ఈ రోజు హుస్నాబాద్లో బీజేపీ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఎంపీ, తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. హుజురాబాద్లో కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతుందని, మద్యం ఏరులై పారుతోందని, ఇంత చేసినా తనను ఏమీ చేయలేకపోతున్నారని ఈటల పేర్కొన్నారు. అక్టోబర్ 30 న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలుస్తుందని, అన్ని జిల్లాల నుండి ఈటలను గెలిపించాలని…
తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండగ కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం అయినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. ఏలాంటి ఇబ్బందులు లేకుండా చీరల పంపీణీ కార్యక్రమం పూర్తి అయ్యేలా అన్నిచర్యలు తీసుకున్నామన్నారు మంత్రి. 18 సంవత్సరాలు నిండి, ఆహార భద్రత కార్డ్ కింద నమోదైన అర్హూలైన ప్రతి ఒక్క ఆడబిడ్డకు బతుకమ్మ చీర అందాలని సూచించారు. ప్రభుత్వ పథకంతో రాష్ట్రంలోని అడబిడ్డలకు అందమైన చీరతోపాటు, నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు మంత్రి. 2017 నుంచి గత…
హుజురాబాద్ ఉప ఎన్నికలు సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది… గతంలో హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీకి 60 వేల ఓట్లు వచ్చాయని.. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు ఒక్క ఓటు పెరిగినా.. నేను, నా భార్య మా పదవులకు రాజీనామా చేస్తామని.. దీనికి నువ్వు సిద్ధమా? అంటూ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. అయితే, గండ్ర వ్యాఖ్యలపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ…
సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగుచూశాయి.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన నిధులపై ఈ నెల 18న బ్యాంకు అధికారులతో భేటీ అయ్యారు ఏపీ అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి.. ఈ నెల 21 న కార్వాన్ యూబీఐ బ్యాంక్ నుండి రూ.24 కోట్లు విత్ డ్రా కు రఫిక్ అనే తెలుగు అకాడమీ ఉద్యోగిని పంపించారు.. అయితే, మస్తాన్వలి అనుచరుడిగా రఫీక్ తో పరిచయం…
సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారంలో నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు సీసీఎస్ పోలీసులు.. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ముగ్గురు కోసం వేట ప్రారంభించారు.. తెలుగు అకాడమీలో మొత్తం రూ.63.47 కోట్లను నగదు రూపంలో విత్ డ్రా చేశారు.. ఆ ముగ్గురు నిందితులు.. ఇన్నవో కారులో ఆంధ్రతో పాటు ఇతర ప్రాంతాలకు డబ్బులు తరలించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.. డబ్బులు కొల్లగొట్టడంలో ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్.. సహకరించినట్టు…
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత ఇవాళ్టితో ముగియనుంది.. ఈ సందర్భంగా హుస్నాబాద్ లో రోడ్ షో, ముగింపు సభ నిర్వహణకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.. ఇక, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రాబోతున్నారు.. మెత్తం 36 రోజుల పాటు 438 కిలో మీటర్లు మేర పాదయాత్ర చేశారు బండి సంజయ్.. ఎనిమిది జిల్లాల్లోని 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాలను…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో పోరుకు రెడీ అయింది. తెలంగాణలోని విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి నేడు శ్రీకారం చుట్టబోతుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని రాజీవ్ చౌరస్తా నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం 65 రోజుల పాటు సాగనుంది. విద్యార్థి- నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో డిసెంబర్ 9 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ, ఆదివాసీ విద్యార్థులందరికీ… కార్పొరేట్…
ఎట్టకేలకు హుజురాబాద్ ఉపఎన్నికల్లో తమ అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది కాంగ్రెస్. బలమూర్ వెంకట్ పేరును ఫైనల్ చేశారు. ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. గెల్లు శ్రీనివాస్ కు బలమైన పోటీ ఇవ్వడానికి బలమూర్ వెంకట్ ను రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం.ప్రస్తుతం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వెంకట్ కాంగ్రెస్ నుండి యూత్ లీడర్ గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు…బలమూర్ వెంకట్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాడు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్…
ప్రతీ ఏడాది తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం… ఇక, ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా ఇచ్చే చీరల పంపిణీ ఇవాళ ప్రారంభం కానుంది.. ఇప్పటికే జీహెచ్ఎంసీతో పాటు ఆయా జిల్లాల్లో చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. రాష్ట్రంలో అర్హులైన మహిళలకు చీరల పంపిణీ శనివారం నుంచి చేస్తామని టెస్కో ఎండి శైలజా రామయ్యర్ వెల్లడించారు.. ఆహారభద్రత కార్డు కింద పేర్లు నమోదైన 18 ఏళ్లు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయినప్పటి నుంచి.. ఎదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అయితే.. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనుల పై హైకోర్టులో పిల్ దాఖలైంది. సిద్ధిపేట జిల్లా తుక్కాపూర్ కు చెందిన శ్రీనివాస రెడ్డి పిల్ దాఖలు చేశారు. మూడో టీఎంసీకి అనుమతుల్లేకుండా పనులు చేపట్టారని పిల్ పేర్కొన్నాడు పిటిషనర్ శ్రీనివాస రెడ్డి. కేంద్రం, ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా…