Anmol Bishnoi: అమెరికాలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అరెస్ట్..
- గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్ట్
- అన్మోల్ను కాలిఫోర్నియాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్టయ్యాడు. నివేదికల ప్రకారం.. అన్మోల్ను కాలిఫోర్నియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ అధికారులు కొంతకాలం క్రితం అన్మోల్ తమ దేశంలో ఉన్నాడని సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో.. ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ అతని అప్పగింత ప్రక్రియను ప్రారంభించిన వారాల తర్వాత కాలిఫోర్నియా పోలీసులు అన్మోల్ను అరెస్టు చేశారు.
Read Also: Nirmala Sitharaman: ఎస్బీఐ మరింత విస్తరణ.. త్వరలో 500 బ్రాంచ్లు ప్రారంభం
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
బాబా సిద్ధిఖీ హత్య కేసుతో సహా కొన్ని హై ప్రొఫైల్ నేరాల్లో అన్మోల్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు. అన్మోల్ బిష్ణోయ్పై సమాచారం ఇచ్చిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రూ.10 లక్షల రివార్డును ఇటీవల ప్రకటించింది. 2022లో నమోదైన రెండు కేసుల్లో ఎన్ఐఏ అన్మోల్పై చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. అంతేకాకుండా.. ఏప్రిల్ 14న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి గెలాక్సీ అపార్ట్మెంట్ వెలుపల కాల్పులు జరిపిన కేసులో కూడా అన్మోల్ బిష్ణోయ్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీటులో లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్లను నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో అన్మోల్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది.
అలాగే.. బాబా సిద్ధిఖీ హత్య కేసులో ఎన్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్ నిందితులుగా ఉన్నారు. ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబా సిద్ధిఖీ హత్య తర్వాత పూణేకు చెందిన ఓ పెద్ద నాయకుడు కూడా బిష్ణోయ్ గ్యాంగ్ రాడార్లో ఉన్నాడు. ఇటీవల, తీహార్ జైలు పరిపాలన.. బాబా సిద్ధిఖీ హత్య కేసును విచారించిన తరువాత బిష్ణోయ్ గ్యాంగ్ శ్రద్ధా వాకర్ హత్య కేసు దోషి అఫ్తాబ్ పూనావాలాను లక్ష్యంగా చేసుకోవడానికి ప్లాన్ చేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత నిందితుడు అఫ్తాబ్ చుట్టూ భద్రతను పెంచారు. పరారీలో ఉన్న నేరస్థుడు అన్మోల్ బిష్ణోయ్ను అప్పగించే ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ.. గత నెల ప్రారంభంలో ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ కూడా MCOCA కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!