మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టేందుకు ఆరోగ్య, విద్య, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చట్ట అమలు సంస్థలను ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడంతోపాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను సమగ్రంగా ఎదుర్కోవాలనే లక్ష్యంతో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేశామన్నారు. breaking news, latest news, telugu news, cs shanti kumari, drugs, dgp anjani kumar
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకాన్ని ఖరారు చేసింది. వివిధ జిల్లాల్లోని పరిస్థితిని అంచనా వేయడానికి, కొనసాగుతున్న ప్రచారంలో ఓటర్ల జాబితాలో ఏవైనా లోపాలను సరిదిద్దడానికి ఎన్నికల సంఘం ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. breaking news, latest news, telugu news, Telangana CEO, Vikas Raj, big news, telangana elections 2023
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి తిరుపతిరెడ్డి కిడ్నాప్కు గురైనట్లు సమాచారం. హైదరాబాద్లోని అల్వాల్లో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారు. తన భర్త కిడ్నాప్కు గురయ్యాడని అతని భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతిరెడ్డి స్వస్థలం జనగాం జిల్లా దుబ్బకుంటపల్లి. అతను హైదరాబాద్లోని కుషాయిగూడలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. 5,929 గజాల స్థలం విషయంలో తన ప్రత్యర్థులతో తనకు వివాదం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుజాత పేర్కొంది.…
జనసేన అధినేత పవన్కళ్యాణ్పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. పవన్ చిత్ర విచిత్ర స్వభావాలు కలిగిన వ్యక్తి అని.. ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీఆర్పీలో ఉన్నప్పుడే వైఎస్సార్ను పంచలు ఊడదీసి కొడతానన్నారని.. అప్పుడే పవన్ రాజకీయాలకు పనికి రాడని ప్రజలు అనుకున్నారని అంబటి రాంబాబు అన్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రోతో పాటు యావత్ భారత్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జాబిలిపై అడుగు పెట్టాలన్న భారత చిరకాల స్వప్నం ఈరోజు కార్యరూపం దాల్చింది. జాబిల్లిపై అన్వేషణకు ‘చంద్రయాన్-3’ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.