రాగల మూడురోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ప్రభుత్వ బిజినెస్ రూల్స్- సెక్రటేరియట్ సూచనలకు అనుగుణంగా, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి స్వీకరించడం) బిల్లు-2023తో సహా రాష్ట్ర శాసనసభ కార్యదర్శి నుంచి అందిన అన్ని బిల్లులు చట్ట కార్యదర్శికి సిఫార్సు చేయబడ్డాయి.
రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది అని వస్తున్న అసత్య ప్రచారాల్ని ఎవరు నమ్మొద్దని ఇవాళ (గురువారం ) విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్లారిటి ఇచ్చారు. ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా ఈ ప్రకటనలను ఎవరు ప్రచారంలోనికి తీసుకురావద్దని ఆయన పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపైన కేటీఆర్ విస్తృతంగా చర్చించారు.
నిమ్స్ ఆసుపత్రిని నెదర్లాండ్స్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జాన్ కైపర్స్, ప్రతినిధుల బృందం సందర్శించింది. నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్, క్యాన్సర్, యూరాలజీ విభాగాలను జాన్ కైపర్స్ బృందం పరిశీలించింది. నిమ్స్ ఆస్పత్రిలో అందిస్తున్న చికిత్సలను అధ్యయనం చేసేందుకు ఈ టీమ్ వచ్చింది.
రైతుల మీద జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు.. 2023 డిసెంబర్ వరకే మీకు అధికారాన్ని ప్రజలు అప్పగించారు.. నీకేం 40 ఏళ్లకు ఇవ్వలేదు.. నువ్వేం నిజాం సర్కార్ వు కాదు అని ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ పోలీసులతో ఎన్నాళ్ళు రాజ్యం నడుపుతావు..
ఇటీవల తెలంగాణాలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఇప్పుడు తాజాగా మరో ఘోర ప్రమాదం వెలుగుచూసింది.. హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు… అయితే వెంటంనే మంటలను అదుపు చెయ్యడం తో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అంచనా వేస్తున్నారు.. ఆస్పత్రి భవనం నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అగ్నిమాపక శాఖ…
రెండు వారాలుగా కొనసాగుతున్న డ్రై స్పెల్కు ముగింపు పలుకుతూ తెలంగాణ వ్యాప్తంగా శనివారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం అంచనా వేసింది.. జూలై చివరి వారంలో అపూర్వమైన అవపాతం తర్వాత, నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. ఆగస్టు 16 నాటికి, రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 117 మి.మీ.కు గాను ఈ నెలలో కేవలం 21 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది.. ఫలితంగా 82 శాతం విచలనం నమోదైంది.. గత నెలలో కురిసిన…