ఈ మెగా టోర్నీలో నవంబరు 15న తొలి సెమీఫైనల్, నవంబరు 16న రెండో సెమీఫైనల్ జరగనుంది. నవంబరు 19న ఫైనల్ నిర్వహించనున్నారు. ఈ మూడు నాకౌట్ మ్యాచ్ ల కోసం తుది విడత టికెట్లను ఈరోజు విక్రయించనున్నారు. రాత్రి 8 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తెలిపింది. అధికారిక వెబ్ సైట్ https://tickets.cricketworldcup.com. ద్వారా కూడా టికెట్లను కొనుగోలు చేయవచ్చు.
బెంగళూరు నగరంలో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కురుస్తున్న కుండపోత వర్షాల ధాటికి రాష్ట్రం లో పలు చోట్ల జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కాగా సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి బెంగళూరు లోని వెస్ట్ డివిజన్ లోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ఆయుధశాల గోడ కూలిపోయింది.
ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన టీడీపీ - జనసేన జేఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
Uttar Pradesh: 2021 లో సతీష్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన కాగజ్ ఈ సినిమా చూసిన వాళ్ళకి మృతక్ లాల్ బిహారీ గురించి పరిచయం అవసరం లేదు. ఆయన బ్రతికి ఉండగానే రికార్డ్స్ లో చనిపోయినట్లు చిత్రీకరించారు. కేవలం అయన ఆస్థి కోసం సొంత మామనే అధికారులకు లంచం ఇచ్చి ఇలా చిత్రీకరించారు. అయితే తాను చనిపోలేదు ప్రాణాలతోనే ఉన్నాను అని నిరూపించుకునేందుకు లాల్ బిహారీకి 19 సంవత్సరాలు పట్టింది. ఈ నేపథ్యంలో ఆయన పేరులో మృతక్…
దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికి హాని చేయడని ఆయన అన్నారు. కొంత మంది ఓ వ్యక్తిని రెచ్చగొట్టి, బాగా తాగించి కత్తితో దాడి చేయించారని ఆయన ఆరోపించారు. గంట లేట్ అయితే ప్రభాకర్ రెడ్డి ప్రాణానికే ప్రమాదం ఉండేదన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజులపాటు సొంత జిల్లా కడప, అన్నమయ్య జిల్లాల్లో పర్యటనలో ఉండనున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి అభి ఫంక్షన్ హాల్కు చేరుకొని ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్ఫర్సన్ జకీయా ఖానం కుమారుడు ముష్రఫ్ అలీ ఖాన్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
Bengaluru: ఆయుధం పట్టుకున్న వాళ్ళు ఆయుధం తోనే పోతారు అంటారు మన పెద్దలు. కొన్ని సార్లు ఆ మాట నిజమే అనిపిస్తుంది. టీ తాగేందుకు వెళ్ళాడు ఓ రౌడీషీటర్. క్షణాల్లో ఆ రౌడీషీటర్ ను చుట్టుముట్టి చంపేశారు కొందరు దుండగులు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సహదేవ్ అనే రౌడీషీటర్ కర్ణాటక రాష్ట్రంలో ధారుణ హత్యకు గురైయ్యాడు. బుధవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధి లోని చుంచనఘట్ట…
Jharkhand: ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత మంది యువత తప్పు దారి పడుతుంది. యువతను టార్గెట్ చేస్తూ ఉగ్రవాద సంస్థలు వాళ్ళ బోధనలతో యువత ఆలోచనను తప్పుతోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో టెర్రిస్టులు పుట్టుకొస్తున్నారు. దీనితో టెర్రరిజం పైన ద్రుష్టి సారించింది యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్). ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలో టెర్రరిజం పై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు.…