హైదరాబాద్ శివారులో పేలుడు కలకలం సృష్టించింది.. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగర్లో చెత్త కుండీలో పేలుడు సంభవించింది… ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆనంద్ నగర్లో చెత్త సేకరించేందుకు రంగముని సుశీలమ్మ, ఆమె భర్త ఆనందనగర్ పారిశ్రామిక వాడలకు ఉదయం ఆటోలో వెళ్లారు.. అయితే, చెత్త సేకరిస్తున్నండగా పేలుడు జరిగింది.. ఈ ఘటనలో సుశీలమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా..…
ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి రెండో ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో మొత్తంగా 250 మంది విద్యార్థులున్నారు. శనివారం 219 మంది విద్యార్థులతో తొలి ఎయిర్ఇండియా విమానం ముంబైకి చేరుకుంది. ముంబై విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థులకు… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. కొందరు విద్యార్థులు… ఆయనకు కృతజ్ఞతలు తెలపగా… మరికొందరు కేంద్ర మంత్రితో సెల్ఫీలు దిగారు.…
కేంద్రం రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉంది, యాసంగి వడ్లను రాష్ట్రం కొనాల్సిందే అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కేంద్రం యాసంగికి సంబంధించి రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రం ఎందుకు వడ్లను కొనం అంటోందని బండి సంజయ్ ప్రశ్నించారు. కామారెడ్డి లోని పర్ణికా హోటల్ లో జరిగిన బీజేపీ జోనల్ సమావేశంలో పార్టీ జాతీయ సహా కార్యనిర్వాహక కార్యదర్శి శివప్రకాశ్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశా నిర్దేశం…
కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ఈసారి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో సైకిల్ ర్యాలీలు,మోటార్ బైక్ ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీలను నిర్వహించిన భట్టి విక్రమార్క ఈసారి ఏకంగా పాదయాత్రకు రంగం సిద్ధం చేశారు. ఆదివారం నుంచి మధిర నియోజకవర్గం వ్యాప్తంగా ఈ యాత్ర సాగనుంది. ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు నియోజకవర్గ సమస్యలను దృష్టికి తీసుకుని వెళ్లేందుకు యాత్రను చేపట్టనున్నారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించారు. అయితే ఇంకా నియోజకవర్గంలో తన…
ఆ శివుడు ఊరుకోడు.. మూడో కన్ను తెరుస్తాడు.. సీఎం కేసీఆర్ సంగతి తేలుస్తాడు అని ఫైర్ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన దీక్ష సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయానికి ఏడాదికి 100 కోట్ల చొప్పున ఇస్తా అన్నాడు.. అందుకు రూ. 700 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. కేసీఆర్ కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆయనకు సంస్కారం లేదు..…
ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులు, భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.. సురక్షితంగా వారిని స్వదేశానికి తీసుకొస్తాం అన్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా యుద్ధం చేస్తోంది.. యుద్ధం ప్రారంభం కాక ముందే 4 వేల మందిని స్వదేశానికి తరలించాం.. ప్రస్తుతం గగనతలం మూసివేయడంతో 19 – 20 వేల మంది అక్కడ చిక్కుకున్నారని తెలిపారు.. అయితే, భారతీయులను ఎలా రక్షించుకోవాలని వివిధ ప్లాన్లను రూపొందించింది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. అందరి వివరాలు సేకరించాం.. వారిని…
బుల్లితెర ప్రేక్షకులకు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రముఖ రియాల్టీ షో బిగ్బాస్.. ఇప్పటి వరకు గంట మాత్రమే ఉండే ఈ షో.. ఇవాళ్టి (ఫిబ్రవరి 26వ తేదీ) నుంచే ఓటీటీ తొలి సీజన్ మొదలుకాబోతోంది. ఈ మధ్యనే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ తొలి సీజన్ ప్రోమో కూడా విడుదలైంది.. డిస్నీ హాట్ స్టార్లో ఈ షో ప్రసారం కాబోతోంది.. అయితే, బిగ్బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బిగ్బాస్…
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 27న ఆదివారం పల్స్ పోలియోను అధికారులు నిర్వహించనున్నారు. 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన అనంతరం రెండు రోజుల పాటు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నాడు హెల్త్, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్…
★ శ్రీశైలంలో ఐదోరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు… సాయంత్రం ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ.. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు రావణ వాహన సేవ★ ఈరోజు మధ్యాహ్నం ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి రానున్న 22 మంది తెలుగు విద్యార్థులు.. బుకారెస్ట్ నుంచి ఢిల్లీ రానున్న 13 మంది.. బుకారెస్ట్ నుంచి ముంబై రానున్న 9 మంది తెలుగు విద్యార్థులు★ ఢిల్లీ: నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం, ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై…
అంతర్జాతీయ సువార్తకులు బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నట్టుండి సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను కలిశారు.. సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు.. అయితే, ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడినా.. ఉండవల్లితో భేటీకి సంబంధించిన విషయాలను త్వరలో బయటపెడతాననడం ఆసక్తికరంగా మారింది.. కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ను మర్యాద పూర్వకంగానే కలిశానని.. సుమారు గంట సేపు చర్చలు జరిగాయని తెలిపిన ఆయన. తెలంగాణ, ఏపీకి సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయన్నారు.. పార్టీపరంగా, కుటుంబ…