UP: యూపీలో వింతైన ఘటన.. ప్రియుడితో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ భార్య.. భర్త ఏం చేశాడంటే..!
- అడ్డదారులు తొక్కుతున్న ఇల్లాల్లు
- ప్రియుడితో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ భార్య
- ఉత్తరప్రదేశ్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకే భార్య.. ఒకే భర్త అన్న సాంప్రదాయం ఉంది. ఇక వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాక చచ్చేంత వరకు కలిసి ఉండాలి. ఇదే పద్ధతి దేశంలో కొనసాగుతోంది. కానీ నేటి ఆధునిక యుగంలో ఆ బంధానికి విలువ లేకుండా పోయింది. క్షణిక సుఖం కోసం అడ్డదారులు తొక్కి… కట్టుకున్న వాళ్లతో బంధాలు తెంచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఒక ఇల్లాలు.. ప్రియుడి మోజులో పడి భర్త, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి
Also Read
- PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
- Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
- Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ఆశిష్ తివారీ-పింకీ భార్యాభర్తలు. 2016లో వీరికి వివాహం అయింది. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 7, 4 ఏళ్ల ఇద్దరు కుమారులున్నారు. కుటుంబం సాఫీగా సాగిపోతుంది. ఈ క్రమంలో పింకీ అడ్డదారులు తొక్కింది. అమిత్ శర్మ అనే యువకుడితో ఎఫైర్ నడిపింది. అయితే గత శనివారం పింకీ-అమిత్ శర్మ ఇంట్లో ఏకాంతంగా ఉన్నప్పుడు ఆశిష్ తివారీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి రప్పించాడు. దీంతో ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసులు రాజీ చేసి భర్తతో వెళ్లిపోవాలని పింకీకి కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ పింకీ మాత్రం భర్తతో వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదు. ప్రియుడు అమిత్ శర్మతోనే ఉంటానని తెగేసి చెప్పింది. పోలీసులు ఎంత నచ్చ జెప్పినా మాట వినలేదు. ప్రియుడితోనే జీవిస్తానని చెప్పింది. ఇలా రోజంతా పంచాయితీ చేసినా ఏ మాత్రం పింకీ వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు చేతులెత్తేశారు. ఇక పిల్లలు తల్లితో వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టం చూపలేదు. తమ తండ్రితోనే ఉంటామని పిల్లలిద్దరూ తెగేసి చెప్పారు.
ఇది కూడా చదవండి: Gold-Silver Rates: మళ్లీ దుమ్మురేపుతోన్న వెండి, గోల్డ్ ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే..!
ఇక చేసేదేమీలేక ఆశిష్ తివారీ…అమర్గఢ్లోని పురాతన శివాలయంలో ప్రియుడు అమిత్ శర్మకు పింకీని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇరువైపుల నుంచి బంధువులు హాజరయ్యారు. అమిత్ శర్మ దిలీప్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీసిద్దిపూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన సమీప ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.

తాజావార్తలు
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
-
Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!