తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. పశ్చిమం నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు అల్పపీడన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
TS Congress: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్లో చేరడం ఖాయమైంది. ఏ రోజు కాంగ్రెస్లో చేరబోతున్నారనేది కూడా తేలిపోయింది. ఈ నెలాఖరున అంటే జూన్ 30న పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
కరీంనగర్ జిల్లాలోని ఓ హోటల్ ఓపెనింగ్ రోజు క్రేజీ ఆఫర్ ను ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయికే బిర్యానీ అని ప్రచారం చేసింది. అయితే అక్కడ నో పార్కింగ్ లో పార్కింగ్ చేసిన వెహికిల్స్ కు పోలీసులు రూ.100 జరిమానా విధించారు. రూపాయి బిర్యానీ కోసం వెళ్తే వంద రూపాయల ఫైన్ కట్టాల్సి రావడంతో జనాలు హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
TSRTC: గ్రామీణ, పట్టణ ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, వృద్ధుల కోసం 'టి-9 టిక్కెట్' అందుబాటులోకి వచ్చింది.
Traffic restrictions:ఈరోజు, రేపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి రాక దృష్ట్యా శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
Vande Bharat Train: తెలంగాణ రాష్ట్రానికి మరో వందేభారత్ ట్రైన్ రాబోతోంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ నడుస్తోంది. ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది భారత రైల్వే. సికింద్రాబాద్-నాగ్ పూర్ మధ్య వందేభారత్ రైలు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పటికే ఈ రూట్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్స్ పూర్తయ్యాయి. సాధారణ కార్యకలాపాలకు అనువుగా ఉందని రైల్వే శాఖ నిర్థారణకు వచ్చింది.