Home
Telangana
Telangana News
-
ఇవాళ బీఎస్పీలో చేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రాజ్యాధికారం కోసం బహుజనులంతా ఏకం కావాలన్నారు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్. బహుజనులంతా తన వెంట ఉంటే పేదల హక్కుల కోసం ఎంతటి పోరాటానికైన సిద్ధమని స్పష్టంచేశారు. ఈ రోజు నల్గొండలో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టనున్నారు. రాజ్యాధికార సంకల్ప సభ పేరిట బహుజన సమాజ్ పార్టీ నల్లగొండలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఎస్పీ కండువా కప్పుకోనున్నారు. బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్, రాజ్యసభ ఎంపీ రాంజీ… -
సచివాలయ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
సచివాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఏజెన్సీ ప్రతినిధులను, అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. శనివారం సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని సిఎం కేసీఆర్ పరిశీలించారు. నలుమూలలా కలియతిరిగి పరిశీలించారు. పరిపాలనకు కేంద్ర బిందువు గా వుండే సెక్రటేరియట్ నిర్మాణ కౌశలం మన పాలనారీతులకు అద్దం పట్టేవిధంగా ఉండాలని సిఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతర పరిస్థితుల్లో,సిబ్బంది మరింత ప్రశాంతంగా తమ విధులను నిర్వహించుకునే విధంగా సచివాలయ నిర్మాణం వుండబోతోందని తెలిపారు. గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు… -
అడ్వకేట్ పై మంత్రి గంగుల కమలాకర్ ఫిర్యాదు
కరీంనగర్ కి చెందిన బీజేపీ నాయకుడు, న్యాయవాది భేతి మహేందర్ రెడ్డిపై మంత్రి గంగుల కమలాకర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనకు గ్రానైట్ సంస్థల్లో ఎలాంటి భాగస్వామ్యం లేకున్నా అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత రాజకీయ పరువుకు నష్టం కలిగించేలా మహేందర్రెడ్డి వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 152 ఏ, 505 (ii) నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని… -
తెలంగాణ కరోనా అప్డేట్..
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు కాస్త పెరిగాయి.. 1,05,201 శాంపిల్స్ పరీక్షించగా… 569 మందికి పాజిటివ్గా తేలింది… మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 657 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,957 కు చేరగా… కోలుకున్నవారి సంఖ్య 6,36,552 కి పెరిగింది.. ఇక,… -
అనేక ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఒక్క ఓటమితో కుదేలు!
అనేక ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఒక్క ఓటమితో సోదిలో లేకుండా పోయారు. అన్నీ వరస ఎదురుదెబ్బలే. పార్టీని కాదని వేస్తున్న పొలిటికల్ స్టెప్పులు తడబడుతున్నాయి. ఇప్పుడు సీటుకే ఎసరొచ్చే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆ మాజీ మంత్రి దారెటు అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? ఐదుసార్లు గెలిచిన చోట సీటుకు ఎసరొచ్చిందా? జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్లో.. టీఆర్ఎస్లో ఓ వెలుగు వెలిగిన నాయకుడు.. ప్రస్తుతం చర్చల్లో కూడా లేరు. ఉమ్మడి మహబూబ్నగర్… -
హుజురాబాద్లో స్థానిక టీఆర్ఎస్ నేతల రహస్య భేటీ…?
ఉపఎన్నిక వేళ హుజురాబాద్లో అధికార పార్టీ నేతలు రహస్య భేటీ ఎందుకు పెట్టుకున్నారు? సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలేంటి? ఓ నేతకు ఇచ్చిన పదవే సీక్రెట్ మీటింగ్కు కారణమైందా? టీఆర్ఎస్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! హుజురాబాద్లో టీఆర్ఎస్ స్థానిక నేతల రహస్య భేటీ? హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో ఇంకా క్లారిటీ లేదు. అనేక వడపోతలు జరుగుతున్నాయి.. మరికొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆ మధ్య కాంగ్రెస్ను వీడీ టీఆర్ఎస్లో చేరిన పాడి… -
వందేండ్ల భారతీయుల కలను నీరజ్ చోప్రా నిజం చేశారు : సీఎం కేసీఆర్
టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో మొట్టమొదటి సారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలలను నీరజ్ చోప్రా నిజం చేశారని సీఎం కేసీఆర్ అభినందించారు. నీరజ్ చోప్రా విజయం భారతదేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరుస్తుండటం సంతోషకరమైన విషయమన్నారు.… -
తెలంగాణ నేతన్నలు భారతీయ సంస్కృతికి వైభవం తెచ్చారు…
భారత ప్రభుత్వం 2015 ఆగస్ట్ 7 నాడు జాతీయ చేనేత దినోత్సవంను ప్రకటించింది. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ జాతీయ చేనేత దినోత్సవం అని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో ప్రతి సంవత్సరం చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. తెలంగాణ నేతన్నల భారతీయ సంస్కృతి కి వైభవం ను తెచ్చారు. ఈరోజు నుండి ఒక్క వారం రోజుల పాటు జాతీయ స్థాయిలో ఇక్కడ ప్రదర్శన నిర్వహిస్తాం. నేతన్న లు నెచిన వస్త్రాలను ఇక్కడ ప్రదర్శించడం… -
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!
కరోనాతో గతేడాది ఇంటర్ పరీక్షలు జరగలేదు… మొదటి సంవత్సరంలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఫలితాలు ప్రకటించింది తెలంగాణ ఇంటర్ బోర్డు. మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మినిమం మార్క్స్ వేసి పాస్ చేశారు. విద్యార్థులను సెకండ్ ఇయర్కు ప్రమోట్ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షలు ఆఫ్ లైన్ మోడ్ లో జరుగుతున్నాయి. దీంతో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణ పై బోర్డ్ దృష్టి… -
పాదయాత్రపై బండి సంజయ్ కీలక ప్రకటన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర పై ఇవాళ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ నెల 24 నుండి పాదయాత్ర మొదలు పెడుతున్నానని… భాగ్యలక్ష్మి అమ్మ వారి దేవాలయం నుండి ప్రారంభం కానుందని ప్రకటించారు. పాదయాత్రను ప్రకటించిన వెంటనే మేమూ నడుస్తామంటూ స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు ముందుకు వస్తున్నారన్నారు. ఒక్కో జిల్లా నుండి 20 మంది మాత్రమే పాదయాత్రలో నడిచేందుకు అవకాశాన్ని కల్పించామని.. పూర్తి సమయం…
తాజావార్తలు
-
Amit Shah: బెంగాల్ సీఎం ఎంపిక బాధ్యతలు అమిత్ షాకు అప్పగింత.. రేసులో సువేందు!
-
Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
-
KL Rahul: ‘నన్ను టెస్ట్ ప్లేయర్ అన్నారు.. టీ20 ఆడటం రాదన్నారు’.. కేఎల్ రాహుల్ భావోద్వేగం..
-
Rajamouli: సబ్స్క్రిప్షన్ ట్రెండ్ నూ వదలని జక్కన్న.. ఇదెక్కడి మాస్ ప్లాన్ అయ్యా!
-
Spirit: ‘స్పిరిట్’ ఫాన్స్’కి బ్యాడ్ న్యూస్?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!