Global Trade Crisis: ఇప్పటికే హర్మూజ్ మూసివేత.. మరో జలసంధి మూసివేతకు హౌతీల ప్లాన్..
- మరో జలసంధి మూసివేతకు హౌతీల ప్లాన్..
- ఇదే జరిగితే తప్పని మరో ఆర్థిక మాంద్యం..
- మొత్తం వాణిజ్యంలో దాదాపు 12 శాతం ఈ మార్గం గుండానే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఈ ఘర్షణలు ఇప్పుడు అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కీలకమైన ‘హోర్ముజ్’ జలసంధి మూతపడటంతో ఇంధన సరఫరా అస్తవ్యస్తం కాగా.. ఇప్పుడు ‘బాబ్ ఎల్-మండేబ్’ (Bab el-Mandeb) జలసంధి కూడా మూసివేతకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.
హౌతీల ఎంట్రీ..
యెమెన్ కేంద్రంగా పనిచేసే హౌతీ మిలిటెంట్ గ్రూప్ ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఇరాన్ మద్దతుతో నడిచే ఈ దళాలు, అమెరికా మరియు ఇజ్రాయెల్ వ్యూహాలను దెబ్బతీసేందుకు బాబ్ ఎల్-మండేబ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నాయి. ‘ట్రిగ్గర్ పై మా వేళ్లు సిద్ధంగా ఉన్నాయి’ అంటూ వారు చేస్తున్న హెచ్చరికలు ప్రపంచ వాణిజ్య రంగాన్ని వణికిస్తున్నాయి. ఇది ఇరాన్ మూడంచెల వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ హౌతీలు ఈ మార్గాన్ని అడ్డుకుంటే.. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులను సృష్టించగలదు.
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
బాబ్ ఎల్-మండేబ్ ప్రాముఖ్యత..
ఎర్ర సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ మరియు హిందూ మహాసముద్రంతో కలిపే ఈ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి వెన్నెముక వంటిది. ప్రపంచ మొత్తం వాణిజ్యంలో దాదాపు 12 శాతం ఈ మార్గం గుండానే జరుగుతుంది. రోజుకు సుమారు 8.8 మిలియన్ బ్యారెళ్ల చమురు మరియు సహజ వాయువు (LNG) ఇక్కడి నుంచే రవాణా అవుతాయి. యూరప్ మరియు ఆసియా ఖండాల మధ్య ప్రయాణించే నౌకలు సూయెజ్ కాలువను చేరుకోవాలంటే ఈ మార్గం తప్పనిసరి.
Also Read:Vizag: ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మాణం..
ఒకవేళ ఈ జలసంధి మూతపడితే.. నౌకలు ఆఫ్రికా ఖండం చుట్టూ ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. దీనివల్ల రవాణా సమయం అదనంగా 15 నుండి 20 రోజులు పెరుగుతుంది. ప్రయాణ దూరం పెరగడం వల్ల ఇంధన ఖర్చులు, బీమా ప్రీమియంలు భారమై, వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే హోర్ముజ్ మార్గంలో నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇప్పుడు ఈ మార్గం కూడా మూసుకుపోతే ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు పూర్తిగా కుప్పకూలుతుంది.
అమెరికా చేసే చిన్న వ్యూహాత్మక పొరపాటు అయినా ప్రపంచాన్ని భారీ విపత్తులోకి నెట్టే అవకాశం ఉందని ఇరాన్ సైనిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇంధన కొరతతో ఇప్పటికే అనేక దేశాలు ఇబ్బందులు పడుతుండగా.. బాబ్ ఎల్-మండేబ్ సంక్షోభం తోడైతే అది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీస్తుంది. శాంతి చర్చలు సఫలం కాకపోతే.. ప్రపంచం మరో భారీ ఆర్థిక మాంద్యాన్ని చూడక తప్పదు.
తాజావార్తలు
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్తో మరో క్రేజీ ప్రయోగం!
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!