Reels: రైలు లోపల, ట్రాక్లపై రీల్స్ చేస్తే జైలుకే..! ఆదేశాలు జారీ
- దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లకు రైల్వే బోర్డు కఠిన ఆదేశం
- రైళ్లు, రైల్వే ట్రాక్లపై రీల్స్ చేస్తే జైలుకు
- అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైళ్లు, రైల్వే ట్రాక్లు, రైల్వే స్టేషన్లలో రీల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంది రైల్వే బోర్డు. రైలు కార్యకలాపాలకు ముప్పు కలిగిస్తే.. రైల్వే ప్రాంగణంలో కోచ్లు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలకు రైల్వే బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లకు కఠినమైన ఆదేశాన్ని జారీ చేసింది. రైళ్లలోనూ, రైల్వే ట్రాక్ లపై రీల్స్ చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. రైల్వే భద్రతకు ముప్పు కలిగించే సెక్షన్ల కింద రీల్ చేసే వారిపై కేసు నమోదు చేస్తామని రైల్వే బోర్డు లేఖలో పేర్కొంది.
Winter: చలికాలంలో చర్మం మృదువుగా ఉండాలంటే ఇలా చేయండి!
Also Read
- Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
సోషల్ మీడియాలో వైరల్గా మారేందుకు రైళ్లు, రైల్వే ట్రాక్లపై రీల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా యువకులు రైల్వే ట్రాక్ల వద్ద యాక్షన్ రీల్స్ చేసేందుకు రైల్వే ట్రాక్పై రాయి లేదా ఏదైనా వస్తువు ఉంచి కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. అనుకోకుండా ట్రైన్స్ వస్తే తప్పించుకొనే ఛాన్స్ లేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. వారితో పాటు రైల్వే ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వారిపై రైల్వే యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుంది. రైలు లోపల లేదా రైలు పట్టాలపై రీల్స్ చేసే వ్యక్తులపై RPF కేసు నమోదు చేయనుంది. రీల్స్ చేసేవారు రైలు కార్యకలాపాలకు ముప్పు కలిగిస్తే.. కోచ్లు, రైల్వే ప్రాంగణంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని రైల్వే బోర్డు తెలిపింది.
Amit Shah: మణిపూర్పై అమిత్ షా వరుసగా రెండో రోజు సమావేశం..
సోషల్ మీడియాలో కదులుతున్న రైళ్లు, రైల్వే ట్రాక్ల పక్కన చేసిన విన్యాసాల వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వీడియోలు చేసి వైరల్గా మారి డబ్బు సంపాదించడం కోసం.. తమ ప్రాణాలతో పాటు వేలాది మంది రైల్వే ప్రయాణికుల ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారిని అరికట్టేందుకు రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
-
Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
-
K. Bhagyaraj : ప్రముఖ దర్శకులు, నటుడు కే భాగ్యరాజ్ మృతి..
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!