Kaleshwaram Commission : కేసీఆర్ కు ఉచ్చు బిగుస్తోందా..? మహేష్ గౌడ్ చెప్పిన నిజం..!
- కాళేశ్వరం కమిషన్ స్పష్టం చేసింది.. కేసీఆర్ దోషి
- కార్ రేస్లో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డాడు
- బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి ప్రమాదకరం.. మేము మేల్కొని ఆపించాం
- కాంగ్రెస్లో గ్రూపులు పార్టీ బలం : మహేష్ గౌడ్
Kaleshwaram Commission : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను నేరుగా తప్పుబట్టారు. “కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ స్పష్టంగా చెప్పింది – కేసీఆర్ దోషి. ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు,” అని ఆరోపించారు.
ఇంజనీర్లు సూచించిన సాంకేతిక అంశాలను పక్కన పెట్టి, తన స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నాడని విమర్శించారు. “తనకు ఇష్టం ఉన్న చోటే ప్రాజెక్టు కట్టాలని ఆదేశాలు ఇచ్చాడు. ఇప్పుడు రెండే పిల్లర్లు కుంగాయని అంటున్నారు… ఇది చిన్న విషయం కాదు,” అని అన్నారు.
Also Read
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
Rajnath Singh: దమ్ముంటే ఆ ‘‘అణుబాంబు’’ పేల్చు.. రాహుల్ గాంధీకి రాజ్నాథ్ సవాల్..
“ఈ కార్ రేస్లో కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా? ప్రభుత్వ సొమ్ము తిన్న వారు కక్కక తప్పదు,” అని హెచ్చరించారు. అలాగే, “సుతి లేని సంసారం చేసి 8 లక్షల కోట్లు అప్పు చేశావు. కేసీఆర్ కుటుంబం అంటే అబద్ధాల పుట్ట,” అని తీవ్రంగా దుయ్యబట్టారు.
“మీ చేతకానితనం వల్ల బనకచర్ల ప్రాజెక్టు వస్తోంది. మేము మేల్కొని ఫిర్యాదు చేశాకే ప్రాజెక్టు పనులు ఆగాయి,” అని తెలిపారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి శాశ్వత నష్టం కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. “కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు సహజం. గ్రూపులు ఉండాలి. పాత నీరు, కొత్త నీరు కలిసే పార్టీ బలంగా ఉంటుంది,” అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో అందరూ ఒక్కటై పార్టీ విజయం కోసం పనిచేస్తారని స్పష్టం చేశారు. “గ్రూపుల వల్ల పార్టీకి నష్టం జరగకుండా చూసుకోవడం మా బాధ్యత,” అని చెప్పారు.
Kuppam: భూమి మీద నూకలు ఉండటమంటే ఇదేనేమో.. త్రుటిలో తప్పించుకున్న మహిళలు..
తాజావార్తలు
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!