Droupadi Murmu: దేశభద్రతలో రాజీ లేదు, ఆపరేషన్ సిందూర్పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిపబ్లిక్ డే స్పీచ్..
- ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావన..
- భారత ఆర్థిక వ్యవస్థ, మహిళా సాధికారతపై వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Droupadi Murmu: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో కూడా భారత్ శాంతి సందేశాన్ని ప్రపంచానికి అందిస్తూనే ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మానవజాతి సురక్షితంగా ఉండాలంటే ప్రపంచమంతా శాంతి నెలకొనాలని, అదే భారత్ అనుసరిస్తున్న నాగరికతా విలువ అని ఆమె అన్నారు. దేశభద్రత విషయంలో భారత్ రాజీ పడేది లేదని ఆమె స్పష్టం చేశారు. గతేడాది, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాక్పై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు.
Read Also: Rare earth elements: భారత్కు భారీ జాక్పాట్.. ఏకంగా మిలియన్ టన్నుల “అరుదైన ఖనిజాలు”..
Also Read
- Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు...ఇంతటి విలయానికి అదే కారణమా...?
- IMD Weather Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తరాదిన కుండపోత వానలు
- LPG Cylinders: వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు అధికారుల అత్యవసర హెచ్చరిక
- Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్
గతేదాది సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద కేంద్రాలపై ఖచ్చితమైన దాడులు జరిగాయి. అనేక ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయని ఆమె చెప్పారు. ఇది భారత రక్షణ రంగంలో పెరుగుతున్న ఆత్మనిర్భరతకు నిదర్శనమని ఆమె అన్నాను. భారత సైన్యంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. మహిళా శక్తి దేశ అభివృద్ధి ప్రయాణానికి కేంద్ర బిందువని రాష్ట్రపతి చెప్పారు. 10 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో పాల్గొంటున్నారని, పంచాయతీ రాజ్ వ్యవస్థల్లో మహిళల ప్రాతినిధ్యం దాదాపు 46 శాతం ఉందని, నారి శక్తి వందన్ అధినయం మహిళల రాజకీయ సాధికారతను పెంచుతుందని ఆమె చెప్పారు. క్రీడలు, అంతరిక్షం, రక్షణ, వ్యాపార రంగాల్లో భారత మహిళలు రాణిస్తున్నారని అననారు.
ఇటీవల సంవత్సరాల్లో లక్షలాది మంది పేదరికం నుంచి బయట పడ్డారని, వారు మళ్లీ పేదరికంలోకి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, 81 కోట్ల మందికి కేంద్రం సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుతున్నాయని అన్నారు. ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా ఇప్పుడు భారత్లోనే జరుగుతున్నాయని ఆమె తెలిపారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారే దిశగా దేశం ప్రయాణిస్తోందని అన్నారు. స్వాతంత్య్రం తర్వాత జీఎస్టీని అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా రాష్ట్రపతి అభివర్ణించారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. భారత స్వాతంత్య్ర పోరాటంలో దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన గీతమని కొనియాడారు.
తాజావార్తలు
-
Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
-
Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు…ఇంతటి విలయానికి అదే కారణమా…?
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
MOTOROLA Moto Book 60 Pro: మళ్లీరాని ఆఫర్.. మోటరోలా AI ల్యాప్టాప్.. సగం ధరకే.. OLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!