దేశ ద్రోహం కేసు, తెల్గి స్కాంలో మూడేళ్లు జైలుకు పోయి వచ్చిన వ్యక్తి బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ అవినీతిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని అంబర్ పేట బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ విమర్శించారు. ఈ సందర్భంగా.. ప్రచారంలో జోరు పెంచారు. ఈరోజు గోల్నాక డివిజన్లోని శంకర్ నగర్, అశోక్ నగర్ తదితర ప్రాంతాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని కొల్లూరులో క్రికెటర్ శ్రీశాంత్ స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు గురించి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఐదుసార్లు టైటిల్ సొంతం చేసుకున్నారు. ఆ జట్టుకు కెప్టెన్ గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అంతేకాకుండా.. క్రికెట్ అభిమానులకు ఆ టీమ్ అంటే ఎంతో పిచ్చి. అలాంటిది గత సీజన్ తమ అభిమానులను ఎంతో నిరాశపరిచింది. అందుకోసమని 2024 సీజన్ పై ముంబై ఇండియన్స్ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో జట్టులోకి విదేశీ ప్లేయర్లును తీసుకునే ఆలోచనలో ఉంది.
కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గెలిచి హైదరాబాద్లో ఉన్నారు.. జగ్గారెడ్డి సీఎం అవుతా అంటున్నారు.. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవరని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ ప్రసంగించారు.
పాకిస్తాన్ వక్రబుద్ధి పోనించుకోవడం లేదు. మొన్నటికి మొన్న మాజీ మిస్ ఇండియా ఐశ్వర్యా రాయ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్.. మరోసారి నోరుపారేసుకున్నాడు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపై విమర్శలు చేశాడు. క్రికెట్ గెలిచిందంటూ ఆయన ట్వీట్ చేశాడు.
పుట్టుకతోనే మూగ, చెవుడు ఉన్న.. ఆ లోపాన్ని లెక్క చేయకుండా లోపం శరీరానికే కానీ మెదడుకు కాదు అని నిరూపించి అందరూ ఆశ్చర్యపోయేలా ప్రముఖ కంపెనీలలో ఉద్యోగం చేస్తున్నారు ఓ యువతీ యువకుడు.
బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన బీఎస్పీ బహిరంగ సభలో ఆమె వ్యాఖ్యానించారు. అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ అని ఆమె తెలిపారు.
ప్రముఖుల నుండి సాధారణ ప్రజల వరకు చాలంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్ళ పైన ద్రుష్టి సారించారు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.