావేశారు. దీంతో నాలుగు సారీ రాకెట్ ప్రయోగం వాయిదాపడినట్లయింది. చెన్నైకి చెందిన ప్రైవేటు స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ అగ్నిబాణ్ సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్…
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం పార్టీ కార్యకర్తలను కోరారు. ఈ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకోవడమే కాకుండా, గత పదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి , విజయాలను హైలైట్ చేయడానికి కూడా ప్రణాళిక చేయబడింది. అందుకు తగ్గట్టుగానే జూన్ 1న హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే…
మెగాస్టార్ చిరంజీవికి గోల్డెన్ వీసా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవికి తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి చెందిన కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్ మెంట్ గోల్డెన్ వీసా ఇచ్చింది. ఎమిరేట్స్ ఫస్ట్ సంస్థ ద్వారా ఈ గోల్డెన్ వీసా ఇచ్చినట్టు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు, బాలీవుడ్ సహా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలకు కూడా UAE ప్రభుత్వం గోల్డెన్…
పెరిగిన కొమ్మలు విద్యుత్ తీగలకు అంతరాయం కలగకుండా చూసేందుకు సైఫాబాద్ డివిజన్లో తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ( టీజీఎస్పీడీసీఎల్ ) అధికారులు మంగళవారం చెట్ల నరికివేత కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గోడలు కూలి, చెట్లు విరిగిపడి, పిడుగులు పడి మొత్తం 14 మంది మృత్యువాతపడ్డారు. నాగర్కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా నాగర్ కర్నూల్…
లైంగిక నేరాల ఆరోపణల తర్వాత గత నెలలో జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ.. తన భర్తను ఇంతకుముందు అరెస్టు చేసిన కిడ్నాప్ కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెచ్డి రేవణ్ణను ఏప్రిల్ 29న ఇంటి పనిమనిషిని కిడ్నాప్ చేసిన ఆరోపణలపై ఈ నెల ప్రారంభంలో అరెస్టు చేశారు. హెచ్డి రేవణ్ణ కిడ్నాప్ చేసిన మహిళ తమ ఇంటిలో పని చేస్తుందని.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కూడా అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి…
హఫీజ్పేటలో ఆస్బెస్టాస్ షీట్ పైకప్పు పడిపోవడంతో మూడేళ్ల బాలుడి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదివారం రాత్రి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా ఆదివారం రాత్రి హఫీజ్పేటలో ఓ ఇంటి గోడ కూలి ఇటుకలు పక్కనే ఉన్న ఇంటి పైకప్పుపై పడ్డాయి. ఆస్బెస్టాస్ షీట్ పైకప్పు చిన్నారి సమద్పై పడడంతో వెంటనే మృతి…
గుజరాత్లోని రాజ్కోట్ వీడియో గేమ్జోన్లో అగ్ని ప్రమాదం సంభవించి 28 మంది అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో చిన్నారులు ఉండటం, వారంతా తీవ్రంగా కాలిపోవడం అందరినీ కలచివేసింది. ఈ కేసు గుజరాత్ హై కోర్టులో విచారణకు వచ్చింది.