తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే.. కాగా, లోక్ సభ ఎన్నికలపై పార్టీ ఫోకస్ పెట్టింది. తెలంగాణలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలువాలని చూస్తోంది. ఈ క్రమంలో.. పార్టీ ముఖ్య నేతలు తీవ్రంగా పాటుపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ మంత్రులు కొందరు ఢిల్లీకి వెళ్లారు. కాసేపట్లో లోక్ సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ కానున్నారు.
Cyber Fraud: సైబర్ మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి లాటరీ తగిలిందని, లక్కీ డ్రా తీశామని, బంగారు, బంగారు నాణేలు వచ్చాయని చెప్పి మోసాలకు పాల్పడి దరఖాస్తుకు ఓటీపీ ఇవ్వాలని కోరుతున్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారు.. చెమట ధార పోశారు అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటినీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ తో పాటు సభ్యుల రాజీనామాను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.. అయితే, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యులు డిసెంబర్ లో రాజీనామాలు సమర్పించిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అడిగిన గవర్నర్.. దీంతో పాటు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు.
తెలంగాణాలో ఇటీవల వరుసగా గా అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. గత రెండు నెలల్లో భారీగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి.. ఇప్పటికే కొన్ని ప్రమాదాలు ఎలా జరిగాయి అనే దానిపై క్లారిటీ రాలేదు.. అయితే ఇప్పుడు మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. కలప మిల్లులో జరిగిన ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది.. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ జగిత్యాల జిల్లా కోరుట్లలోని సుఫియాన్ షా కలప మిల్లులో భారీ అగ్నిప్రమాదం…