Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cp Sudheer Babu Said That There Are A Total Of 15 Accused In The Kidney Racket Case

kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం 15 మంది నిందితులు వీరే..

NTV Telugu Twitter
Published Date :January 25, 2025 , 12:50 pm
By RAMAKRISHNA KENCHE
  • ఏడుగురు అరెస్ట్
  • పరారీలో ఎనిమిది మంది
  • కీలక విషయాలు వెల్లడించిన సీపి
kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం 15 మంది నిందితులు వీరే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉన్నారు. ఏడుగురు అరెస్ట్ ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు సీపి సుధీర్ బాబు తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. “అరెస్ట్ అయినవారిలో జనరల్ సర్జన్ డాక్టర్ సిద్ధంశెట్టి అవినాష్, అలకనంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి సుమంత్ కర్ణాటకకు చెందిన మధ్యవర్తి ప్రదీప్‌లతో పాటు ఆస్పత్రి సిబ్బంది గోపి, రవి, రవీందర్, హరీష్, సాయిలును అరెస్ట్ చేశాం. కిడ్నీ మార్పిడి చేసే ప్రధాన సర్జన్ తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పరారీలో ఉన్నాడు. జమ్మూకాశ్మీర్‌కు చెందిన మరో సర్జన్ డాక్టర్ సోహెబ్ కూడా పరారీలో ఉన్నాడు. ఆర్గనైజర్లు పవన్, పూర్ణ, లక్ష్మణ్‌ల జాడ కోసం వెతుకుతున్నాం. మీడి యేటర్లు సూరజ్ మిశ్రా, శంకర్లు కూడా తప్పించుకు తిరుగుతున్నారు.” అని సుధీర్ బాబు పేర్కొన్నారు.

READ MORE: Saif Ali Khan: సైఫ్ కేసులో కొత్త ట్విస్టు.. భార్యాభర్తల మాటల్లో తేడా!

“చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అవినాష్.. ఇండియాకి తిరిగి వచ్చి పూణేలో డిప్లమా ఇన్ సర్జరీ పూర్తి చేశాడు. 2022లో హైదరాబాదులోని మాదన్నపేట లో ఉన్న జనని హాస్పిటల్ ను డాక్టర్ అవినాష్ అతని స్నేహితులు లీజుకు తీసుకున్నారు. అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు అవినాష్. ఈ క్రమంలో అతనికి వైజాగ్ కు చెందిన లక్ష్మణ్ పరిచయమయ్యాడు. ఇల్లీగల్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌లు చేయాలంటూ లక్ష్మణ్, డాక్టర్ అవినాష్‌కు సూచించాడు. ప్రతి కిడ్నీ మార్పిడి సర్జరీకి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకున్నారు. డోనర్లు, మెడికల్ అసిస్టెంట్లు, రిసెప్షనిస్టులను మొత్తం కూడా తానే చూసుకుంటానని అవినాష్ కు లక్ష్మణ్‌ చెప్పాడు. డాక్టర్ అవినాష్ ఆపరేషన్ థియేటర్ ఇవ్వడంతో పాటు ఆపరేషన్ తర్వాత పేషెంట్లను చూసుకోవాల్సి ఉంటుంది అని ఒప్పందం కుదిరింది. అలా ఏప్రిల్ 2023 నుంచి 2024 జూన్ వరకు అక్రమ కిడ్నీ మార్పిడి చేస్తూ వచ్చారు. ఈ ఆపరేషన్ అన్నిటిని కూడా వైజాగ్ కి చెందిన పవన్, పూర్ణ, అభిషేకాలు చూసుకునేవారు.” అని సీపి సుధీర్ బాబు వెల్లడించారు.

READ MORE: Terrorist Attack: ఆర్మీ క్యాంపును లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు

“కిడ్నీ మార్పిడిలు చేయడానికి తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పెరుమాల్, జమ్ముకాశ్మీర్ కి చెందిన డాక్టర్ సోహెబ్ తోపాటు తమిళనాడుకు చెందిన ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌లు శంకర్, ప్రదీప్, కర్ణాటక చెందిన సూరజ్‌లను తీసుకొచ్చేవారు. కిడ్నీ మార్పిడి సర్జరీ కావాలనుకునే వారి దగ్గర నుంచి 55 నుండి 60 లక్షల రూపాయల వరకు వసూలు చేసేవారు. అందులో ఐదు లక్షలు కిడ్నీ డోనర్‌కు, రెండున్నర లక్షలు డాక్టర్ అవినాష్‌కు, పది లక్షల రూపాయలు కిడ్నీ మెయిన్ సర్జరీ చేసిన డాక్టర్లకి, ఆపరేటింగ్ థియేటర్ అసిస్టెంట్లకు 30,000 ఇచ్చేవారు. కానీ 2024లో జనని హాస్పిటల్‌ను డాక్టర్ అవినాష్ మూసివేశాడు. ఇదే సమయంలో అలకానంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుమంత్‌ను డాక్టర్ అవినాష్ కలిశాడు. డాక్టర్ సుమంత్ కిర్జిస్థాన్‌లో మెడికల్ స్టడీస్ పూర్తి చేశాడు. ఇల్లీగల్ కిడ్నీ మార్పిడి చేయడానికి ఇద్దరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటివరకు అలకనంద ఆస్పత్రిలో ఒక్క డిసెంబర్ నెలలోనే సుమారు 20 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేశారు.” అని సీపి సంచలన విషయాలు వెల్లడించారు. కిడ్నీ రాకెట్ కేసును ఇప్పటి వరకు తామే చూశామని.. ఇంకా సీఐడీకి బదిలీ చేయలేదని సీపి సుధీర్ బాబు స్పష్టం చేశారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 15 accused in the kidney racket case
  • CP Sudheer babu
  • hyderabad
  • karnataka
  • kidney racket case

తాజావార్తలు

  • Naga Bandham: 10 నిమిషాలకు 10 కోట్లు.. అబ్బుర పరిచేలా నాగబంధం సెట్..!

  • Best Time for S*x: శృంగార చేయడానికి అనుకూలమైన సమయం ఏంటి..? ఎందుకు..?

  • CM Chandrababu: మామిడికి అదనపు మద్దతు ధర.. సీఎం ఆదేశాలు

  • YS Jagan Palnadu Tour: ఆంక్షలు, ఉద్రిక్తతల మధ్య సాగిన వైఎస్‌ జగన్‌ పల్నాడు పర్యటన..

  • Donald Trump: ‘‘నేను ఏం చేస్తానో ఎవరికీ తెలియదు’’.. ఇరాన్‌పై దాడి గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Wicket Keeper Catch: నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..

  • iQOO Z10 Lite: ఇదెక్కడి మాస్ రా బాబు.. కేవలం రూ. 9999కే అన్ని ప్రత్యేకతలున్న ఫోన్..!

  • Viral Video: ఇది కదయ్యా దాంపత్య జీవితం అంటే.. 90 ఏళ్ల వయసులో కూడా భార్య కోసం ఆ భర్త ఏం చేసాడంటే..?

  • Nothing Phone 3: జూలై 1న లాంచ్ కాబోతున్న నథింగ్ ఫోన్ 3.. స్పెసిఫికేషన్స్ ఇవే..!

  • OnePlus Nord: మొబైల్ లవర్స్ రెడీగా ఉండండి.. దమ్మున్న ఫీచర్ల మొబైల్స్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన వన్‌ప్లస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions