నేటి నుండి ఇంద్రకీలాద్రి పై భవాని మండల దీక్ష ధారణ ప్రారంభమైంది. కాగా ఇంద్రకీలాద్రి పై ఈ రోజు ప్రారంభమైన భవాని మండల దీక్ష ఈనెల 27 వ తేదీ వరకు వరకు ఉంటుంది.
అత్తింటి కాపురం కత్తి మీద సాము లాంటిది అంటారు మన పెద్దలు. అయితే కూతురును అత్తింటి వారు వేధిస్తున్నారని ఆ అత్తింటి వారినే కత్తులతో పొడిచి కడతేర్చారు ఓ కోడలి తరుపు బంధువులు.
బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో ఎన్టీవీ క్వశ్చన్ అవర్లో పాల్గొన్నారు. అధికారిగా ఉన్నప్పుడు చాలా పరిమితులు ఉంటాయని.. రాజకీయాల్లో ఉంటే పరిమితులు ఉండవన్నారు. ఖాకీ, ఖద్దరు రెండు బాగానే ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు. కేసీఆర్ను ముఖ్యమంత్రిగా మాత్రమే చూశాను.. ఇంద్రుడు, చంద్రుడు అని ఎప్పుడూ పొగడలేదన్నారు.
ఇద్దరు విద్యార్థులు క్లాస్ రూంలో కొట్టుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో గొడవ పడుతున్నారు. అయితే వారిద్దరూ సీటు కోసం గొడవ పడుతుండటంలా అనిపించింది. ఈ ఫైట్ కి సంబంధించిన వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. ఇద్దరు విద్యార్థులు సీటుకోసం ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక పై అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ ఫైనల్ ఓడిన తర్వాత రోహిత్ శర్మ భవితవ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ మెగాటోర్నీలో తనదైన బ్రాండ్ క్రికెట్తో ఆకట్టుకున్న రోహిత్.. చివరకు ట్రోఫీని సాధించడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పై బీసీసీఐ చర్చలు మొదలు పెట్టిందట. ఈ క్రమంలో…
మాజీ ఎంపీ గడ్డం వినోద్ ఇంట్లో సోదాలపై ఈడీ ఓ ప్రకటన చేసింది. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో గడ్డం వినోద్ పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు బయటపడ్డాయని తెలిపారు. దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు ఈడీ ప్రకటించింది. అంతేకాకుండా.. భారీ ఎత్తున అక్రమ లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించింది ఈడీ. నకిలీ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. యశ్వంత్ రియాల్టీతో పాటుగా గడ్డం వినోదు భార్య పేర్లతో భారీగా ఆస్తులను గుర్తించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలనకు పెనుముప్పు తప్పింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల భారీ డంపును ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కిరిమితి, తులసి అటవీ ప్రాంతంలో భారీ డంప్ బయటపడింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండుసార్లు కేసీఆర్ ను ఎమ్మెల్యేను చేస్తే... మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచాడని ఆరోపించారు. కొండపోచమ్మలో మిమ్మల్ని తోసిండు, రంగనాయక్ సాగర్ లో ముంచిండని విమర్శించారు.