హీరోయిజం, రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలొద్దు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యవహారం ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.. తాజాగా, ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు… తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న భాష సంస్కారానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించిన ఆయన… రాయలసీమ జిల్లాలు తాగు నీటి, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్న ప్రాంతమని… కానీ, హీరోయిజం కోసం, రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు.. మరోవైపు.. వ్యవసాయ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నామని.. చంద్రబాబు, లోకేష్ జూమ్ ను నమ్ముకొని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు మంత్రి కన్నబాబు.. సీజన్ ముగిశాక చంద్రబాబుకు మామిడి రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేసిన ఆయన.. మూడు నెలలుగా మామిడి ఉత్పత్తుల మార్కెటింగ్ పై సమీక్ష చేస్తున్నామని.. ఎమ్మార్వో స్థాయి అధికారులకు మామిడి ఎగుమతులు, దిగుమతులపై పర్యవేక్షణ ఉండాలని ఆదేశించామని తెలిపారు.
also read కేసీఆర్ మొదట్లో ఫ్రెండ్లీగా ఉన్నారు.. ఇప్పటి వ్యవహారం నాకు నచ్చలేదు..!
Also Read
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
రైతులకు నష్టం వాటిల్లకుండా మార్కెటింగ్ శాఖ దృష్టి సారించిందని తెలిపారు మంత్రి కన్నబాబు.. కరోనా కష్టకాలంలోనూ రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్న ఆయన.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత జిల్లాలో మామిడి బోర్డును ఎందుకు పెట్టలేదు..? అని ప్రశ్నించారు.. మార్క్ ఫెడ్ ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేశాం.. రైతులు నష్టపోతున్నారని తెలిసి ప్రభుత్వమే ఉత్పత్తులను కొనుగోళ్లు చేస్తోందని.. చిత్తూరు జిల్లాలో గిట్టుబాటు ధర ఇవ్వడానికి మేం చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.. ప్రాసెసింగ్ యూనిట్లను ఎప్పటికప్పుడు అగ్రికల్చర్, హార్టీ కల్చర్ అధికారులు విజిట్ చేస్తున్నారన్న ఆయన.. రైతులను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పడం అవాస్తవమని కొట్టిపారేశారు. ఏపీ రైతులు దగ్గర ఉత్పత్తులు బాగున్నాయని కర్నాటక, తమిళనాడు నుంచి వచ్చి కొనుగోలు చేశారని తెలిపారు మంత్రి కన్నబాబు.
తాజావార్తలు
-
Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
-
Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
-
Peddi : ‘పెద్ది’ బాలీవుడ్ పరిస్థితి ఏంటి.. ఓపెనింగ్ లేకుంటే చరణ్ పాన్ ఇండియా కెరీర్ కష్టమే?
-
BCCI Meeting: సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం?.. బీసీసీఐ సమావేశంలో హాట్ టాపిక్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..