తెలంగాణలో ఈ మధ్య సైకోలు ఎక్కువ అవుతున్నారు.. అసలు ఎక్కడినించి వస్తున్నారో కూడా తెలియకుండా కనిపించిన వారిపై దాడికి తెగబడుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా తెలంగాణలో మరో సైకో వీరంగం సృష్టించాడు.. కనిపించిన వారిని ఇష్టానూసారంగ కొట్టి గాయపరిచాడు.. ఈ ఘటన వరంగల్ లో వెలుగుచూసింది.. ఈ విచిత్ర సైకో సంఘటన పుప్పాలగుట్ట ప్రాంతంలో జరిగింది. అతను ఎవరో అక్కడివారికి తెలియదు. కానీ అతడు నేరుగా ఓ ఇంట్లోకి చొరబడ్డాడు.. ఇంట్లో…
హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. హైవే లపై స్పీడ్ లిమిట్ పెట్టినా కూడా వాహనాదారులు పాటించడం లేదు.. దాంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.. నిన్న కారు ప్రమాదం జరిగింది.. నేడు మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు.. ఈ ఘోర ప్రమాదం మేడ్చల్ లో వెలుగు చూసింది.. శామీర్ పెట్ కీసర దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం…
ఫ్రెండ్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నాడని అతనికి వీడ్కోలు చెప్పి తిరిగి వస్తుండగా మృత్యువు కబలించింది..ఈ విషాదకర ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిలోని కోమళ్ల టోల్గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే.. అమెరికాకు వెళ్తున్న తమ మిత్రుడికి సెండాఫ్ ఇచ్చేందుకు వరంగల్కు చెందిన రాకేశ్ చంద్ర గౌడ్, సందీప్ ఇద్దరూ కలిసి శుక్రవారం రాత్రి బొలెరోలో హైదరాబాద్కు వెళ్లారు. పెంబర్తి రిసార్ట్లో రాత్రంతా స్నేహితుడితోనే ఉండి..…
గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. అందరికి బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాల కోసం నాకు ఎక్కడ నుంచి అధికారిక ఇన్విటేషన్ రాలేదు అని ఆమె పేర్కొన్నారు. రాజ్ భవన్ మహిళలు మాత్రం నన్ను బోనాలకు ఆహ్వానించారు.. ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానం లేదు అని గవర్నర్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే క్యాన్సిల్ చేసింది. విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో మెయింటనెన్స్ వర్క్స్ దృష్ట్యా పలు ట్రైన్స్ ను అధికారులు రద్దు చేశారు. ఇవాళ్టి నుంచి 23వ తేదీ వరకు మరికొన్ని రైళ్లను పాక్షికంగా క్యాన్సిల్ చేసి మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. వచ్చే సెప్టెంబర్ 14న జర్మనీలోని బెర్లిన్ నగరంలో నిర్వహించే గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అలయెన్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని ఆయనను కోరారు.