Traffic Pending Challans: త్వరపడండి.. మిగిలింది 5 రోజులే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాహనదారుల అప్రమత్తం కండి… భారీ డిస్కౌంట్ల ఆఫర్ త్వరలోనే ముగియనుంది.. మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది.. తెలంగాణ ప్రజలపై పెండింగ్ చలానా వాహనదారులపై ఆర్థిక భారం తగ్గించడానికి పోలీస్ శాఖ భారీ డిస్కౌంట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.. మీరు ఊళ్లో లేకపోయినా సరే.. ఆన్లైన్లో అయినా పెండింగ్ ఛలానాలు చెల్లించమంటున్నారు పోలీస్ అధికారులు. రాయితీ వర్తింపు గడువులోగా చలాన్లు క్లియర్ చేసుకోలేకపోతే తర్వాత భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పెండింగ్ చలాన్ అమలులోకి రాగానే.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 650 కోట్లకు పైగా విలువైన చలాన్స్ క్లియర్ అయ్యాయి. ఇందులో రాయితీ పొగ 190 కోట్లు ప్రభుత్వ ఖజానా కు వచ్చి చేరాయి. ఇప్పటి వరకు కోటి 85 లక్షల ఛలన్లు క్లియర్ అయ్యాయనీ నగర్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
Read Also: Birbhum: బీర్భూమ్ ఘటనలో కీలక పరిణామం..
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
ఇదిలా ఉండగా రోజుకు ఏడు నుండి పది లక్షల వరకు చలాన్లు క్లియర్ అవుతున్నాయి. మార్చి 31 వరకే ఈ అవకాశం ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలనీ పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికి అయితే గడువు పొడిగింపు ఆలోచన లేదన్నారు నగర జాయింట్ ట్రాఫిక్ సీపీ.. ఇప్పటి వరకు 15 వందల కోట్ల విలువ చేసే… చలాన్ల పెండింగ్ ఉన్నాయి. 60 నుండి 70 శాతం క్లియర్ అవుతాయని ఆశిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. గడువు సమయం తర్వాత ట్రాఫిక్ రూల్స్ వయిలెట్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయనీ పోలీస్ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హైయెస్ట్ చాలన్లు క్లియర్ అయ్యాయి. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై ఛార్జ్ షీట్ లు వేస్తామన్నారు. ఏప్రిల్ నుండి ట్రాఫిక్ రూల్స్ ఉలంఘిస్తే… చార్జ్ షీట్ లు వేస్తాం అనీ తెలిపారు. కోవిడ్ కారణాలతో గ్యాప్ ఇచ్చామనీ.. తిరిగి మునుపటి లాగే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతామన్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ ముగిసిన తర్వాత ఇలాగే పెండింగ్ చలనాలు ఉన్నవారినీ గుర్తించి చార్జిషీట్లు వేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి చలానాలు తొందరగా క్లియర్ చేసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా.. మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్న ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకుంటే.. డబ్బులు మిగలడంతో పాటు.. ఇతర ఇబ్బందులు కూడా తొలగిపోనున్నాయి.. మరెందుకు ఆలస్యం.. ఇప్పుడే.. ఆన్లైన్లో మీ పెండింగ్ చలాన్లు క్లియర్ చేయండి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!