విద్యార్ధులపై కోవిడ్ పంజా.. తెలంగాణ సర్కార్ హై అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్ళీ పడగ విప్పుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తం అయింది. విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష జరిపారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏ విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయో అక్కడి విద్యార్థులందరికీ స్క్రీనింగ్ చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
Read Also గురుకుల పాఠశాలలో 43 మంది విద్యార్థులకు కరోనా !
Also Read
అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. విద్యాసంస్థల్లో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అశ్రద్ధగా ఉండకూడదన్నారు. శానిటైజర్ లు వాడాలన్నారు. ధర్మ స్క్రీనింగ్ చేయాలని భౌతిక దూరం పాటించాలన్నారు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది రెండు డోస్ లు టీకా తీసుకోవాలన్నారు. తెలంగాణలో అక్కడక్కడా కోవిడ్ కేసులు నమోదవుతూనే వున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కేసులు ఆందోళన కలిగించాయి.
ఇక్కడి గురుకుల పాఠశాలలో 43 మంది విద్యార్థులు,ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. ఈ పాఠశాలలో ఏకంగా 520 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే… నిన్న నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఏకంగా 43 మంది విద్యార్థులు, ఒక లేడీ లెక్చరర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా మహమ్మారి సోకిన వారిని పాఠశాలలోనే ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు. ప్రస్తుతం… కరోనా సోకిన ఆ విద్యార్థులకు… వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్ధులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
National Film Awards: చివరి నిమిషంలో షాక్.. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వాయిదా
-
Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!
-
Rohit Sharma Records: వన్డే నుంచి టీ20 వరకు.. కోహ్లీ కూడా బ్రేక్ చేయలేని రోహిత్ శర్మ చారిత్రాత్మక రికార్డ్స్ ఇవే!
-
Lepakshi: లేపాక్షి ఆలయంలో వేలాడే స్తంభం వెనుక నిజం ఏంటి.. శతాబ్దాలుగా ఆశ్చర్యపరుస్తున్న నిర్మాణ రహస్యం!
-
Badrinath Temple: రామ మందిరం తర్వాత బద్రీనాథ్లోనూ దొంగలు..? విరాళాల కాజేత.. విచారణకు ఆదేశం
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!