Harish Rao : 700 వార్డుల్లో గెలుపు.. కాంగ్రెస్ వైఫల్యాలకు ఇది నిలువుటద్దం.!
- మున్సిపల్ ఫలితాలు కాంగ్రెస్కు హెచ్చరిక : హరీష్ రావు
- 700 పైగా వార్డుల్లో బీఆర్ఎస్ విజయం
- రేవంత్ సర్కార్ పాలనపై తీవ్ర విమర్శలు
- కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రతిపక్ష పోరాటం కొనసాగనుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అధికార పక్షం ఎన్ని అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడినా, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారని ఆయన మండిపడ్డారు. దాదాపు 700కు పైగా వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిలువుటద్దమని ఆయన అభివర్ణించారు.
అధికార కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, డబ్బు రాజకీయాలకు భయపడకుండా కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా గెలిచి సత్తా చాటారని, బీఆర్ఎస్ నాయకులకు హరీష్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై కొట్లాడినా ప్రజా తీర్పును మార్చలేకపోయారని ఎద్దేవా చేశారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికుల కృషి వెలకట్టలేనిదని ఆయన ప్రశంసించారు.
Also Read
- Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
Liquor Smuggling Racket: గోవా మద్యం దందాపై ఎక్సైజ్ దాడులు.. 92 బాటిళ్లు, 3 కార్లు సీజ్.!
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అభివృద్ధి పూర్తిగా మందగించిందని హరీష్ రావు విమర్శించారు. “ఎన్నికల హామీలు గాలిలో కలిసిపోయాయి.. సంక్షేమ పథకాలు అటకెక్కాయి.. ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా రేవంత్ సర్కార్ కాలం గడుపుతోంది” అని ధ్వజమెత్తారు. అందుకే ప్రజలు ఓటు అనే కొరడాతో కాంగ్రెస్కు బుద్ధి చెప్పారని, మొన్నటి పంచాయతీ ఫలితాలు, నేటి మున్సిపల్ ఫలితాలే దానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ను గద్దె దించే శక్తి ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని ఈ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పక్షం దౌర్జన్యాలను ఎదుర్కొని సాధించిన ఈ విజయాలు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని తెలిపారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేసే వరకు నిర్విరామ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!