ఖాతాదారులకు మరింతగా చేరువయ్యేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజులు, అన్ని రకాల యూజర్ చార్జీలను ఇకపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లోనూ చెల్లించొచ్చు. అన్ని రకాల స్టాంప్ పేపర్లు కూడా ఈ బ్యాంకు శాఖల్లో లభిస్తాయి.
మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన దేశాభివృద్ధిని వివరించేందుకు బీజేపీ తలపెట్టిన సభల్లో ఒకటి శనివారం సాయంత్రం శ్రీకాళహస్తిలోని భేరివారి మండపం వద్ద జరగనుంది. ఇవాళ శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా అధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా బంపర్ డిస్కౌట్ ఆఫర్స్ ప్రకటించింది. వివిధ రకాల మోడళ్లపై గరిష్టంగా రూ.65 వేల వరకు డిస్కౌంట్ కల్పిస్తోంది. మీరు బడ్జెట్ ధరలో మంచి కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు.
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం శివారులో రహదారిపై చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ వజ్రపుతునకగా ఉన్న సింగరేణిని రెండు పార్టీలు నాశనం పట్టించాయని మండిపడ్డారు. వికలాంగుల ఫించను మరో వెయ్యి పెంచుతున్నామని సీఎం కేసీఆర్ మంచిర్యాలలో జరిగిన ప్రగతి నివేదన సభలో ప్రకటించారు.
వేప కాండం నుంచి మొదలు పెడితే వేర్లు, చిగుళ్లు, విత్తనాలు వరకు ఆరోగ్యానికి మేలు చేసేవిగా ఉంటాయి. వేప చేదుగా ఉన్నా.. దానిలో మాత్రం ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. వేప అద్భుతమైన శీతలీకరణ ఏజెంట్. ఇది హైపర్ అసీడిటీ, మూత్ర మార్గ రుగ్మతలు, చర్మ వ్యాధులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. వేప ఆకులతో ఎన్నో ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యల నుంచి బయటపడొచ్చు.