Stock Market Crash: యుద్ధ భయంతో కుప్పకూలిన సూచీలు! లక్ష కోట్లు ఆవిరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం)లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్ను అతలాకుతలం చేశాయి. శుక్రవారం ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని చవిచూశాయి. దీనివల్ల ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒక్క రోజులోనే రూ.1 లక్ష కోట్లకు పైగా హరించుకుపోయింది.
READ ALSO: Blue Sparrow: ఇరాన్ సుప్రీం లీడర్ మరణానికి కారణం ‘బ్లూ స్పారో క్షిపణి’.. దీని ప్రత్యేకత ఇదే..
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
కీలక గణాంకాలు..
సెన్సెక్స్: 1,097 పాయింట్లు (1.37%) కోల్పోయి 78,918.90 వద్ద ముగిసింది.
నిఫ్టీ: 315.45 పాయింట్లు (1.27%) పడిపోయి 24,450.45 వద్ద స్థిరపడింది.
మార్కెట్ క్యాప్: బీఎస్ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.453 లక్షల కోట్ల నుంచి రూ.452 లక్షల కోట్లకు పడిపోయింది.
బ్యాంకింగ్ డౌన్.. డిఫెన్స్ అప్!
మార్కెట్ పతనానికి ప్రధానంగా బ్యాంకింగ్ రంగం కారణం కాగా, యుద్ధ వాతావరణం నేపథ్యంలో రక్షణ (Defense) రంగ షేర్లు మాత్రం లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు: నిఫ్టీ బ్యాంక్ (2.15%), రియల్టీ (2.09%), పీఎస్యూ బ్యాంక్ (2.01%), ఆటో (1.06%), కన్జమ్ప్షన్ (1.02%).
లాభపడిన షేర్లు: యుద్ధ పరిస్థితుల వల్ల నిఫ్టీ ఇండియా డిఫెన్స్ 2.77% పుంజుకుంది. ఎనర్జీ (0.13%), ఐటీ (0.04%) రంగాలు స్వల్ప లాభాలను గడించాయి.
ఈ రోజు మార్కెట్లో లాభపడిన, నష్టపోయిన షేర్లు..
లాభపడిన షేర్లు (Gainers): బీఈఎల్ (BEL), సన్ ఫార్మా, ఎన్టీపీసీ (NTPC), ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్.
నష్టపోయిన షేర్లు (Losers): ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ (SBI), అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్ మరియు హెచ్యూఎల్ (HUL).
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు:
* యుద్ధ మేఘాలు: ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. యుద్ధం ముదిరితే ఇంధన సరఫరా నిలిచిపోతుందనే భయం మార్కెట్లో నెలకొంది.
* భగ్గుమంటున్న క్రూడ్ ఆయిల్: యుద్ధ భయంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $84, డబ్ల్యూటీఐ క్రూడ్ $80 దాటడం భారత మార్కెట్పై ఒత్తిడి పెంచింది.
* ఎఫ్ఐఐ (FII) అమ్మకాలు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. గురువారం ఒక్కరోజే వీరు రూ.3,752.52 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
READ ALSO: Anuj Agnihotri: యూపీఎస్సీ 2025 టాపర్గా నిలిచిన డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి! ప్రస్థానం ఇదే..
తాజావార్తలు
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!