హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం రాజకీయ మలుపు తీసుకుంటోంది. ఈ అంశంపై విద్యార్థుల ఆందోళనలతో పాటు రాజకీయ నాయకుల ప్రస్తావనలు పెరుగుతున్నాయి. తాజాగా, తెలంగాణ భవన్లో HCU విద్యార్థులతో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థులు తమ ఆందోళనలను వ్యక్తం చేయగా, కేటీఆర్ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “HCU భూములు అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత ఆరాటపడుతుంది?”…
HCU Land Issue: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. ఈ వ్యవహారంపై విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో, తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన TGIIC (Telangana State Industrial Infrastructure Corporation) ఇచ్చిన ప్రకటనను ఖండించింది. HCU తెలిపిన ప్రకారం, 400 ఎకరాల భూమిని గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి సర్వే నిర్వహించలేదని వెల్లడించింది. జూలై 2024లో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సర్వే జరిగిందన్న వార్తలను…
Uttam Kumar Reddy : తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆశావహుల జాబితాను కాంగ్రెస్ హైకమాండ్కు పంపినట్లు సమాచారం. హైకమాండ్ పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రత్యేకంగా కలుసుకుని మంత్రివర్గ విస్తరణపై అధికారికంగా సమాచారం అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 3వ తేదీన నలుగురు కొత్త మంత్రులు కేబినెట్లో చేరే అవకాశముందని తెలుస్తోంది. ఇక,…
BC Reservations : తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ శాసన సభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చాయి. ఈ మహాధర్నాలో ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇతర మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు ఆది…
Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేసినా తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకున్నామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేసినప్పటికీ, ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపారని ఆయన వ్యాఖ్యానించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు.…
Gangula Kamalakar : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని లోయర్ మానేరు జలాశయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. అధికారులను అడిగి నీటి సమర్థ్య విలువలను తెలుసుకున్నారు ఎమ్మెల్యే గంగుల. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో మళ్ళా తాగునీటి సమస్య, నీటి యుద్ధం మొదలైందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్చి నెలలో ఇంత డెడ్ స్టోరేజీకి ఎప్పుడు వెళ్ళలేదని ఆయన వ్యాఖ్యానించారు. మార్చి నెలలోనే ఇలా ఉంటే రాబోయే…
Jagadish Reddy : సూర్యాపేట జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, “రేవంత్ భాషలో ఎలాంటి మార్పు రాలేదు. సీఎం అనే సోయిలేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన భాష తీరే ఆయనను బొందపెడుతుంది” అంటూ మండిపడ్డారు. “15 నెలలు గడిచినా కేసీఆర్ ప్రస్తావన లేకుండా సభలు సాగడం లేదు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు,” అని…
ఓయూలో నిర్భంద ఆంక్షలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో తాజాగా లేఖ విడుదల చేయడం కలకలం రేపుతోంది. నేటి పాలకుల విధానాల వలన మునుపెన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఈ లేఖలో మావోయిస్టు పార్టీ ధ్వజమెత్తింది. ఈ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నారని మండిపడింది.
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తన రాజకీయ జీవిత కథను స్వయంగా రాసుకున్నారని ప్రకటించారు. సినిమా టీజర్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన, హీరోలు ఎవరైనా ఇతరుల రాసిన కథల్లో నటిస్తారని, కానీ తాను నిజజీవితంలో పోలీసులను ఎదుర్కొన్నానని, ఫైట్లు చేశానని పేర్కొన్నారు. ఈ సినిమాలో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను వేరే పాత్రల ద్వారా చూపించడంతో పాటు, తాను కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే తనపై ఎన్నో కుట్రలు…
తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు. పంచాంగ శ్రావణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ భవన్ లో పంచాంగ శ్రవణం జరిగింది. పంచాంగ శ్రవణం ప్రకారం.. ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు కనిపిస్తాయి. సంపూర్ణ వర్షాలు పడతాయి. ప్రభుత్వం పాలన చేయడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. కేంద్రం నుండి వచ్చే సహకారం కూడా తీసుకునే అవకాశం ఉండదు. పత్తి పంటలకు మంచి అవకాశం. ఎర్ర నేలలో వేసే పంటకు మంచి అవకాశం. వస్త్ర పరిశ్రమలు కొత్తగా వెలుస్తాయి అభివృద్ధి…