తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. గత బులెటిన్తో పోలిస్తే.. తాజా బులెటిన్లో కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,392 శాంపిల్స్ పరీక్షించగా… 186 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.. మరో ఒక్కరు కరోనా కారణంగా ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 122 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. దీంతో… మొత్తం పాజిటివ్…
తెలంగాణ ప్రజలు మొత్తం హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.. ఇప్పటికే ప్రచార పర్వానికి తెరపడగా.. ప్రలోభాలకు తెరలేపారు.. వాస్తవానికి హుజురాబాద్లో గత రెండు మూడు రోజులుగా డబ్బుల పంపిణీ జరుగుతుందనే ప్రచారం సాగుతోంది. అయితే, ఇప్పుడు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్లు ఏకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగడం హాట్టాపిక్గా మారిపోయింది.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని రాంపూర్లో ఓ పార్టీకి చెందిన నేతలు.. కొంతమంది ఓటర్లకే డబ్బులు పంచారట.. మరికొంత మందికి మరిచారో…
హుజురాబాద్ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నిలవాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 70 శాతం తెలంగాణ ప్రజలు వ్యవసాయంపై బ్రతుకుతారు. అందులో ఎక్కువగా వరి సాగే వుంటది. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వరి సాగే అవుతుంది. సర్కార్ తుగ్లక్ పాలనలా.. నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం msp ప్రకటించింది.. దాని ప్రకారం కొనాల్సిందే. తెలంగాణను రైస్ బౌల్ చేస్తామన్నారు.. కేసీఆర్. ఇప్పుడు కొనం అని చెప్పడం సిగ్గు చేటు. సిద్దిపేట కలెక్టర్…
తెలంగాణ గడ్డపై మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది.. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారు మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ తనయుడు డాక్టర్ వినయ్ కుమార్… రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆయన.. అందులో భాగంగా ఇవాళ హైదరాబాద్లో తన మద్దతు దారులతో సమావేశం అయ్యారు. సాధించుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే ప్రధాన డిమాండ్తో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు వినయ్.. ఈ ఏడా డిసెంబర్లో కొత్త పార్టీ పేరును ,…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా జమ్మికుంట పట్టణంలో బహిరంగ సభలో మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… పేద ప్రజలను కాపడెది ఎవరు కాల్చుక తినేది ఎవరో ప్రజలు గుర్తించాలి. ఈటల రాజేందర్ ఆరు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి ఒక్క కుటుంబానికి ఇల్లు కట్టించలేక పోయాడు. ఎన్నికలు ఆయ్యిపోగానే గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ పెంచుతారు బీజేపీ వాళ్ళు. బీజేపీ గెలిస్తే పెట్రోల్ ధరలు,గ్యాస్…
తెలంగాణలో గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు, దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. షర్మిల పాదయాత్ర బుధవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. బుధవారం నాడు షర్మిల పాదయాత్రలో ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్యామల తన భర్తతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ శ్యామల మాట్లాడుతూ… సమాజంలో మార్పు…
తెలంగాణ రాష్ట్రంలో మరొ కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు సమాచారం అందుతోంది. డాక్టర్ వినయ్ నేతృత్వం లో ఈ కొత్త పార్టీ ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు హైదరాబాద్ బంజారా ఫంక్షన్ హాల్ లో తన మద్దతు దారులతో డాక్టర్ వినయ్ భేటీ అయ్యారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో అందరికి న్యాయం జరగాలనే డిమాండ్ తో కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా వినయ్ కుమార్ అడుగులు వేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి…
టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వీవీఎస్ లక్ష్మణ్ సుపరిచితుడే. హైదరాబాద్ కు చెందిన వీవీఎస్ లక్ష్మణ్… అంతర్జాతీయ క్రికెట్ కు అక్టోబర్ 12 వ తేదీ 2012 సంవత్సరంలో గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత… ఐపీఎల్ టోర్నీ జట్టు అయిన డెక్కన్ చార్జెస్ కు కెప్టెన్ గా వ్యవహరించారు లక్ష్మణ్. అయితే.. వయసు మీద పడుతుండటంతో.. ప్రస్తుతం సన్ రైజర్స్ జట్టుకు మెంటర్ గా…
ఏపీలో పార్టీ విస్తరిస్తామన్న సీఎం కేసీఆర్కు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. నాడు-నేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చామని, టీఆరెస్ పాలనలో ఒక్కటైనా మార్చారా అంటూ ఫైరవుతున్నారు. మొన్న సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు… ఇప్పుడు హాట్ టాపిగ్గా మారాయ్. ఏపీలోనూ పార్టీ పెట్టాలంటూ ఆహ్వానాలు వచ్చాయన్న ముఖ్యమంత్రి కామెంట్లపై స్పందిస్తున్నారు ఏపీ మంత్రులు. తెలంగాణ కంటే ఏపీలోనే పాలన బాగుందని కితాబిచ్చుకుంటున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్ల టాయిలెట్స్ ఎలా ఉన్నాయో.. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్ల…
తెలంగాణలో నేడు మావోయిస్టులు బంద్కు పిలుపు ఇవ్వడంతో ఏజెన్సీలో అలజడి మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్కి నెత్తిటి బాకీ తీర్చుకుంటాం అన్న హెచ్చరికలు మన్యంలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు పోలీసులు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్ని జల్లెడ పడుతున్నారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ మావోయిస్టు పార్టీ ఇవాళ బంద్కు పిలుపునిస్తూ లేఖ విడుదల చేసింది. ప్రభుత్వం విప్లవకారుల్ని హత్యలు చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే ప్రతీకార చర్యతో రగిలిపోతున్న మావోయిస్టులు ఏక్షణం ఎలాంటి…