UP: యూపీలో వింతైన ఘటన.. ప్రియుడితో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ భార్య.. భర్త ఏం చేశాడంటే..!
- అడ్డదారులు తొక్కుతున్న ఇల్లాల్లు
- ప్రియుడితో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ భార్య
- ఉత్తరప్రదేశ్లో ఘటన
భారతదేశంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకే భార్య.. ఒకే భర్త అన్న సాంప్రదాయం ఉంది. ఇక వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాక చచ్చేంత వరకు కలిసి ఉండాలి. ఇదే పద్ధతి దేశంలో కొనసాగుతోంది. కానీ నేటి ఆధునిక యుగంలో ఆ బంధానికి విలువ లేకుండా పోయింది. క్షణిక సుఖం కోసం అడ్డదారులు తొక్కి… కట్టుకున్న వాళ్లతో బంధాలు తెంచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఒక ఇల్లాలు.. ప్రియుడి మోజులో పడి భర్త, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
ఆశిష్ తివారీ-పింకీ భార్యాభర్తలు. 2016లో వీరికి వివాహం అయింది. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 7, 4 ఏళ్ల ఇద్దరు కుమారులున్నారు. కుటుంబం సాఫీగా సాగిపోతుంది. ఈ క్రమంలో పింకీ అడ్డదారులు తొక్కింది. అమిత్ శర్మ అనే యువకుడితో ఎఫైర్ నడిపింది. అయితే గత శనివారం పింకీ-అమిత్ శర్మ ఇంట్లో ఏకాంతంగా ఉన్నప్పుడు ఆశిష్ తివారీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి రప్పించాడు. దీంతో ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసులు రాజీ చేసి భర్తతో వెళ్లిపోవాలని పింకీకి కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ పింకీ మాత్రం భర్తతో వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదు. ప్రియుడు అమిత్ శర్మతోనే ఉంటానని తెగేసి చెప్పింది. పోలీసులు ఎంత నచ్చ జెప్పినా మాట వినలేదు. ప్రియుడితోనే జీవిస్తానని చెప్పింది. ఇలా రోజంతా పంచాయితీ చేసినా ఏ మాత్రం పింకీ వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు చేతులెత్తేశారు. ఇక పిల్లలు తల్లితో వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టం చూపలేదు. తమ తండ్రితోనే ఉంటామని పిల్లలిద్దరూ తెగేసి చెప్పారు.
ఇది కూడా చదవండి: Gold-Silver Rates: మళ్లీ దుమ్మురేపుతోన్న వెండి, గోల్డ్ ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే..!
ఇక చేసేదేమీలేక ఆశిష్ తివారీ…అమర్గఢ్లోని పురాతన శివాలయంలో ప్రియుడు అమిత్ శర్మకు పింకీని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇరువైపుల నుంచి బంధువులు హాజరయ్యారు. అమిత్ శర్మ దిలీప్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీసిద్దిపూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన సమీప ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.

తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!