జీవో 46ను రద్దు చేయాలని, మళ్ళీ పాత పద్ధతిలోనే పోలీస్ టీఎస్ఎస్పీ, ఐటీ, కమ్యూనికేషన్ నియామకాలు చేపట్టాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు అర్ధనగ్న ప్రదర్శనతో మోకాళ్ళపై నడిచారు. పోలీసు బోర్డ్ నియామకం ప్రకారం క్వాలిఫై అయిన మాకు ఈ జీవో వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవో ప్రకారం ఫలితాలు ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని అవకాశం…
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం చింతలురులో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా.. చింతలూరు వద్ద పెద్దవాగులో ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి విడుదల చేశారు. breaking news, latest news, telugu news, vemula prashanth reddy, kaleshwaram project,
అమెరికాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అలాస్కా ద్వీపకల్ప వచ్చిన ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలుస్తోంది. ఈ భూకంపం వల్ల అలస్కా ద్వీపకల్పంలో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన అధినేత పవన్కళ్యాణ్తో భేటీ అయ్యారు. తాజాగా వైసీపీకి గుడ్బై చెప్పిన ఆయన.. ఈ నెల 20న పవన్కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు చెప్పారు.
విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కృష్ణ హత్య కేసులో నిందితుడు వెంకటనాయుడు ఇంటిపై మృతుడి బంధువులు దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
శ్రీవాణి ట్రస్ట్ కి ఇప్పటి వరకు 880 కోట్లు విరాళాలు అందాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయించామన్నారు. 9 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. కమిటీల బలోపేతంపై చర్చించారు. కమిటీల్లో మార్పు చేర్పులు, సంస్థాగత అంశాలపై సమీక్షించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియా సమావేశంలో ప్రసంగించారు. తనపై గురుతర బాధ్యతలు ఉన్నాయన్న పురంధేశ్వరి.. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదన్నారు. ప్రతి కార్యకర్త సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందన్నారు.
ఆ తల్లి ఎన్ని ఆశలు పెట్టుకోందో... నవమాసాలు మోసి తల్లికి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు ...కన్న బిడ్డలను కళ్ళారా చూసుకునేలోపు పుట్టిన ముగ్గురు పిల్లలు అనారోగ్యంతో మరి చెందడం అత్యంత విషాదాన్ని అకుటుంబంలో నింపింది.