Bhatti Vikramarka : విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారు..
- కాంగ్రెస్ విజయంపై ఓటర్లకు భట్టి విక్రమార్క కృతజ్ఞతలు
- ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారు
- అభివృద్ధి, సంక్షేమానికే ప్రజల మద్దతు
- 83 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం : భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతుండటంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించిన ఓటర్ మహాశయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం , పీసీసీ తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అభివృద్ధికి, సంక్షేమానికి , విశ్వసనీయతకే ప్రాధాన్యత ఇస్తారని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీపై భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రతిపక్షాలు గాలి కబుర్లు, కట్టుకథలతో అసత్య ప్రచారాలు చేశాయని ఆయన మండిపడ్డారు. లేనివి ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూసిన వారికి, ఓటర్లు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పారని, వారి అసలు స్థానం ఏంటో చూపించారని ఎద్దేవా చేశారు.
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఈ విజయం తమ ప్రభుత్వంపై బాధ్యతను మరింత పెంచిందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. “ప్రజలు ఈ ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, అత్యున్నత ప్రమాణాలతో కూడిన పరిపాలనను భవిష్యత్తులోనూ అందిస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఈ తీర్పు ఒక ఆమోదముద్ర అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి తాజా గణాంకాలను భట్టి వెల్లడించారు. తమకు అందుతున్న సమాచారం ప్రకారం, ఇప్పటికే 83 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతతో విజయకేతనం ఎగురవేస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయనడానికి ఈ భారీ విజయమే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
Ragi Pittu: ఆడపిల్లలకి అమృతం లాంటి ఆహారం.. నెలలో 3 సార్లు ఇది తింటే నడుము నొప్పి, నీరసం పరార్!
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..