Bhatti Vikramarka : విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారు..
- కాంగ్రెస్ విజయంపై ఓటర్లకు భట్టి విక్రమార్క కృతజ్ఞతలు
- ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారు
- అభివృద్ధి, సంక్షేమానికే ప్రజల మద్దతు
- 83 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం : భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతుండటంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించిన ఓటర్ మహాశయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం , పీసీసీ తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అభివృద్ధికి, సంక్షేమానికి , విశ్వసనీయతకే ప్రాధాన్యత ఇస్తారని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీపై భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రతిపక్షాలు గాలి కబుర్లు, కట్టుకథలతో అసత్య ప్రచారాలు చేశాయని ఆయన మండిపడ్డారు. లేనివి ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూసిన వారికి, ఓటర్లు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పారని, వారి అసలు స్థానం ఏంటో చూపించారని ఎద్దేవా చేశారు.
Also Read
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
- Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఈ విజయం తమ ప్రభుత్వంపై బాధ్యతను మరింత పెంచిందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. “ప్రజలు ఈ ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, అత్యున్నత ప్రమాణాలతో కూడిన పరిపాలనను భవిష్యత్తులోనూ అందిస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఈ తీర్పు ఒక ఆమోదముద్ర అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి తాజా గణాంకాలను భట్టి వెల్లడించారు. తమకు అందుతున్న సమాచారం ప్రకారం, ఇప్పటికే 83 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతతో విజయకేతనం ఎగురవేస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయనడానికి ఈ భారీ విజయమే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
Ragi Pittu: ఆడపిల్లలకి అమృతం లాంటి ఆహారం.. నెలలో 3 సార్లు ఇది తింటే నడుము నొప్పి, నీరసం పరార్!
తాజావార్తలు
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!