తెలంగాణ జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ములుగు జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ ని కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. దీంతో కలకలం రేగింది. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుసం రమేష్ ని మావోయిస్టులు అపహరించుకుపోయారు. నిన్న సాయంత్రం చర్లకు వెళ్తుండగా రమేష్ ని కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో తీవ్ర ఆందోళన చెందుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు.…
కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు.. ఉద్యోగుల బదిలీలు ఉన్నాయా? తెలంగాణ సాధించుకున్నామన్న సంతోషం ఆవిరై.. కొత్త సమస్యను తలెకెక్కించుకున్నామనే భావనలో ఉద్యోగులు ఉన్నారా? ఇంతకీ కొత్త జోనల్ విధానం ఉద్యోగులకు వరమా.. శాపమా..? ఉద్యోగులకు అన్యాయం జరగకూడదన్న ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోవడం లేదా? తెలంగాణలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఇదే అదునుగా కొందరు అధికారులు పారదర్శకతకు పాతరేస్తూ అయిన వారిని అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు…
ధాన్యం కొనుగోళ్ల అంశం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమని పీయూష్ గోయల్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు భ్రమలను కల్పిస్తోందని… కేంద్ర ప్రభుత్వ పరంగా రైతులకు భరోసా ఇస్తున్నామన్నారు. తప్పుడు సమాచారం నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. గత రబీ సీజన్ లో ఇచ్చిన హామీ మేరకు ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయలేక పోయిందని ఆగ్రహించారు. అవసరం లేకపోయినా, ప్రత్యేక కేసుగా పరిగణించి, 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయల్డ్…
30 లక్షలు టార్గెట్. ఆ అంకె వినగానే గుండె గుభేల్ మన్నా.. సవాల్గా తీసుకుని టార్గెట్ చేరుకోవాలని అనుకున్నారు నాయకులు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి రివర్స్. చీమ కుట్టినట్టు అయినా లేదట. పార్టీ చేపట్టిన కార్యక్రమానికి ఊ అంటారో.. ఊహూ అంటారో కూడా తెలియని పరిస్థితి ఉందట. సభ్యత్వం నమోదు కోసమే 30 మందికి శిక్షణ..! కొత్త నాయకత్వం రాగానే సభలు.. సమావేశాలు అని ఊదరగొట్టిన తెలంగాణ పీసీసీకి 30 లక్షల సభ్యత్వం నమోదును లక్ష్యంగా పెట్టింది…
తెలంగాణలో దక్షిణాఫ్రికా కరోనా వేరియంట్ ఒమిక్రాన్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈనెల 16న దుబాయ్ నుంచి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో వెంటనే హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. టెస్టులు నిర్వహించగా అతడికి ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో వైద్యులు బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. Read Also:…
తెలంగాణలో విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం పెంచిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్. బీసీ, ఈబీసీ, డీఎన్ టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయాన్ని పెంచడంపట్ల తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కే. కిశోర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ఓబీసీ, ఈబీసీ స్కాలర్ షిప్స్ కి విద్యార్థుల కుటుంబ ఆదాయ పరిమితి పెంచింది. వార్షిక ఆదాయం పరిమితి రెండున్నర లక్షలకు పెంచారు. పోస్ట్…
తెలంగాణలో గురుకుల టీజీటీ పోస్టుల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా గురుకుల టీజీటీ పోస్టుల భర్తీ విషయంలో బీటెక్ అభ్యర్థుల అర్హత విషయంపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీఈడీ చేసిన బీటెక్ విద్యార్థులు గురుకుల టీజీటీ పోస్టులకు అర్హులే అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. Read Also: ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్.. పాస్ చేసేందుకు విద్యాశాఖ యోచన..? మరోవైపు గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది. బీఈడీ…
తెలంగాణ బీజేపీ నేతలు మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. రేపు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ బీజేపీ పార్టీ ఎంపీలు… కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు. అయితే.. గతంలోనే.. హోం శాఖ మంత్రి అమిత్ షా తో తెలంగాణ బీజేపీ పార్టీ ఎంపీలు, పార్టీ కీలక నేతలు భేటీ కావాల్సి ఉన్నా… ఆ సమయంలో.. సీడీఎస్ బిపిన్ రావత్ మరణించడంతో.. ఆ సమావేశం పోస్ట్ పోన్ అయింది. ఇక తాజాగా మరో…
తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శనను సాధ్యమైనంత ఎక్కువ మంది సందర్శించేలా కీలక ప్రకటన చేసింది ఆర్టీసీ. విజ్ఞానాన్ని పెంపొందించాలనే లక్ష్యం తో రూ.100 టికెట్ పై 20 శాతం రాయితీ ప్రకటిస్తూ.. తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీఎస్ సజ్జనార్ ప్రకటన చేశారు. నగరంలో 24 గంటల టికెట్ పై ఈ నెల 27 వ తేదీ వరకు తగ్గింపు పొందవచ్చని.. ఆర్టీసీ ఓ…