కుటుంబ కలహాల వల్లో లేక వేరే కారణాల వల్ల అభం శుభం తెలియని చిన్నపిల్లలపై దారుణాలకు ఒడిగడుతున్నారు.. నిన్న తనకు దక్కని సంతోషాన్ని భార్యకు కూడా దూరం చేసేందుకు కన్న కొడుకును గొంతు కోసిన ఘటన మరువక ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. ఓ బాలుడిని ఆటో డ్రైవర్ అతి దారుణంగా గొంతు కోసిన ఘటన వెలుగు చూసింది.. ఈ దారుణ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ (సీపీఐ, సీపీఎం) పార్టీలతో పొత్తు ఉండదని తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి వెళ్తామని కమ్యూనిస్టు పార్టీలు ప్రకటించాయి. అయితే, పొత్తు విషయంపై బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం ఎలాంటి పొత్తు లేదని తేల్చి చెప్పింది.
ఈ సంవత్సరం చివరలో జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితాను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్ధులను ప్రకటించిన ఆయన పనితీరు సరిగ్గా లేని ఏడుగురు సిట్టింగ్లకు సీట్లు ఇచ్చేందుకు నిరాకరించారు.
రెండు చోట్ల పోటీ చేయనున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వెల్లడించారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి బరిలో దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్ సురక్షితమే అని ప్రచారం జరుగుతున్నా.. మరో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని పార్టీలో కొందరు ముఖ్య నేతలు కేసీఆర్ కు సూచించినట్లు సమాచారం.
హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.. నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతున్నాయి.. షార్ట్ సర్కుట్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.. తాజాగా మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. రంగారెడ్డి జిల్లా.. మైలార్ దేవులపల్లి.. టాటానగర్లో ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్లాంకెట్ గోడౌన్లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో గోడౌన్ లో 10 కార్మికులు పనులు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ఒక్కసారిగా బయటకు పరుగులు…
పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తిరగపడ్తామ్ తరిమి కొడతాం అనే కార్యక్రమంపై చర్చించామని ఆయన తెలిపారు. ఈనెల 21 నుంచి సెప్టెంబర్ 15 వరకు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సర్కార్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని నిర్ణయించినట్లు పేర్కొన్నాడు.