వ్యాక్సిన్ల కోసం స్థానిక నేతలు దౌర్జన్యానికి దిగడం చర్చగా మారింది.. అసలే వ్యాక్సిన్ల కొరత ఉండడంతో.. ఓ క్రమ పద్దతి ప్రకారం వ్యాక్సిన్లు పంపిణీ చేస్తోంది సర్కార్.. అయితే, ఇవాళ హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ఓ పార్టీకి చెందిన స్థానిక నేతలు దౌర్జన్యానికి దిగారు.. సూపర్ స్పైడర్స్ కు ఇవ్వాల్సిన టోకెన్లు తమ అనుచరుల కుటుంబసభ్యులకు ఇవ్వాలని వీరంగం సృష్టించారు.. దీంతో.. నిజమైన సూపర్ స్పైడర్స్ కు అన్యాయం జరుగుతుందంటూ వాక్సిన్ వేసేందుకు నిరాకరించారు వైద్యులు..…
మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ తర్జన భర్జన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల.. వచ్చేవారం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఇదే ఊపులో మరిన్ని చేరికలు బీజేపీ తెరలేపుతోంది.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి.. ఏ పార్టీలో చేరలేదు.. ఏ పార్టీలో చేరాలన్నదానిపై కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానని తన రాజీనామా సందర్భంగా వెల్లడించారు.…
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి కూతరు వైఎస్ షర్మిల… మరోవైపు.. వివిధ జిల్లాల అనుచరులు, వైఎస్ అభిమానులతో సమావేశాలు కూడా నిర్వహించారు.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీక్షలు కూడా చేశారు. త్వరలోనే పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు.. అయితే, వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పేరుపై ఓవైపు ప్రచారం జరుగుతున్నా.. సోషల్ మీడియాలో ఖాతాలో అదేపేరుతో దర్శనమిస్తున్నా.. పార్టీ పేరు ప్రకటించే…
తెలంగాణలో కోవిడ్ రోజువారి పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 2,261 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 18 మంది కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో.. 3,043 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు వెల్లడించారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు.. తాజా లెక్కలతో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిపోయిందని.. రికవరీ రేటు…
తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో సైతం కరోనా రోగులకు సేవలు అందించడానికి ప్రత్యేక మొబైల్ యూనిట్లను సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. మొదటి విడతలో 30 మొబైల్ ఐసీయూ బస్సులను హైదరాబాద్లో ప్రారంభించారు మంత్రి కేటీఆర్.. మొదటి దశలో జిల్లాకు ఒకబస్సును కేటాయిస్తున్నామన్న మంత్రి.. త్వరలో జిల్లాకు రెండు బస్సుల చొప్పున పంపిస్తామన్నారు. ఇది వినూత్న ఆలోచన.. దేశంలోనే ఇలాంటి సేవలు అందించడం మొదటిసారి అని వెల్లడించారు. ఇక, వైద్యులను దేవుడితో సమానంగా చూస్తున్నారు.. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి..…
కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. ఇప్పుడు సమావేశాలు అన్నీ జూమ్కు పరిమితం అయ్యాయి.. ఇక, ఇవాళ డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో జూమ్ లో సమావేశం నిర్వహించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్.. దీనిపై రేపు గవర్నర్ తమిళిసై ను కలిసి.. వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు.. జిల్లా కేంద్రాలలో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలెక్టర్లను కలిసి వినతిపత్రం…
తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు రావడంతో భారీ వర్షం కురుస్తుంది. యాదగిరిగుట్టలో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలోకి వర్షపు నీరు చేరింది. వాన నీటితో యాదాద్రి బాలాలయం చెరువును తలపిస్తోంది. అర్చకులు వర్షపు నీటిలో కూర్చుని పూజలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షం పడటంతో బాలాలయం మునిగిపోయింది. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తుండటంతో తాత్కాలికంగా బాలాలయంలోనే నిత్య పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డిపై మరోసారి విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపిని నాశనం చేసి.. కాంగ్రెస్ లోకి వచ్చాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఇతర పార్టీ ల నుండి వచ్చిన వాళ్లకు పిసిసి ఇస్తా అంటే ఎలా.. పిసిసి అయ్యాక రేవంత్ జైల్ కి పోతే..పార్టీ జైలు చుట్టూ తిరగాలా? అని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు తనను తిట్టిన వాళ్ళు లేరు..మూడు,నాలుగు పార్టీలు మారిన వాళ్ళు తిడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మీద…
బిజేపిలోకి ఈటల వస్తున్నాడన్న వార్తతో పార్టీలో నూతన ఉత్సాహం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈటల చేరికపై ఫుల్ బిజీగా ఉన్న తెలంగాణ బిజేపికి షాక్ తగిలింది. పెద్దపల్లి బిజేపిలో ముసలం నెలకొంది. మాజీ ఎంపీ వివేక్ పై అసంతృప్తి నేతలు తిరుగుబాటుకు దిగారు. ఈ రోజు మంచిర్యాలలో అసమ్మతి నేతలు సమావేశం కానున్నారు. వివేక్ తీరుపై మాజీ మంత్రి బోడ జనార్ధన్, మాజీ ఎమ్యెల్యేలు గుజ్జుల రామకృష్ణ రెడ్డి, సోమారపు సత్యనారాయణ తదితర నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు…
ఈ మధ్య కాలంలో మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ లతో ఫోన్లు చేసి మరీ.. డబ్బులు వసూలు చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ కేటుగాళ్లు మామూలు ప్రజలనే కాదు.. రాజకీయ నాయకులను వదలడం లేదు. తాజాగా తెలంగాణలో పొలిటికల్ లీడర్లకు, పోలీసులకు నాగాపూర్ కు చెందిన ఫారీ కాద్రీ అనే వ్యక్తి చుక్కలు చూపెడుతున్నాడు. నేతల ఫోన్ రికార్డింగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతూ.. వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఫారీ కాద్రీ. ఇందులో…