కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు రైతుల పక్షాన ఢిల్లీ వచ్చారని… మంత్రులను కలిసేందుకు సమయం లేదు.. కానీ, బీజేపీ నేతలను మాత్రం కలుస్తారా? అని నిలదీశారు. రాజకీయం చేస్తున్నది బీజేపీ పార్టీ అని హరీష్రావు మండిపడ్డారు. మంత్రులను పట్టుకొని పనిలేదని అంటారా? ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు మంత్రులు ఢిల్లీకి…
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది.. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.. ఒక, సాయంత్రం నుంచి చలి వణికిస్తోంది.. విశాఖ ఏజెన్సీలో రెండేళ్ల తర్వాత కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. దీంతో విపరీతంగా చలితీవ్రత పెరిగిపోయింది.. పొగమంచుకు శీతల గాలులు తోడవ్వడంతో ఏజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి.. ఈ సీజన్లో లంబసింగిలో జీరో డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. ఇక, ఇవాళ పాడేరు, అరకులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు…
తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి 726 మంది శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకున్నారని, వారదందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.దీంతో వారి శాంపిల్స్ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 9,122 మంది ప్రయాణికులు వచ్చారు.…
ఏపీలో గడిచిన 24 గంటల్లో 27,233 శాంపిల్స్ను పరీక్షించగా 95 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో ఏపీలో ఇప్పటివరకు మొత్తం 20,75,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు (కృష్ణా జిల్లా) మరణించగా ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 14,481కి చేరింది. నిన్న 179 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 20,60,061 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇంకా 1,432 కరోనా కేసులు యాక్టివ్గా…
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను మల్టీజోనల్ క్యాడర్ కేటాయింపులో భాగంగా రూపొందించిన సినియార్టీ జాబితాల్లోని లోపాలను సవరించి ఖచ్చితంగా జాబితాను రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం డీయస్ఈ శ్రీదేవసేన తన కార్యాలయంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలను తెలియజేయాలని కోరారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. రాత్రి 12.00గంటలకు…
తెలంగాణలో దళిత బంధు పథకం కింద ప్రభుత్వం మంగళవారం నాడు నిధులు విడుదల చేసింది. ఎంపిక చేసిన నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు దళిత బంధు కింద ఎస్సీ కార్పొరేషన్ నిధులను కేటాయించింది. ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. నాలుగు మండలాలకు కలిపి మొత్తం రూ. 250 కోట్లను జమ చేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. Read Also: గ్రేట్ టాలెంట్.. ఖమ్మంతో పెట్టుకుంటే కుమ్ముడే..!! సూర్యాపేట జిల్లా…
పులి చర్మం అమ్మేదుకు ప్రయత్నం చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు ములుగు జిల్లా పోలీసులు. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఛత్తీస్ఘడ్ నుండి పులి చర్మాన్ని తెలంగాణలో అమ్మేందుకు ముఠా బయలు దేరింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేస్తుంటే రెండు బైక్స్ పైన వస్తున్న ఐదుగురిని గుర్తించి తనిఖీలు చేస్తే పులి చర్మం బయటపడింది. ఇది నిజమైందో కాదో తెలుసుకునేందుకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అది నిజమైన పులి చర్మం అని…
విద్యుత్ బకాయిల వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాలకు మోడీ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్నవివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు ఇంధన శాఖ మంత్రి ఆర్కె సింగ్ వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ తెలంగాణ 6,111 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని, కేంద్ర జోక్యం చేసుకుని…
రైతుల పాలిట యముడిలా సీఎం కేసీఆర్ తయారయ్యారని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో పంట కొనుగోళ్లలో జాప్యం,అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతు మల్లయ్య కుటుంబాన్ని ఇవాళ వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఏఒక్క నాయకుడూ ఆదుకోలేదని.. బోర్లు వేసుకున్న రైతులకు వైఎస్ ఆర్ ఎంతో చేశారని… పదవుల్లో ఉన్న తండ్రీకొడుకులు ఏం చేసినట్టు? అని నిలదీశారు. రైతు…
ఆ పదవుల భర్తీపై టీఆర్ఎస్ తేల్చుకోలేకపోతుందా..? ఒకసారి జిల్లా అధ్యక్షుల నియామకం చేయాలని.. మరోసారి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం సరిపోతుందని ఎందుకు భావిస్తోంది? జిల్లాస్థాయిలో గులాబీపార్టీ ఎందుకు ఆచితూచి అడుగులు వేస్తోంది? అప్పట్లో జిల్లా అధ్యక్షుల నియామకంపై టీఆర్ఎస్లో చర్చ..! జెండా పండుగతోపాటు పార్టీ సంస్థగత నిర్మాణాన్ని మొదలు పెట్టింది టీఆర్ఎస్. గ్రామ, మండల, మున్సిపాలిటీలలో పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయింది. పార్టీ నిర్మాణంలో భాగంగా జిల్లా అధ్యక్షులను నియమించాలని గులాబీ పెద్దలు అభిప్రాయపడ్డారు. గతంలోనే జిల్లాస్థాయిలో…