సంక్రాంతి రాగానే గంగిరెద్దు వాళ్ళు వచ్చినట్టు సంగారెడ్డికి కొత్త వ్యక్తులు వస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏవేవో హామీలు ఇస్తారని.. మాయమాటలు నమ్మొద్దన్నారు. సంగారెడ్డిలోని గంజి మైదాన్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ కూడా తమ అగ్రనేతలను ఆహ్వానిస్తూ ప్రచార హోరును పెంచింది. మంగళవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ నెల 11న రాష్ట్రానికి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు.
వన్డే వరల్డ్ కప్ 2023లో దూసుకెళ్తున్న టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ తన సత్తాను చాటుకుంది. వన్డేల్లో నెం.1 జట్టుగా టీమిండియా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లు తమ సత్తాను చాటారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. పలు పార్టీల నుంచి కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రేపు గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.
2018 ఎన్నికల్లో కమ్యూనిస్టుల పొత్తు వల్లే ఎమ్మెల్యేగా గెలిచానని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. చండూర్లో సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు
Anakapalli: అనకాపల్లి జిల్లా లోని కసింకోట మండలం లోని నరసింగబిల్లి లోని నరసీంగబిల్లి కోపరేటివ్ సొసైటీ బ్యాంకులో అర్ధరాత్రి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నైట్ వాచ్మెన్ ను తాళ్లతో బంధించారు. అనంతరం ముగ్గురు దుండగులు కలిసి బ్యాంకు తలుపులు, తాళాలు పగలగొట్టి బ్యాంకు లోకి ప్రవేశించారు. అంతటితో ఆగలేదు దుండగులు స్ట్రాంగ్ రూమ్ గోడకు కన్నం పెట్టి లోనికి ప్రవేశించారు. అలానే దుండగులు ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా ముందస్తు జాగ్రతగా బ్యాంకు లోని…
Chennai: స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు చెన్నై సమీపం లోని ఓ ఫాంహౌస్ను అద్దెకు తీసుకున్నారు. అనంతరం అందరూ ఫాంహౌస్ కు వెళ్లి పార్టీని బాగా ఎంజాయ్ చేశారు. అయితే పార్టీలో పాల్గొన్న 8 మంది మహిళలను, 15 మంది పురుషులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన చెన్నై సమీపం ఈసీఆర్ రోడ్డులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. కొందరు వ్యక్తులు చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డుపై పనైయూర్ వద్ద ఉన్న ఓ ఫాంహౌస్ను పార్టీ…
Anantapur: తెలిసీ తెలియని వయసు తనది.. ప్రేమకి ఆకర్షణకి మధ్య తేడా తెలియని టీనేజ్.. తప్పును తప్పు అని చెప్తే ఒప్పుకోలేని కౌమార దశ.. చేస్తుంది తప్పు అని నెమ్మదిగా నచ్చ చెప్పాల్సిన బాధ్యత కుటుంభసభ్యులది. కానీ అలా చెయ్యలేదు. 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చెయ్యాలి అనుకున్నారు. వినలేదని కొట్టి ఉరివేసి ప్రాణాలు తీశారు. ఈ దారుణ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా లోని గార్లదిన్నె మండలం లోని…