Droupadi Murmu: దేశభద్రతలో రాజీ లేదు, ఆపరేషన్ సిందూర్పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిపబ్లిక్ డే స్పీచ్..
- ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావన..
- భారత ఆర్థిక వ్యవస్థ, మహిళా సాధికారతపై వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Droupadi Murmu: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో కూడా భారత్ శాంతి సందేశాన్ని ప్రపంచానికి అందిస్తూనే ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మానవజాతి సురక్షితంగా ఉండాలంటే ప్రపంచమంతా శాంతి నెలకొనాలని, అదే భారత్ అనుసరిస్తున్న నాగరికతా విలువ అని ఆమె అన్నారు. దేశభద్రత విషయంలో భారత్ రాజీ పడేది లేదని ఆమె స్పష్టం చేశారు. గతేడాది, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాక్పై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు.
Read Also: Rare earth elements: భారత్కు భారీ జాక్పాట్.. ఏకంగా మిలియన్ టన్నుల “అరుదైన ఖనిజాలు”..
Also Read
- Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
- Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
గతేదాది సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద కేంద్రాలపై ఖచ్చితమైన దాడులు జరిగాయి. అనేక ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయని ఆమె చెప్పారు. ఇది భారత రక్షణ రంగంలో పెరుగుతున్న ఆత్మనిర్భరతకు నిదర్శనమని ఆమె అన్నాను. భారత సైన్యంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. మహిళా శక్తి దేశ అభివృద్ధి ప్రయాణానికి కేంద్ర బిందువని రాష్ట్రపతి చెప్పారు. 10 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో పాల్గొంటున్నారని, పంచాయతీ రాజ్ వ్యవస్థల్లో మహిళల ప్రాతినిధ్యం దాదాపు 46 శాతం ఉందని, నారి శక్తి వందన్ అధినయం మహిళల రాజకీయ సాధికారతను పెంచుతుందని ఆమె చెప్పారు. క్రీడలు, అంతరిక్షం, రక్షణ, వ్యాపార రంగాల్లో భారత మహిళలు రాణిస్తున్నారని అననారు.
ఇటీవల సంవత్సరాల్లో లక్షలాది మంది పేదరికం నుంచి బయట పడ్డారని, వారు మళ్లీ పేదరికంలోకి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, 81 కోట్ల మందికి కేంద్రం సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుతున్నాయని అన్నారు. ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా ఇప్పుడు భారత్లోనే జరుగుతున్నాయని ఆమె తెలిపారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారే దిశగా దేశం ప్రయాణిస్తోందని అన్నారు. స్వాతంత్య్రం తర్వాత జీఎస్టీని అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా రాష్ట్రపతి అభివర్ణించారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. భారత స్వాతంత్య్ర పోరాటంలో దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన గీతమని కొనియాడారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
-
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!