భారీ వర్షాలు : నిండు కుండలా మారిన ప్రధాన జలాశయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో… ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ప్రధాన జలాశయాలన్నీ నిండుకుండల్లా మారడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి లక్షా 25 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 7టీఎంసీల నీరు నిల్వ ఉంది. 16గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 69వేల 904 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 28వేల 252 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 844.20 అడుగులకు నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 68.7145 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
read read : రేపు అల్పపీడనం… తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ఇక ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లో భారీగా నీరు రాగా… వచ్చింది వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. అటు పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 532 అడుగుల మేర నీరు ఉంది. కాగా, శ్రీరాంసాగర్లో నీటిమట్టం దాదాపు పూర్తిస్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి వైరా రిజర్వాయర్ జలకళ సంతరించుకుంది. పూర్తిగా నిండిపోయి 4 అలుగులు ద్వారా నీరు ప్రవహిస్తోంది. ఖరీఫ్ పంటకు ఆయకట్టు పరిధిలోని 25వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. ఇన్ఫ్లో 27వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 34,800 క్యూసెక్కులుగా ఉంది.
ప్రాజెక్టుకు చెందిన 4గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు అధికారులు. హైదరాబాద్ జంట జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. హిమాయత్సాగర్లోకి వెయ్యి క్యూసెక్కులు నీరు వచ్చి చేరింది. 3గేట్ల ద్వారా హిమాయత్సాగర్ నుంచి మూసీలోకి 1030 క్యూసెక్కులు నీరు వెళ్తోంది. హిమాయత్సాగర్ లో నీటిమట్టం 1762.75 అడుగులకు చేరగా.. ఉస్మాన్సాగర్లో నీటిమట్టం 1784.80 అడుగులకు చేరింది. ఉస్మాన్సాగర్లోకి 200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అటు తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..