UP: యూపీలో వింతైన ఘటన.. ప్రియుడితో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ భార్య.. భర్త ఏం చేశాడంటే..!
- అడ్డదారులు తొక్కుతున్న ఇల్లాల్లు
- ప్రియుడితో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ భార్య
- ఉత్తరప్రదేశ్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకే భార్య.. ఒకే భర్త అన్న సాంప్రదాయం ఉంది. ఇక వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాక చచ్చేంత వరకు కలిసి ఉండాలి. ఇదే పద్ధతి దేశంలో కొనసాగుతోంది. కానీ నేటి ఆధునిక యుగంలో ఆ బంధానికి విలువ లేకుండా పోయింది. క్షణిక సుఖం కోసం అడ్డదారులు తొక్కి… కట్టుకున్న వాళ్లతో బంధాలు తెంచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఒక ఇల్లాలు.. ప్రియుడి మోజులో పడి భర్త, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ఆశిష్ తివారీ-పింకీ భార్యాభర్తలు. 2016లో వీరికి వివాహం అయింది. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 7, 4 ఏళ్ల ఇద్దరు కుమారులున్నారు. కుటుంబం సాఫీగా సాగిపోతుంది. ఈ క్రమంలో పింకీ అడ్డదారులు తొక్కింది. అమిత్ శర్మ అనే యువకుడితో ఎఫైర్ నడిపింది. అయితే గత శనివారం పింకీ-అమిత్ శర్మ ఇంట్లో ఏకాంతంగా ఉన్నప్పుడు ఆశిష్ తివారీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి రప్పించాడు. దీంతో ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసులు రాజీ చేసి భర్తతో వెళ్లిపోవాలని పింకీకి కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ పింకీ మాత్రం భర్తతో వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదు. ప్రియుడు అమిత్ శర్మతోనే ఉంటానని తెగేసి చెప్పింది. పోలీసులు ఎంత నచ్చ జెప్పినా మాట వినలేదు. ప్రియుడితోనే జీవిస్తానని చెప్పింది. ఇలా రోజంతా పంచాయితీ చేసినా ఏ మాత్రం పింకీ వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు చేతులెత్తేశారు. ఇక పిల్లలు తల్లితో వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టం చూపలేదు. తమ తండ్రితోనే ఉంటామని పిల్లలిద్దరూ తెగేసి చెప్పారు.
ఇది కూడా చదవండి: Gold-Silver Rates: మళ్లీ దుమ్మురేపుతోన్న వెండి, గోల్డ్ ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే..!
ఇక చేసేదేమీలేక ఆశిష్ తివారీ…అమర్గఢ్లోని పురాతన శివాలయంలో ప్రియుడు అమిత్ శర్మకు పింకీని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇరువైపుల నుంచి బంధువులు హాజరయ్యారు. అమిత్ శర్మ దిలీప్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీసిద్దిపూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన సమీప ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.

తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!