Andhrapradesh: నేడు శ్రీకాళహస్తిలో బీజేపీ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న నడ్డా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh: మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన దేశాభివృద్ధిని వివరించేందుకు బీజేపీ తలపెట్టిన సభల్లో ఒకటి శనివారం సాయంత్రం శ్రీకాళహస్తిలోని భేరివారి మండపం వద్ద జరగనుంది. ఇవాళ శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా అధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానుండడంతో పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా సభ ఏర్పాట్లు చేస్తున్నాయి. బీజేపీ అగ్ర నేతలు సోమువీర్రాజు, పురందేశ్వరి, సుజనా చౌదరి, కిరణ్కుమార్ రెడ్డి,సీఎం రమేష్, జీవీఎల్ నరసింహా రావు, టీజీ వెంకటేశ్, విష్ణువర్ధన రెడ్డి తదితరులు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 11గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకున్న జేపీ నడ్డాకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన వెంట తిరుమల వెళ్లారు.శ్రీకృష్ణ గెస్ట్హౌస్లో బసచేసిన నడ్డా శనివారం ఉదయం 10గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుచానూరు రాహుల్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుని చిత్తూరు జిల్లా బీజేపీ నేతలతో సమావేశమౌతారు.సాయంత్రం 3.40 గంటలకు శ్రీకాళహస్తి చేరుకుని శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకుంటారు.4.30 నుంచి 5.40గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి వెళ్తారు.
Read Also: Weather Report: తీవ్రమైన చలి, మండుతున్న వేడి, అకాల వర్షం.. 4 నెలల్లో 233 మరణాలు
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ఇదిలా ఉంటే తెలంగాణలోనూ బీజేపీ జాతీయ నేతల పర్యటన ఖరారైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా సీనియర్ బీజేపీ నేతలు ఈ నెలలో ఏపీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 9ఏళ్లలో చేసిన పని గురించి ప్రజలకు తెలియజేయడానికి బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న పనులపై అవగాహన కల్పించేందుకు పార్టీ మహా జన్ సంపర్క్ అభియాన్, ప్రవాసీ యోజన ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించేందుకు అమిత్ షా జూన్ 15న ఖమ్మంలో పర్యటించనున్నారు. నాగర్కర్నూల్లో జేపీ నడ్డా బహిరంగ సభ నిర్వహించి కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దృష్టి సారించి, మోడీ ప్రభుత్వం చేస్తున్న పనులపై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇటీవలి కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కలత చెందిన పార్టీ క్యాడర్ను పునరుద్ధరించడానికి ఈ సమావేశాలు సహాయపడతాయని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ నాయకులు మరియు క్యాడర్కు ఇప్పుడు కొంత శక్తిని కోరుకుంటున్నారని, జాతీయ నాయకుల రాష్ట్ర పర్యటనల ద్వారా ఇది సాధ్యమవుతుందని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!