Off The Record: ఆ కలెక్టర్ కాంట్రావర్సీకి కేరాఫ్ అడ్రస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ కలెక్టర్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్సా? ఆ మధ్య కేంద్రమంత్రి ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక చర్చల్లోకి వచ్చారు. తాజాగా రైతుల ధర్నాపై స్పందించ లేదనే విమర్శలు ముసురుకుంటున్నాయి. ఆ కలెక్టర్ తీరు పదే పదే ఎందుకు ప్రశ్నలకు తావిస్తోంది? ఎవరా కలెక్టర్? లెట్స్ వాచ్..!
Also Read
- OTR : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా మారారా?
- OTR : వైసీపీ అధిష్టానం కఠిన నిర్ణయాలకు సిద్ధం అయిందా? ఆ ముగ్గురు నేతల పరిస్థితి ఏంటి?
- OTR : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీరుపై సీఎం రేవంత్ సీరియస్.. అసలు కారణం ఇదే
- OTR : సొంత వైఎస్సార్సీపీకి షాకిస్తున్న ఎమ్మెల్సీ.. పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వెనుక ఆంతర్యమేంటి?
ఏడాదిన్నర క్రితం కామారెడ్డి కలెక్టర్గా రాక
జితేష్ పాటిల్. కామారెడ్డి జిల్లా కలెక్టర్. 2016 బ్యాచ్కు చెందిన ఈ IAS అధికారి ఏడాదిన్నర క్రితం కామారెడ్డి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కామరెడ్డికి వచ్చే ముందు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించారు. కలెక్టర్గా ఆయనకు తొలిపోస్ట్ ఇదే. ప్రస్తుతం కామారెడ్డి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాస్టర్ప్లాన్ సమస్యను సరిగ్గా హ్యాండిల్ చేయలేదని విమర్శలు హోరెత్తుతున్నాయి. రైతులు ఏడు గంటలపాటు ధర్నా చేస్తే.. వాళ్లను కూల్ చేయాల్సింది పోయి.. కూర్చున్న కుర్చీలోంచి కదల లేదని.. ఆయన వైఖరే అగ్నికి ఆజ్యంపోసినట్టు అయ్యిందని కొందరి వాదన.
డ్రాఫ్ట్ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం..!
జిల్లా కేంద్రంగా ఉన్న కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మాస్టర్ప్లాన్ తెరపైకి వచ్చింది. అయితే ఆ మాస్టర్ ప్లాన్ ముసాయిదా డ్రాఫ్ట్ను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కలెక్టర్ ఫెయిల్ అయ్యారనే అభిప్రాయం అధికారపార్టీ వర్గాల్లో ఉంది. ఆ ఉదాసీనతే గోటితో పోయే సమస్యను గొడ్డలి వరకు తీసుకొచ్చారని బీఆర్ఎస్ నేతలు గుర్రుగా ఉన్నారట. రైతులు కామారెడ్డి బంద్కు పిలుపు ఇవ్వడంతో కలెక్టర్ తీరు ప్రస్తుతం చర్చగా మారింది. అనుభవ రాహిత్యమే సమస్యకు కారణం అనేవాళ్లూ ఉన్నారు. కీలక నిర్ణయాల్లో రాజకీయ వర్గాలను కలుపుకొని వెళ్లాలి. ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేయడం కూడా కీలకమే. ఈ రెండు అంశాల్లో కలెక్టర్ వ్యవహరించిన తీరే ప్రస్తుతం ప్రశ్నగా మారింది.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నలకు తడబాటు
గతంలో జిల్లాలో కేంద్ర ఆర్థికమంతి నిర్మలా సీతారామన్ పర్యటనలోనూ కలెక్టర్ జితేష్ పాటిల్ చర్చల్లోకి వచ్చారు. పీడీఎస్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత అని కేంద్రమంత్రి ప్రశ్నించడం.. ఆయన చెప్పలేకపోవడంతో అదో ఇష్యూ అయ్యింది. ఆ సందర్భంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఇప్పుడు రైతుల ఆందోళనలతో కలెక్టర్ మళ్లీ చర్చల్లోకి వచ్చారు. ఇప్పటికే ఈ సమస్యపై ప్రభుత్వ పెద్దలు.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మస్టర్ ప్లాన్ ముసాయిదా కేవలం డ్రాఫ్ట్ దశలోనే ఉందని ప్రజలకు, రైతులకు ఎందుకు నచ్చచెప్పలేదని ప్రశ్నించారు. మరి ఈ రెండు ఘటనల తర్వాత కలెక్టర్ తన తీరును మార్చుకుంటారో లేక ఎస్ నేనింతే అని అలాగే ఉండిపోతారో చూడాలి.
తాజావార్తలు
-
TDP vs YCP: చిప్పగిరిలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే విరూపాక్షి!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Sunday Horoscope: నేటి రాశిఫలాలు.. ఆ రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాల్సిందే.!
-
India 8 Gold Medals: ఒకే రోజు 8 స్వర్ణాలు.. రెండు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా గుల్వీర్ సింగ్ రికార్డ్
-
Peru: కూలిన పర్యాటక విమానం.. 13 మంది మృతి.!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!