దక్షిణ అండమాన్ సముదంలో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కోస్టల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. రానున్న వర్షాల ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ధాన్యాన్ని వర్షాల నుంచి రక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. 4,039 ధాన్యం కోనుగోలు కేంద్రాలలో యుద్ధప్రతిపాదికనగా వర్షం…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురిసాయి.. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది. కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.. చెన్నై లాంటి ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు.. అయితే, ఆ అల్పపీడన ప్రభుత్వంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని చెబుతోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఈ నెల 13వ తేదీన…
తెలంగాణపై గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది.. హైదరాబాద్లో గంటల తరబడి ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షం కురుస్తుండగా.. జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇవాళ తెల్లవారుజాము నుంచే భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి.. మధ్యాహ్నం వరకే తెలంగాణలో 15 సెంటీ మీటర్లు, హైదరాబాద్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 3.3 సెంటీ మీటర్ల వర్షం నమోదు కాగా.. రాష్ట్రంలోని 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,…
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, తార్నాక,ఉప్పల్, హబ్సిగూడ, రామంతపూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, విద్యానగర్, అంబర్పేట్, రాంనగర్, దోమలగూడ, చిలకలగూడ, అల్వాల్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, హయత్నగర్తోపాటు చార్మీనార్లో భారీగా వాన కురిసింది. అత్యధికంగా బహదూర్పురాలో 9 సెంటీమీటర్లు, చార్మినార్లో ఐదున్నర సెంటీమీటర్లు, సైదాబాద్లో 4 సెంటీమీటర్లు, ఝాన్సీబజార్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, మేడ్చల్ ప్రాంతాల్లో…
మూడు రోజుల క్రితం వరకు తెలంగాణవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. అయితే రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 5 రోజులు ఉరుములు, మెరుపులతో…
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ సైతం జారీ చేసింది.. ఇక, భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. ఇక, నిన్న మానేరు వాగుపై ఉన్న లెవెల్ వంతెనపై ఆర్టీసీ బస్సు చిక్కుకు పోగా.. ఇవాళ ఉదయం ప్రవాహ ఉధృతి ఎక్కువవడంతో వంతెనపై చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. వాగులో కొట్టుకుపోయింది.. వాగు పొంగి పొర్లుతుండడంతో బస్సును బయటకు తీసేందుకు…
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో… ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ప్రధాన జలాశయాలన్నీ నిండుకుండల్లా మారడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి లక్షా 25 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 7టీఎంసీల నీరు నిల్వ ఉంది. 16గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 69వేల…
బంగాళఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓమోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలో వానలు పడుతున్నాయి. అటు ఏపీలోనూ పలుచోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు…
ఈ నెల 4న నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో తొలకరి వర్షాలు కురిశాయి. కాగా ఆ తర్వాతి నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. నిన్న నల్గొండ జిల్లాలో అత్యధికంగా 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో వాన జాడే లేకుండా పోయింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ…
తెలంగాణలో రానున్న మరో మూడు రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.. రేపు,ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.. ఇక, రాగల మూడు రోజుల పాటు.. ఇవాళ, రేపు, ఎల్లుండి.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం పడుతుందని.. ఒకటి, రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక, రాష్ట్రంలో నైరుతి…