Ajmer Dargah: “అజ్మీర్ దర్గా కింద శివాలయం”.. కోర్టులో మహారాణా ప్రతాప్ సేన పిటిషన్..
- అజ్మీర్ దర్గా కింద శివాలయం ఉంది..
- కోర్టులో మహారాణా ప్రతాప్ సేన పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajmer Dargah: ప్రతిష్టాత్మక అజ్మీర్ షరీఫ్ దర్గా మరోసారి రాజకీయ వివాదంగా మారింది. దర్గాకు వ్యతిరేకంగా హిందూ సంస్థ మహారాణా ప్రతాప్ సేన (MPS) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే 2024లో హిందూ సేన పిటిషన్ దాఖలు చేసింది. దర్గా ఉన్న స్థలంలో ఒకప్పుడు శివాలయం ఉండేదని పిటిషన్లు పేర్కొంటున్నాయి. ఈ రెండు పిటిషన్లను స్థానిక కోర్టు స్వీకరించింది. తమ వాదనలకు మద్దతుగా మ్యాపులు, ఫోటోలు, ఇతర ఆధారాలను కోర్టులో సమర్పిస్తామని ఎంపీఎస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ పర్మార్ చెప్పారు. ఈ రెండు పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 21న కోర్టు విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం, భారత పురావస్తు సర్వే(ఏఎస్ఐ), దర్గా కమిటి స్పందనలను కోరుతూ కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఎంపీఎస్ సభ్యులు దేశవ్యాప్తంగా 7800 కి.మీ యాత్ర చేపట్టారని, దర్గా కింద ఆలయం ఉందనే వాదనకు మద్దతుగా ఇచ్చే వందలాది మంది ప్రజల నుంచి అఫిడవిట్లు సేకరించారని సంస్థ పేర్కొంది. గతంలో హిందూ సేన దాఖలు చేసిన దావాలో కోర్టులో వారి వాదనకు మద్దతుగా చరిత్రకారుల పుస్తకాలను సమర్పించారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దర్గా కమిటీ ఇప్పటికే కోర్టులో అటువంటి వాదనలన్నింటినీ తిరస్కరించాయి, ఈ సూఫీ మందిరం పార్లమెంట్ ఆమోదించిన దర్గా చట్టం కింద నడుస్తుందని గుర్తు చేశాయి.
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
అజ్మీర్ దర్గా చరిత్ర..
అజ్మీర్ షరీఫ్ దర్గాను దర్గా ఖ్వాజా గరీబ్ నవాజ్ లేదా హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి దర్గా అని కూడా పిలుస్తారు. ఇది రాజస్థాన్లోని అజ్మీర్ నగరంలో ఉన్న ఒక పవిత్ర సూఫీ మందిరం. ఈ మందిరం సూఫీ సాధువు హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి సమాధి. ఆయనను “పేదలకు మద్దతుదారుడు”గా “గరీబ్ నవాజ్” అని పిలుస్తారు. ఈ మందిరం భారతదేశంలోని అతిపెద్ద, అతి ముఖ్యమైన సూఫీ మందిరాలలో ఒకటి. అన్ని మతాలు, కులాలు, వర్గాల ప్రజలు ఈ మందిరాన్ని సందర్శిస్తారు. ఇది ప్రేమ, కరుణ, ఐక్యత మరియు శాంతి సందేశాన్ని ఇస్తుంది.
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి 1141 ADలో పర్షియాలో జన్మించాడు. ఆయన చిష్తి క్రమంలో ప్రముఖ సూఫీ సాధువు. ఆయన 1192 ADలో భారతదేశానికి తిరిగి వచ్చి అజ్మీర్లో స్థిరపడ్డారు. పేదలకు సహాయం చేయడం, ప్రార్థన చేయడం, మానవాళికి సేవ చేయడం ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి 1236 ADలో మరణించాడు. తరువాత ఆయన సమాధిపై ఒక దర్గా నిర్మించబడింది.
ఈ దర్గా నిర్మాణం మొదట సుల్తాన్ ఇల్తుమిష్ పాలనలో ప్రారంభమైంది. తరువాత, మొఘల్ చక్రవర్తి హుమాయున్ దీనికి మరింత ఆధునిక రూపాన్ని ఇచ్చాడు. తదనంతరం, మొఘల్ చక్రవర్తి అక్బర్ దర్గాకు తన పోషణను విస్తరించాడు. అక్బర్ తరచుగా అజ్మీర్ షరీఫ్ను సందర్శించడానికి నడిచి వెళ్ళేవాడు. షాజహాన్ తన పాలనలో దర్గాను విస్తరించాడు. ఇతను మసీదులను కూడా నిర్మించారు. హైదరాబాద్ నిజాం ప్రసిద్ధ నిజాం గేటును నిర్మించాడు.
తాజావార్తలు
-
GSLV-F17: ISRO మరో ఘన విజయం.. GSLV-F17 ప్రయోగం సక్సెస్.. EOS-05 ఉపగ్రహం ఏం చేస్తుంది? భారత్కు ఎలా ఉపయోగపడుతుంది?
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్స్.. ఆలియా భట్, షాహిద్ కపూర్ స్పెషల్ రోల్స్లో?
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!