కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉన్నారు. ఏడుగురు అరెస్ట్ ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు సీపి సుధీర్ బాబు తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. "అరెస్ట్ అయినవారిలో జనరల్ సర్జన్ డాక్టర్ సిద్ధంశెట్టి అవినాష్, అలకనంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి సుమంత్ కర్ణాటకకు చెందిన మధ్యవర్తి ప్రదీప్లతో పాటు ఆస్పత్రి సిబ్బంది గోపి, రవి, రవీందర్, హరీష్, సాయిలును అరెస్ట్ చేశాం.
మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలను తీసుకొస్తుంది. ఉపాధి కల్పించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ కుట్టుమిషన్లు అన్ని వర్గాల మహిళలకు కాదండోయ్. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా మైనారిటీ వర్గాలకు చెందిన, అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను ప్రభుత్వం అందించనున్నది. అర్హులైన వారు ఆన్ లైన్ లో…
Grama Sabha: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాల్గవరోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ఇప్ప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,861 గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది మొత్తం లక్ష్యంలోని 85.96 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఒక్క రోజే రాష్ట్రంలో 3,130 గ్రామ సభలు, 856 వార్డు సభలు నిర్వహించినట్లు తెలిపారు సంబంధిత అధికారులు. ఈ కార్యక్రమాలు గ్రామస్థుల సమస్యలపై చర్చించేందుకు, స్థానిక అవసరాలు గుర్తించేందుకు దోహదపడనున్నాయి. Also Read: Fire Accident:…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలో వీఎం బంజర్ లో గ్రామసభ జరుగుతుండగా కాంగ్రెస్- బీఆర్ఎస్ నాయకుల మద్య వాగ్వావాదం చోటు చేసుకుంది. అర్హల జాబితాపై తీవ్ర వాగ్వాదం జరిగింది. గత పదిహేను రోజుల క్రితం బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లో చేరిన నాయకుడికి కారు పార్టీ నేతకు మధ్య వివాదం చెలరేగింది. ఇద్దరు ఒక్కరిపై ఒక్కరు దాడి చేసుకున్నారు.
Harish Rao: మంచిర్యాల జిల్లాలో వృద్ధాప్య పెన్షన్ డబ్బులను ఇంటి పన్నులో జమ చేశారు అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే, తల్లికి వచ్చే వృద్దాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషం అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని చెప్పారు.
Afzalgunj firing: హైదరాబాద్ లోని అఫ్జల్గంజ్లో కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దుండగులు వాడిన టూ వీలర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. మహాత్మా గాంధీ బస్టాండ్ పార్కింగ్ ఏరియాలో వాహనాన్ని హస్తగతం చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లలో టూ వీలర్ చోరీ చేసిన దుండగులు.. ఆ వాహనంలోనే బీదర్ వరకు వెళ్లి దోపిడి చేసినట్లు గుర్తించారు.
Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 15వ వార్డులో ప్రజా పాలన వార్డు సభను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మంత్రిగా తమ జోక్యం ఉండదు..