Stock Market Crash: యుద్ధ భయంతో కుప్పకూలిన సూచీలు! లక్ష కోట్లు ఆవిరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం)లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్ను అతలాకుతలం చేశాయి. శుక్రవారం ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని చవిచూశాయి. దీనివల్ల ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒక్క రోజులోనే రూ.1 లక్ష కోట్లకు పైగా హరించుకుపోయింది.
READ ALSO: Blue Sparrow: ఇరాన్ సుప్రీం లీడర్ మరణానికి కారణం ‘బ్లూ స్పారో క్షిపణి’.. దీని ప్రత్యేకత ఇదే..
Also Read
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
కీలక గణాంకాలు..
సెన్సెక్స్: 1,097 పాయింట్లు (1.37%) కోల్పోయి 78,918.90 వద్ద ముగిసింది.
నిఫ్టీ: 315.45 పాయింట్లు (1.27%) పడిపోయి 24,450.45 వద్ద స్థిరపడింది.
మార్కెట్ క్యాప్: బీఎస్ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.453 లక్షల కోట్ల నుంచి రూ.452 లక్షల కోట్లకు పడిపోయింది.
బ్యాంకింగ్ డౌన్.. డిఫెన్స్ అప్!
మార్కెట్ పతనానికి ప్రధానంగా బ్యాంకింగ్ రంగం కారణం కాగా, యుద్ధ వాతావరణం నేపథ్యంలో రక్షణ (Defense) రంగ షేర్లు మాత్రం లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు: నిఫ్టీ బ్యాంక్ (2.15%), రియల్టీ (2.09%), పీఎస్యూ బ్యాంక్ (2.01%), ఆటో (1.06%), కన్జమ్ప్షన్ (1.02%).
లాభపడిన షేర్లు: యుద్ధ పరిస్థితుల వల్ల నిఫ్టీ ఇండియా డిఫెన్స్ 2.77% పుంజుకుంది. ఎనర్జీ (0.13%), ఐటీ (0.04%) రంగాలు స్వల్ప లాభాలను గడించాయి.
ఈ రోజు మార్కెట్లో లాభపడిన, నష్టపోయిన షేర్లు..
లాభపడిన షేర్లు (Gainers): బీఈఎల్ (BEL), సన్ ఫార్మా, ఎన్టీపీసీ (NTPC), ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్.
నష్టపోయిన షేర్లు (Losers): ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ (SBI), అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్ మరియు హెచ్యూఎల్ (HUL).
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు:
* యుద్ధ మేఘాలు: ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. యుద్ధం ముదిరితే ఇంధన సరఫరా నిలిచిపోతుందనే భయం మార్కెట్లో నెలకొంది.
* భగ్గుమంటున్న క్రూడ్ ఆయిల్: యుద్ధ భయంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $84, డబ్ల్యూటీఐ క్రూడ్ $80 దాటడం భారత మార్కెట్పై ఒత్తిడి పెంచింది.
* ఎఫ్ఐఐ (FII) అమ్మకాలు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. గురువారం ఒక్కరోజే వీరు రూ.3,752.52 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
READ ALSO: Anuj Agnihotri: యూపీఎస్సీ 2025 టాపర్గా నిలిచిన డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి! ప్రస్థానం ఇదే..
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!