Home
Telangana Politics
Telangana Politics News
-
KTR : కాంగ్రెస్ పని అయిపోయింది.. సర్వేల్లో బీఆర్ఎస్కు 78 సీట్లు ఖాయం
KTR : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని, రాష్ట్రంలో ఆ పార్టీ పని ఇక అయిపోయినట్లేనని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జిల్లా పార్టీ నేతలతో జరిగిన ముఖ్యమైన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సగం పదవీ కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తన పరిపాలన, నాయకత్వంపై ఒక విస్తృతమైన సొంత సర్వే చేయించుకున్నారని… -
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి నెవ్వెర్ బిఫోర్ అనదగ్గ రీతిలో బహిరంగ సవాల్ విసిరారు. కేసీఆర్ కోరుకున్న రోజున అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్పీకర్కు లేఖ రాసి ఆయనే స్వయంగా ఒక తేదీని ఖరారు చేయాలని, ఇరు సభల జాయింట్ సెషన్ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చిద్దామని పిలుపునిచ్చారు. సభలో కేసీఆర్ గౌరవానికి… -
Etela Rajender : హైడ్రాతో రేవంత్ రెడ్డి సర్కార్కు తిప్పలు తప్పవు..
Etela Rajender : హైదరాబాద్లో హైడ్రా (HYDRAA) వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా సీఎం రేవంత్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని ప్రజలు అంటున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అబద్ధాలు చెప్పడంలో ఉన్న క్లారిటీ ప్రజలకు లేదని, అమెరికా గడ్డపై నిలబడి ఆయన అబద్ధాలు చెబితేనే జనం నమ్ముతారనే భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. దానికి పరాకాష్టగా తాను… -
Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి.. కేసీఆర్, కేటీఆర్లపై పొంగులేటి ఫైర్
Ponguleti Srinivas Reddy : సిద్దిపేట వేదికగా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి లక్షల కోట్ల రూపాయల నిధులు వచ్చాయి కానీ, పేదవాడికి ఒక సొంత ఇల్లు కట్టించి ఇవ్వడానికి మాత్రం వారికి మనసు రాలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాళ్లే, దాన్ని ఓపెన్ చేసింది వాళ్లే, చివరకు అది కూలిపోయింది… -
Aadi Srinivas : వారం కాదు.. 209 వారాలు కేసీఆర్ చేతిలోనే ఉంది.. కేటీఆర్కు ఆది శ్రీనివాస్ కౌంటర్
Aadi Srinivas : కేసీఆర్కు వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీళ్లు ఇస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. 2016 మే నెలలో కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, 2019 జూన్లో ప్రారంభించారని.. ఆనాటి నుండి 2023 డిసెంబర్ వరకు (దాదాపు 209 వారాల పాటు) ఈ ప్రాజెక్టు కేసీఆర్… -
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
Kishan Reddy : హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సర్కారుకు మజ్లిస్ పార్టీ (AIMIM) అంటే భయమా, ప్రేమా లేక రెండూ ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. భూములు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కమీషన్ల కోసం ఆరాటపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇందుకోసం సామాన్య ప్రజల జీవనోపాధిని బలిచేస్తోందని ఆరోపించారు. అదే సమయంలో మజ్లిస్ పార్టీ అగ్రనేతల ప్రయోజనాలను… -
KTR : చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్కు అప్పగించండి.. నీళ్లు ఎత్తి చూపిస్తాం
KTR : కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన హౌస్ అరెస్టులు, పోలీసుల ఆంక్షలు, అడుగడుగునా ఎదురైన అడ్డంకులను అధిగమించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్హౌస్కు చేరుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉదయం 8 గంటలకు బయలుదేరిన తమను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో 3 గంటల్లో చేరుకోవాల్సిన ప్రయాణానికి మధ్యాహ్నం 3 గంటల సమయం పట్టిందని మండిపడ్డారు. కన్నెపల్లి పంప్హౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా దగా పడ్డ తెలంగాణకు… -
Uttam Kumar Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ గ్లోబల్ ప్రాపగాండా చేస్తోంది
Uttam Kumar Reddy : తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విపక్షాలు పూర్తిగా అసత్య ప్రచారం చేస్తూ, గ్లోబల్ ప్రాపగాండాకు తెరలేపాయని మండిపడ్డారు. పదేళ్ల పాటు సాగిన గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా సర్వనాశనం చేశారని, వారు ఏది ముట్టినా అది నాశనమైపోయిందని ఆరోపించారు. గత పాలకులు కేవలం తమ కక్కుర్తి కోసమే ప్రాజెక్టులను కట్టారు తప్ప,… -
Jupally Krishna Rao : రూ.8.21 లక్షల కోట్ల అప్పు.. జూపల్లి బిగ్ ఛాలెంజ్.!
Jupally Krishna Rao : హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ అగ్రనేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్ల పాలనలో కేటీఆర్, హరీష్ రావు చెప్పే అప్పుల లెక్కలన్నీ పచ్చి అబద్ధాలని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంపై ఏకంగా రూ. 8 లక్షల 21 వేల కోట్ల అప్పులు, బకాయిల భారాన్ని మోపిందని మంత్రి స్పష్టం… -
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
OTR: సాగర సమరం జోరుగా జరుగుతోందా? ఇన్నాళ్ళు నడిచిన కోల్డ్వార్ ఇక ఓపెన్ అయిపోయిందా? పైచేయి కోసం సిట్టింగ్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే చేస్తున్న యుద్ధం గులాబీ గూట్లో సెగలు రేపుతోందా? ఎవరి వెంట నడవాలో తేల్చుకోలేక కేడర్ సైతం గందరగోళంలో పడ్డ పరిస్థితులు ఎక్కడున్నాయి? ఎవరి మధ్య జరుగుతోందా యుద్ధం? నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మధ్య కోల్డ్ వార్ అంతకంతకూ పెరుగుతోంది. ఇది లోకల్గా బీఆర్ఎస్కు పెద్ద…
తాజావార్తలు
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్తో లింకప్ రూమర్స్పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!