హీరోయిజం, రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలొద్దు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యవహారం ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.. తాజాగా, ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు… తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న భాష సంస్కారానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించిన ఆయన… రాయలసీమ జిల్లాలు తాగు నీటి, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్న ప్రాంతమని… కానీ, హీరోయిజం కోసం, రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు.. మరోవైపు.. వ్యవసాయ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నామని.. చంద్రబాబు, లోకేష్ జూమ్ ను నమ్ముకొని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు మంత్రి కన్నబాబు.. సీజన్ ముగిశాక చంద్రబాబుకు మామిడి రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేసిన ఆయన.. మూడు నెలలుగా మామిడి ఉత్పత్తుల మార్కెటింగ్ పై సమీక్ష చేస్తున్నామని.. ఎమ్మార్వో స్థాయి అధికారులకు మామిడి ఎగుమతులు, దిగుమతులపై పర్యవేక్షణ ఉండాలని ఆదేశించామని తెలిపారు.
also read కేసీఆర్ మొదట్లో ఫ్రెండ్లీగా ఉన్నారు.. ఇప్పటి వ్యవహారం నాకు నచ్చలేదు..!
Also Read
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
- Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
రైతులకు నష్టం వాటిల్లకుండా మార్కెటింగ్ శాఖ దృష్టి సారించిందని తెలిపారు మంత్రి కన్నబాబు.. కరోనా కష్టకాలంలోనూ రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్న ఆయన.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత జిల్లాలో మామిడి బోర్డును ఎందుకు పెట్టలేదు..? అని ప్రశ్నించారు.. మార్క్ ఫెడ్ ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేశాం.. రైతులు నష్టపోతున్నారని తెలిసి ప్రభుత్వమే ఉత్పత్తులను కొనుగోళ్లు చేస్తోందని.. చిత్తూరు జిల్లాలో గిట్టుబాటు ధర ఇవ్వడానికి మేం చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.. ప్రాసెసింగ్ యూనిట్లను ఎప్పటికప్పుడు అగ్రికల్చర్, హార్టీ కల్చర్ అధికారులు విజిట్ చేస్తున్నారన్న ఆయన.. రైతులను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పడం అవాస్తవమని కొట్టిపారేశారు. ఏపీ రైతులు దగ్గర ఉత్పత్తులు బాగున్నాయని కర్నాటక, తమిళనాడు నుంచి వచ్చి కొనుగోలు చేశారని తెలిపారు మంత్రి కన్నబాబు.
తాజావార్తలు
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
-
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్లో ఏముంది?
-
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!