Kaleshwaram Commission : కేసీఆర్ కు ఉచ్చు బిగుస్తోందా..? మహేష్ గౌడ్ చెప్పిన నిజం..!
- కాళేశ్వరం కమిషన్ స్పష్టం చేసింది.. కేసీఆర్ దోషి
- కార్ రేస్లో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డాడు
- బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి ప్రమాదకరం.. మేము మేల్కొని ఆపించాం
- కాంగ్రెస్లో గ్రూపులు పార్టీ బలం : మహేష్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram Commission : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను నేరుగా తప్పుబట్టారు. “కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ స్పష్టంగా చెప్పింది – కేసీఆర్ దోషి. ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు,” అని ఆరోపించారు.
ఇంజనీర్లు సూచించిన సాంకేతిక అంశాలను పక్కన పెట్టి, తన స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నాడని విమర్శించారు. “తనకు ఇష్టం ఉన్న చోటే ప్రాజెక్టు కట్టాలని ఆదేశాలు ఇచ్చాడు. ఇప్పుడు రెండే పిల్లర్లు కుంగాయని అంటున్నారు… ఇది చిన్న విషయం కాదు,” అని అన్నారు.
Also Read
- Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
- Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
Rajnath Singh: దమ్ముంటే ఆ ‘‘అణుబాంబు’’ పేల్చు.. రాహుల్ గాంధీకి రాజ్నాథ్ సవాల్..
“ఈ కార్ రేస్లో కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా? ప్రభుత్వ సొమ్ము తిన్న వారు కక్కక తప్పదు,” అని హెచ్చరించారు. అలాగే, “సుతి లేని సంసారం చేసి 8 లక్షల కోట్లు అప్పు చేశావు. కేసీఆర్ కుటుంబం అంటే అబద్ధాల పుట్ట,” అని తీవ్రంగా దుయ్యబట్టారు.
“మీ చేతకానితనం వల్ల బనకచర్ల ప్రాజెక్టు వస్తోంది. మేము మేల్కొని ఫిర్యాదు చేశాకే ప్రాజెక్టు పనులు ఆగాయి,” అని తెలిపారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి శాశ్వత నష్టం కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. “కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు సహజం. గ్రూపులు ఉండాలి. పాత నీరు, కొత్త నీరు కలిసే పార్టీ బలంగా ఉంటుంది,” అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో అందరూ ఒక్కటై పార్టీ విజయం కోసం పనిచేస్తారని స్పష్టం చేశారు. “గ్రూపుల వల్ల పార్టీకి నష్టం జరగకుండా చూసుకోవడం మా బాధ్యత,” అని చెప్పారు.
Kuppam: భూమి మీద నూకలు ఉండటమంటే ఇదేనేమో.. త్రుటిలో తప్పించుకున్న మహిళలు..
తాజావార్తలు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!