What’s Today: • కర్నూలు: ఎమ్మిగనూరులో నేడు సీపీఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం.. హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ • సత్యసాయి జిల్లా: సత్యసాయి బాబా 97 వ జయంతి పురస్కరించుకుని నేటి నుంచి పుట్టపర్తిలో నారాయణ సేవ కార్యక్రమం • తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలో నేటితో ముగియనున్న జాతీయ ఆయుర్వేద పర్వ్.. ప్రజల్లో ఆయుర్వేద వైద్యంపై అవగాహన పెంచేందుకు ఆనం కళాకేంద్రంలో జరుగుతున్న ఉత్సవం • ప్రకాశం: ఒంగోలు మండలం చేజర్లలో నూతనంగా…
తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం సృష్టించింది.. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ఆడియో టేపులు, వీడియో ఫుటేజ్ వైరల్గా మారిపోయింది.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నోటీసుల్లో గందరగోళం ఏర్పడింది.
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. తన రెండో కొడుకు విశ్వజిత్ పెళ్లికి ఆహ్వానించడానికి ప్రధాన మంత్రి మోదీ కలిశామన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తనను ప్రధాని మోడీ ఎంతో ఆప్యాయంగా పలకరించారని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి చేసిన వ్యాఖ్యలతో రాజకీయ రచ్చ మొదలైంది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలువురు బీజేపీ ఎంపీ ఇంటిని సీజ్ చేశారు.
Telangana: ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ విద్యార్థులు.. బడిలోనే బ్యాంకు ఏర్పాటు సాధారణంగా బ్యాంకులు రోజులో ఆరేడు గంటలు పనిచేస్తుంటాయి. కానీ ఈ బ్యాంక్ మాత్రం అరగంటే పనిచేస్తుంది. అదేంటి అనుకుంటున్నారా.. ఇది బడిలోని బ్యాంక్. ఇక్కడ స్కూల్ విద్యార్థులే ఉద్యోగులు. వాళ్లే ఇక్కడ బ్యాంక్ మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్, క్లర్క్. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని జనగామ జిల్లా చిల్పూర్లోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయుల చొరవతో బడిలోనే బ్యాంక్ ఏర్పాటు చేసుకుని…
What’s Today: • తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. ఈరోజు, రేపు చలి పెరిగే అవకాశం.. తెలంగాణలోని వికారాబాద్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు • హైదరాబాద్: నేడు, రేపు ఫార్ములా ఈ రేసింగ్ లీగ్ ట్రయల్ రన్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రయల్ రన్ • తూర్పుగోదావరి జిల్లా్: నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదుకు ప్రత్యేక శిబిరాలు • విజయవాడ:…
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు తెలంగాణ రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చగా మారింది.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆయన ఫామ్హౌస్లోనే జరగడంతో.. అందరి దృష్టి ఆయనపైనే పడింది.. ప్రభుత్వం ఆయనకు భద్రతను కూడా పెంచింది.. అయితే, ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి కనిపించడం లేదంటూ తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిందింది.. గత 20 రోజుల నుంచి మా ఎమ్మెల్యే కనిపించడంలేదు.. మిస్సింగ్ అయ్యారా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదా ఇంకా…
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి పై దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు. ఈ దాడికి ప్రధాన కారణమైన ఎమ్మెల్సీ కవితపై కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.