గత కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఎక్కువయ్యాయి. తీవ్ర ఒత్తిళ్లతో కూడిన జీవన శైలి, జంక్ ఫుడ్, సరిగా నీళ్లు తాగకపోవడం, డయాబెటిస్, ఆల్కహాల్ అలవాటు వంటివి దీనికి కారణం అవుతున్నాయి. తమకు కిడ్నీ సమస్యలు తీవ్రమయ్యాయని చాలా మంది గుర్తించలేకపోతున్నారు. ఈ క్రమంలో చేసేదేమీ లేక ఇబ్బందులుపడుతూనే ఉన్నారు. ముందే లక్షణాలను గుర్తించగలిగితే.. త్వరగా చికిత్స తీసుకుని, సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బరువు తగ్గాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఎక్కువగా అల్పాహారం తినడం, కడుపు నిండా భోజనం చేయడం మంచిది కాదు. కడుపు కొంచెం ఖాళీగా ఉండే విధంగా రాత్రి భోజనం చేయాలి. తరచుగా ప్రజలు పగటిపూట కొద్దిగా భోజనం చేసి.. రాత్రి ఎక్కువగా తింటారు. రోజు ఇలా తినడం వల్ల మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.. ఊబకాయాన్ని పెంచుతుంది. బరువు విషయంలో రాత్రి భోజనంలో తక్కువగా తినండి. 7 గంటలకే రాత్రి భోజనం చేయాలి.
ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు గురించి వివరించారు. డయాఫ్రం వాల్ ఉందో లేదో తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫేజ్ - 1, ఫేజ్ - 2 అని ఏ రోజూ మేం చెప్పలేదన్నారు.
ఎక్కువ మంది బ్లాక్ కాఫీని తాగడానికి ఇష్టపడతారు. ఈ కాఫీ తాగితే పని ఒత్తిడి తగ్గుతుంది. నీరసం, అలసట నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఉదయాన్నే పరగడుపున ఈ బ్లాక్ కాఫీ తాగితే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. రుచికి కాస్త చేదుగా ఉన్నా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ నివేదిక ప్రకారం.. బ్లాక్ కాఫీలో ఆల్కహాల్ లేని కొవ్వు కాలేయానికి వ్యతిరేకంగా రక్షించే రక్షిత సమ్మేళనాలు ఉన్నాయి.
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిపై హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ శాసనమండలి స్పందించింది. ఇందుకూరి రఘురాజును ఎమ్మెల్సీగా తిరిగి శాసనమండలి గుర్తించింది. ఇటీవల విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇచ్చిన నోటిఫికేషన్పై రఘురాజు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ దిగ్వజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. కాగా.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్లో మెగా టోర్నమెంట్ ప్రారంభమైంది. ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్కు ఆతిధ్యమిచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా-మలేషియా జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. రసవత్తరంగ సాగిన ఈ మ్యాచ్ డ్రా గా ముగిసింది.
మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ.. బ్రెజిల్లో పర్యటిస్తున్నారు. రియో డీజెనిరోలో జరిగిన జీ-20 సదస్సు నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. హోస్ట్ బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా మోడీకి కరచాలనం చేసి, కౌగిలింతతో స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు చాలా సేపు మాట్లాడుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు ప్రధాని మోడీ భుజంపై చేయి వేసి చాలాసేపు మాట్లాడారు.
ప్రాణం తీసిన ఆర్గానిక్ క్యారెట్స్.. 50మంది ఆస్పత్రి పాలు.. అమ్మకాలు నిలిపివేత ఆర్గానికి క్యారెట్లు అగ్రరాజ్యం అమెరికాను హడలెత్తిస్తున్నాయి. ఆర్గానికి క్యారెట్లలో హానికరమైన ఇ కోలి వ్యాప్తి చెందుతోంది. దీంతో ఇప్పటికే ఒకరు చనిపోగా.. 50 మందికి పైగా ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. దాదాపు 18 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదైనట్లు యూఎస్ సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఇప్పటికే గ్రిమ్వే ఫార్మ్స్ విక్రయించిన బ్యాగ్డ్ ఆర్గానిక్ బేబీ మరియు మొత్తం క్యారెటలను…