Rare earth elements: భారత్కు భారీ జాక్పాట్.. ఏకంగా మిలియన్ టన్నుల “అరుదైన ఖనిజాలు”..
- భారత్కు భారీ జాక్పాట్..
- కర్ణాటకలో మిలియన్ టన్నుల ‘‘రేర్ ఎర్త్ ఖనిజాలు’’..
- చైనాపై ఆధారపడటం తగ్గే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rare earth elements: ప్రస్తుతం, ప్రపంచ జియోపాలిటిక్స్ ‘‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’’ చుట్టూ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ అరుదైన భూ ఖనిజాల వెలికితీత, వీటి ద్వారా రేర్ ఎర్త్ అయస్కాంతాల తయారీలో చైనా గుత్తాధిపత్యం ఉంది. అయితే, ఇప్పుడు అమెరికా కూడా రేర్ ఎర్త్స్ కోసం అన్వేషిస్తోంది. ఉక్రెయిన్తో డీల్ అయినా, పాకిస్తాన్తో స్నేహమైన ఈ ఖనిజాల కోసమే. ఎలక్ట్రిక్ వాహన ఇండస్ట్రీ నుంచి క్షిపణులు, శాటిలైట్ల తయారీలో ఇవి కీలకంగా మారడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాల కోసం పోటీ నెలకొంది. ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు భారత్ కూడా వడివడిగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఖనిజాల కోసం అన్వేషణ సాగిస్తోంది.
Read Also: Ind vs NZ 3rd T20I: భారత్ బౌలర్ల ధాటికి కివీస్ విలవిలా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
Also Read
ఇదిలా ఉంటే, ఇప్పుడు భారత్ భారీ జాక్పాట్ కొట్టింది. కర్ణాటకలో చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేటలో భారీగా ‘‘రేర్ ఎర్త్ ఖనిజాల’’ నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దేశ ఖనిజ సంపద, వ్యూహాత్మక స్వావలంబనకు ఇవి కీలకం కానున్నాయి. ప్రాంతంలో 63.5 లక్షల టన్నుల అరుదైన భూమి మూలకాలు, యట్రియం భారీ నిల్వలు గుర్తించబడ్డాయి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) భూగర్భ శాస్త్ర విభాగం శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాథమిక అంచనాలు కూడా వీటికి మద్దతు ఇస్తున్నాయి. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ పరికరాలు, ఏరోస్పేస్, విండ్ టర్బైన్లు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ఆధునిక పరిశ్రమలలో రేర్ ఎర్త్ మూలకాలను ఉపయోగిస్తారు. ప్రస్తుతం, వీటి కోసం భారత్ చైనాపై ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో వీటిని గుర్తించడం భారత వ్యూహాత్మక, సాంకేతిక స్వావలంబనకు ఈ ఆవిష్కరణ దోహదపడనునంది.
గుండ్లుపేట ప్రాంతంలో అరుదైన కార్బోనటైట్ సైనైట్ సముదాయాన్ని గుర్తించారు. ఈ ప్రాంతంలోని ఈ రేర్ ఎర్త్ నిల్వలు 2.5 బిలియన్ ఏళ్ల సంవత్సరాల కన్నా పురాతనమైనవి. మొదటిదశలో గులాబీ రంగు సైనైట్ శిలలు ఏర్పడ్డాయని, దాదాపు 12 కోట్ల సంవత్సరాల తర్వాత, రెండో దశలో తెల్లని కార్బోనాటైట్ శిలలు అంతర్గతంగా ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ప్రాంతంలో సీరియం, లాంథనం, నయోబియం, ఫాస్పరస్ వంటి విలువైన రేర్ ఎర్త్ మూలకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతదేశంలో ఇప్పటికే గుజరాత్ (అంబా డోంగర్), రాజస్థాన్ (న్యువానియా), తమిళనాడు (హోగెనక్కల్, సేవత్తూర్), మేఘాలయ (సంగ్ వ్యాలీ) వంటి ప్రాంతాల్లో కూడా కార్బోనాటైట్ సముదాయాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!