Droupadi Murmu: దేశభద్రతలో రాజీ లేదు, ఆపరేషన్ సిందూర్పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిపబ్లిక్ డే స్పీచ్..
- ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావన..
- భారత ఆర్థిక వ్యవస్థ, మహిళా సాధికారతపై వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Droupadi Murmu: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో కూడా భారత్ శాంతి సందేశాన్ని ప్రపంచానికి అందిస్తూనే ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మానవజాతి సురక్షితంగా ఉండాలంటే ప్రపంచమంతా శాంతి నెలకొనాలని, అదే భారత్ అనుసరిస్తున్న నాగరికతా విలువ అని ఆమె అన్నారు. దేశభద్రత విషయంలో భారత్ రాజీ పడేది లేదని ఆమె స్పష్టం చేశారు. గతేడాది, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాక్పై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు.
Read Also: Rare earth elements: భారత్కు భారీ జాక్పాట్.. ఏకంగా మిలియన్ టన్నుల “అరుదైన ఖనిజాలు”..
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
గతేదాది సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద కేంద్రాలపై ఖచ్చితమైన దాడులు జరిగాయి. అనేక ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయని ఆమె చెప్పారు. ఇది భారత రక్షణ రంగంలో పెరుగుతున్న ఆత్మనిర్భరతకు నిదర్శనమని ఆమె అన్నాను. భారత సైన్యంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. మహిళా శక్తి దేశ అభివృద్ధి ప్రయాణానికి కేంద్ర బిందువని రాష్ట్రపతి చెప్పారు. 10 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో పాల్గొంటున్నారని, పంచాయతీ రాజ్ వ్యవస్థల్లో మహిళల ప్రాతినిధ్యం దాదాపు 46 శాతం ఉందని, నారి శక్తి వందన్ అధినయం మహిళల రాజకీయ సాధికారతను పెంచుతుందని ఆమె చెప్పారు. క్రీడలు, అంతరిక్షం, రక్షణ, వ్యాపార రంగాల్లో భారత మహిళలు రాణిస్తున్నారని అననారు.
ఇటీవల సంవత్సరాల్లో లక్షలాది మంది పేదరికం నుంచి బయట పడ్డారని, వారు మళ్లీ పేదరికంలోకి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, 81 కోట్ల మందికి కేంద్రం సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుతున్నాయని అన్నారు. ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా ఇప్పుడు భారత్లోనే జరుగుతున్నాయని ఆమె తెలిపారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారే దిశగా దేశం ప్రయాణిస్తోందని అన్నారు. స్వాతంత్య్రం తర్వాత జీఎస్టీని అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా రాష్ట్రపతి అభివర్ణించారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. భారత స్వాతంత్య్ర పోరాటంలో దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన గీతమని కొనియాడారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!