హుజురాబాద్ ఉపఎన్నిక నగారా మోగాక ఎమ్మెల్సీ ఆశావహుల్లో టెన్షన్ మొదలైందా? ఒకటి రెండు రోజుల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి షెడ్యూల్ వస్తుందా? గులాబీ నేతలు లాబీయింగ్ తీవ్రం చేశారా? పదవీకాలం ముగిసిన వాళ్లలో ఎవరికి ఛాన్స్? పెద్దల సభకు వెళ్లే కొత్తవారు ఎవరన్నదే ఇప్పుడు ఉత్కంఠ. ఆరు ఎమ్మెల్సీ పదవులు ఎవరికి ఇవ్వాలో సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చారా? తెలంగాణలో ఎమ్మెల్సీ ఖాళీలు ఆరు.. పోటీలో 60 మందికిపైగా ఉన్నారు. ఎవరిని పదవి వరిస్తుందోనన్న ఉత్కంఠ…
తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,828 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 162 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో వ్యక్తి కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. ఇదే సమయంలో.. 247 కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,66,546 కి చేరగా.. రికవరీ కేసులు…
ఈ రోజు బెంగాల్ ల్లో మమత గెలిచింది. రేపు మత తత్వ బీజేపీ కి హుజురాబాద్ లో స్థానం లేదని చెప్పాలి అని మంత్రి హరీష్ రావు అన్నారు. లెఫ్ట్ అన్న ఈటల రాజేందర్ రైటీస్ట్ గా ఎలా బీజేపీలో చేరారు… నల్లా చట్టాలు అని చెప్పిన ఈటల రాజేందర్ ఆ పార్టీలో ఎలా చేరారు అని ప్రశ్నించిన ఆయన స్వార్థం కోసం బీజేపీలో చేరారు ఈటల రాజేందర్ అని తెలిపారు. ఇక తెలంగాణ పట్ల బీజేపీ…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీకు అవకాశం ఇస్తా అని కాంగ్రెస్ నాయకులకు చెప్పిన ఆయన.. మీ శక్తిని సంపూర్ణంగా వినియోగిస్తామని మాట ఇస్తున్న. కుల వృత్తులు కేసీఆర్ పుట్టక ముందే ఉన్నాయి. రాజ్యంలో వాట అడుగుతున్నాం. మేము రాజులుగా ఉంటాం..మీరు బానిసలుగా ఉండండి అంటున్నారు కేసీఆర్. తెలంగాణ పెద్ద కొడుకు కేసీఆర్ కాదు అని మండిపడ్డారు. నీకు ఇచ్చే నౌకరీ…
తెలంగాణాలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ ఒకటి. ప్రతి ఏడాది దసరా సందర్భంగా జరుపుకునే ఈ పండగను తెలంగాణ ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పండుగకు ముందు ‘బతుకమ్మ’ స్పెషల్ సాంగ్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా మంది సంగీతకారులు విభిన్న పాటలతో యూట్యూబ్ లో బతుకమ్మను సెలబ్రేట్ చేస్తారు. అయితే మొదటిసారిగా బతుకమ్మ పాటకు సంగీతం అందించడానికి లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ముందుకు వచ్చారు.…
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీతో పాటుగా ఎమ్మెల్యేపదవికి కూడా రాజీనామా చేయడంతో హుజురాబాద్కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా బీజేపీ కూడా తమ అభ్యర్ధిని ప్రకటించింది. హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నట్టు బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించడంతో ఆ నియోజక వర్గంలో త్రిముఖపోటీ జరగనుంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ పోటీ…
హుజురాబాద్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక ఈనెల 30 వ తేదీన జరగబోతున్నది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించాయి. టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ బరిలో ఉంటే, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధిపై అనేక చర్చలు జరిగాయి. మొదట కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండ సురేఖను అనుకున్నా, ఆమె తిరస్కరించడంతో తెరపైకి అనేక పేర్లు వచ్చాయి.…
ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి, నిరుద్యోగ సైరన్కు పిలుపునిచ్చింది. దిల్షుఖ్ నగర్కు చేరుకొని అక్కడి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలి అన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అయితే, దిల్షుఖ్ నగర్- ఎల్బీనగర్ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. దీంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక పేదోళ్లు విద్యకు దూరం అయ్యారని, కులవృత్తులకు పరిమితం…