భారీ వర్షాలు : నిండు కుండలా మారిన ప్రధాన జలాశయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో… ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ప్రధాన జలాశయాలన్నీ నిండుకుండల్లా మారడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి లక్షా 25 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 7టీఎంసీల నీరు నిల్వ ఉంది. 16గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 69వేల 904 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 28వేల 252 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 844.20 అడుగులకు నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 68.7145 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
read read : రేపు అల్పపీడనం… తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
ఇక ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లో భారీగా నీరు రాగా… వచ్చింది వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. అటు పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 532 అడుగుల మేర నీరు ఉంది. కాగా, శ్రీరాంసాగర్లో నీటిమట్టం దాదాపు పూర్తిస్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి వైరా రిజర్వాయర్ జలకళ సంతరించుకుంది. పూర్తిగా నిండిపోయి 4 అలుగులు ద్వారా నీరు ప్రవహిస్తోంది. ఖరీఫ్ పంటకు ఆయకట్టు పరిధిలోని 25వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. ఇన్ఫ్లో 27వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 34,800 క్యూసెక్కులుగా ఉంది.
ప్రాజెక్టుకు చెందిన 4గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు అధికారులు. హైదరాబాద్ జంట జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. హిమాయత్సాగర్లోకి వెయ్యి క్యూసెక్కులు నీరు వచ్చి చేరింది. 3గేట్ల ద్వారా హిమాయత్సాగర్ నుంచి మూసీలోకి 1030 క్యూసెక్కులు నీరు వెళ్తోంది. హిమాయత్సాగర్ లో నీటిమట్టం 1762.75 అడుగులకు చేరగా.. ఉస్మాన్సాగర్లో నీటిమట్టం 1784.80 అడుగులకు చేరింది. ఉస్మాన్సాగర్లోకి 200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అటు తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..