Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News India Finds 6 35 Million Ton Rare Earth Deposit In Karnataka Reducing Reliance On China

Rare earth elements: భారత్‌కు భారీ జాక్‌పాట్.. ఏకంగా మిలియన్ టన్నుల “అరుదైన ఖనిజాలు”..

Published Date :January 25, 2026 , 9:20 pm
By Venu Goapl Reddy
  • భారత్‌కు భారీ జాక్‌పాట్..
  • కర్ణాటకలో మిలియన్ టన్నుల ‘‘రేర్ ఎర్త్ ఖనిజాలు’’..
  • చైనాపై ఆధారపడటం తగ్గే అవకాశం..
Rare earth elements:  భారత్‌కు భారీ జాక్‌పాట్.. ఏకంగా మిలియన్ టన్నుల “అరుదైన ఖనిజాలు”..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Rare earth elements: ప్రస్తుతం, ప్రపంచ జియోపాలిటిక్స్ ‘‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’’ చుట్టూ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ అరుదైన భూ ఖనిజాల వెలికితీత, వీటి ద్వారా రేర్ ఎర్త్ అయస్కాంతాల తయారీలో చైనా గుత్తాధిపత్యం ఉంది. అయితే, ఇప్పుడు అమెరికా కూడా రేర్ ఎర్త్స్ కోసం అన్వేషిస్తోంది. ఉక్రెయిన్‌తో డీల్ అయినా, పాకిస్తాన్‌తో స్నేహమైన ఈ ఖనిజాల కోసమే. ఎలక్ట్రిక్ వాహన ఇండస్ట్రీ నుంచి క్షిపణులు, శాటిలైట్ల తయారీలో ఇవి కీలకంగా మారడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాల కోసం పోటీ నెలకొంది. ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు భారత్ కూడా వడివడిగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఖనిజాల కోసం అన్వేషణ సాగిస్తోంది.

Read Also: Ind vs NZ 3rd T20I: భారత్ బౌలర్ల ధాటికి కివీస్ విలవిలా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

Also Read

  • Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి 'ది ఎండ్'?
  • Punjab Blasts: పంజాబ్‌లో హైటెన్షన్.. గంటల వ్యవధిలో రెండు చోట్ల పేలుళ్లు.. ఇది ఖలిస్తానీ గ్రూపు పనే!
  • Tamil Nadu Politics: నిమిషానికో మలుపు.. విజయ్ మాస్టార్ ప్లాన్.. ఏఐఏడీఎంకేతో చర్చలు!
  • TVK Vijay: విజయ్ తన భవిష్యత్తును ముందే ఊహించారా?.. GOATలో విజయ్ నంబర్ ప్లేట్ వైరల్
Add as a preferred
source on google

ఇదిలా ఉంటే, ఇప్పుడు భారత్ భారీ జాక్‌పాట్ కొట్టింది. కర్ణాటకలో చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేటలో భారీగా ‘‘రేర్ ఎర్త్ ఖనిజాల’’ నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దేశ ఖనిజ సంపద, వ్యూహాత్మక స్వావలంబనకు ఇవి కీలకం కానున్నాయి. ప్రాంతంలో 63.5 లక్షల టన్నుల అరుదైన భూమి మూలకాలు, యట్రియం భారీ నిల్వలు గుర్తించబడ్డాయి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) భూగర్భ శాస్త్ర విభాగం శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాథమిక అంచనాలు కూడా వీటికి మద్దతు ఇస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ పరికరాలు, ఏరోస్పేస్, విండ్ టర్బైన్‌లు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ఆధునిక పరిశ్రమలలో రేర్ ఎర్త్ మూలకాలను ఉపయోగిస్తారు. ప్రస్తుతం, వీటి కోసం భారత్ చైనాపై ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో వీటిని గుర్తించడం భారత వ్యూహాత్మక, సాంకేతిక స్వావలంబనకు ఈ ఆవిష్కరణ దోహదపడనునంది.

గుండ్లుపేట ప్రాంతంలో అరుదైన కార్బోనటైట్ సైనైట్ సముదాయాన్ని గుర్తించారు. ఈ ప్రాంతంలోని ఈ రేర్ ఎర్త్ నిల్వలు 2.5 బిలియన్ ఏళ్ల సంవత్సరాల కన్నా పురాతనమైనవి. మొదటిదశలో గులాబీ రంగు సైనైట్ శిలలు ఏర్పడ్డాయని, దాదాపు 12 కోట్ల సంవత్సరాల తర్వాత, రెండో దశలో తెల్లని కార్బోనాటైట్ శిలలు అంతర్గతంగా ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ప్రాంతంలో సీరియం, లాంథనం, నయోబియం, ఫాస్పరస్ వంటి విలువైన రేర్ ఎర్త్ మూలకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతదేశంలో ఇప్పటికే గుజరాత్ (అంబా డోంగర్), రాజస్థాన్ (న్యువానియా), తమిళనాడు (హోగెనక్కల్, సేవత్తూర్), మేఘాలయ (సంగ్ వ్యాలీ) వంటి ప్రాంతాల్లో కూడా కార్బోనాటైట్ సముదాయాలు ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BHU Geology Research
  • china
  • ev industry
  • green energy
  • India Mining News

తాజావార్తలు

  • Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?

  • Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..

  • Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు? 

  • Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్‌ప్లే, GPS ఫీచర్లతో అదిరింది

  • IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌ షెడ్యూల్ విడుదల.. ఫైనల్‌ మ్యాచ్ ఎక్కడో తెలుసా?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions