హీరోయిజం, రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలొద్దు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యవహారం ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.. తాజాగా, ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు… తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న భాష సంస్కారానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించిన ఆయన… రాయలసీమ జిల్లాలు తాగు నీటి, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్న ప్రాంతమని… కానీ, హీరోయిజం కోసం, రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు.. మరోవైపు.. వ్యవసాయ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నామని.. చంద్రబాబు, లోకేష్ జూమ్ ను నమ్ముకొని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు మంత్రి కన్నబాబు.. సీజన్ ముగిశాక చంద్రబాబుకు మామిడి రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేసిన ఆయన.. మూడు నెలలుగా మామిడి ఉత్పత్తుల మార్కెటింగ్ పై సమీక్ష చేస్తున్నామని.. ఎమ్మార్వో స్థాయి అధికారులకు మామిడి ఎగుమతులు, దిగుమతులపై పర్యవేక్షణ ఉండాలని ఆదేశించామని తెలిపారు.
also read కేసీఆర్ మొదట్లో ఫ్రెండ్లీగా ఉన్నారు.. ఇప్పటి వ్యవహారం నాకు నచ్చలేదు..!
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
రైతులకు నష్టం వాటిల్లకుండా మార్కెటింగ్ శాఖ దృష్టి సారించిందని తెలిపారు మంత్రి కన్నబాబు.. కరోనా కష్టకాలంలోనూ రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్న ఆయన.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత జిల్లాలో మామిడి బోర్డును ఎందుకు పెట్టలేదు..? అని ప్రశ్నించారు.. మార్క్ ఫెడ్ ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేశాం.. రైతులు నష్టపోతున్నారని తెలిసి ప్రభుత్వమే ఉత్పత్తులను కొనుగోళ్లు చేస్తోందని.. చిత్తూరు జిల్లాలో గిట్టుబాటు ధర ఇవ్వడానికి మేం చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.. ప్రాసెసింగ్ యూనిట్లను ఎప్పటికప్పుడు అగ్రికల్చర్, హార్టీ కల్చర్ అధికారులు విజిట్ చేస్తున్నారన్న ఆయన.. రైతులను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పడం అవాస్తవమని కొట్టిపారేశారు. ఏపీ రైతులు దగ్గర ఉత్పత్తులు బాగున్నాయని కర్నాటక, తమిళనాడు నుంచి వచ్చి కొనుగోలు చేశారని తెలిపారు మంత్రి కన్నబాబు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!